-
పోలింగ్ బూత్లో అపశృతి..వృద్ధుడు మృతి
-
డెంగీ జ్వరంతో వృద్ధుడు మృతి
నార్పల: డెంగీ జ్వరంతో మూడురోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నార్పల మండలం బి.పప్పూరుకు చెందిన దండువారిపల్లి బాలన్న (65) బుధవారం మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వృద్ధుడిని తోసేసిన తాగుబోతు
పుట్టపర్తి అర్బన్: గొడవపడొద్దని సర్దిచెప్పబోయిన వృద్ధుడిని తాగుబోతు బలంగా తోసేశాడు. రాయిపై పడటంతో బలమైన దెబ్బ తగిలి వృద్ధుడు ప్రాణం విడిచాడు. అర్బన్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపిన మేరకు.. పుట్టపర్తిలోని గోపురం వీధిలో గల అపార్ట్మెంట్లో నివసిస్తున్న మిలటరీ వెంకటేష్ (64), వాచ్మన్ కేశవ, ట్యాక్సీ డ్రైవర్ సురేష్బాబు శనివారం రాత్రి గొడవపడ్డారు. మిలటరీ వెంకటేష్ భార్య జయలక్ష్మి వచ్చి సర్దిచెప్పి పంపింది. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సురేష్బాబు పూటుగా మద్యం తాగొచ్చి మరోసారి వాచ్మన్తో గొడవకు దిగాడు. నిద్రాభంగమైన మిలటరీ వెంకటేష్ అపార్ట్మెంట్ మెంట్ కిందకు వచ్చి గొడవపడొద్దని ఇద్దరినీ మందలించాడు. తాగిన మైకంలో ఉన్న సురేష్బాబు బలంగా తోసేయడంతో రాయిపై పడిన వెంకటేష్ తలకు బలమైన గాయమై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆదివారం పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామం బుక్కపట్నం మండలం అగ్రహారం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దాడికి కారణమైన సురేష్బాబును అరెస్టు చేశామని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపారు. -
వడదెబ్బకు వృద్ధుడి బలి
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం కునుకుంట్లలో భూమే కాటమయ్య(65) వడదెబ్బకు గురై బుధవారం ఉదయం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఒడ్డున ఉన్న ఓసూరమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న ఆయన.. ఉదయమే ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 11.45 గంటలకు ఇంటికొచ్చారు. రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్యాధికారి రవికాంత్, ఎంపీహెచ్ఈఓలు వెంకటయ్య, మనోహర్, పీహెచ్ఎన్ చంద్రకళ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
అగళి (మడకశిర) : అగళి మండలం రామనపల్లిలో తపాలా శాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రుద్రప్ప(65) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఎండవేడిమితో కాళ్లు, చేతుల్లో బొబ్బలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం కూడా పనులు చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అక్కడే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడని వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement