-
విపత్తుల వేళ మనకంటే ఒడిశా మేలు
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం మన రాష్ట్రం కంటే మరింత సన్నద్ధంగా ఉంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఆ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ఇక్కడి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫొని తుపాను సహాయక చర్యలపై అత్యవసరంగా సమీక్షించేందుకు గురువారం ఆయన సచివాలయానికి వచ్చారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులు, తన కార్యదర్శులతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. అధికారులు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని, సెల్ ఫోన్లు చార్జింగ్ చేసుకునేలా జనరేటర్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని విపత్తుల ప్రత్యేకాధికారి వర ప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు ముఖ్యమంత్రికి తెలిపారు. 120 క్యాంపులను నిర్వహిస్తున్నామని, ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా సహాయ, ముందస్తు కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం నియమించామని.. టెక్కలి, పలాస కేంద్రాలుగా సూపర్ సైక్లోన్ బృందాలు పని చేస్తున్నట్టు వివరించారు. మండలాల్లో కాకుండా, గ్రామాల్లో తుపాను సహాయ బృందాలను అందుబాటులో వుంచాలని, విశాఖ కేంద్రంగా తాగునీరు, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు అందించేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఫొని తుపాన్ సహాయక చర్యల కోసం కొత్త జీవోలు అక్కర్లేదని, తిత్లీ తుపాను సమయంలో జారీ చేసిన ఆదేశాలనే ఇప్పుడూ అనుసరించాలన్నారు. ఈసీకి లేఖ రాస్తే స్పందించలేదు.. అవసరమైతే తాను క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు వస్తానని, తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల నియమావళిని సడలించాలని భారత ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే స్పందించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ మితిమీరి జోక్యం చేసుకుంటోందని తాను ముందు నుంచీ చెబుతూనే ఉన్నానని తెలిపారు. తుపాన్ ప్రభావం గురించి ఈ సమావేశం నుంచే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఫోన్లో మాట్లాడారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తుపాన్ బాధితులకు అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు. -
నేడే పూరీ రథయాత్ర
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర శనివారం ప్రారంభం కానుంది. ప్రధాన దేవస్థానం నెలకొన్న పూరీ శ్రీ మందిరంలో యాత్ర నిర్వహణకు దేవస్థానం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి. శుక్రవారం సాయంత్రం జగన్నాథుని దేవస్థానం నుంచి ఆజ్ఞామాల రథ నిర్మాణ ప్రాంగణానికి చేరటంతో రథాలను మలుపు తిప్పారు. ప్రధాన దేవస్థానం నుంచి మూల విరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించేందుకు వీలుగా ముందురోజు రథాలను మలుపు తిప్పటం ఆచారం. కాగా, కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా సర్వ మానవాళి జగన్నాథుని యాత్రను తిలకిస్తున్నట్లుగా.. సైకత శిల్పి మానస్కుమార్ సాహు చిత్రీకరించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. -
6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'
ఇంటర్ నెట్ సౌకర్యాన్ని యూనివర్సిటీలు, కళాశాలలకు అందుబాటులోకి తెచ్చేలా ఒడిశా ప్రభుత్వం స్మార్ట్ క్యాంపస్ పథకం అమలు చేస్తోంది. దీనికోసం రూ. 20కోట్లను ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా 6 యూనివర్సిటీలకు, 46 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేటు కళాశాలల్లో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అంతేకాక విద్యాసంస్థలలో అత్యాధునిక స్మార్ట్ క్లాస్ రూంలు, ఈ లైబ్రరీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాబొరేటరీల వంటి సదుపాయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి తేనున్నట్టు ఉన్నతా విద్యాశాఖ మంత్రి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి తెలిపారు. గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సౌకర్యాలను మరొకొన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు నిర్వహణ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్ అధికారులు చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలలో సర్వే ప్రారంభమైనట్టు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement