-
ఉల్లి ధర ఢమాల్
దేవరకద్ర: ఒకప్పుడు వినియోగదారులను కన్నీరు పెట్టించిన ఉల్లి.. నేడు రైతు కంట పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనడానికి వ్యాపారులే ముందుకు రావడం లేదు. మార్కెట్లో పోసి వ్యాపారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వచ్చినికాడికే దిక్కు అనుకుంటూ రైతులకు తక్కువ ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు. ఉల్లిపాయల ధరలు మరోసారి పడిపోయాయి. కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న ధరలు క్వింటాకు రూ. 300 నుంచి రూ. 400వరకు తగ్గాయి. గత వారం దేవరకద్ర మార్కెట్కు సెలవు కారణంగా బహిరంగ వేలం జరగక పోవడంతో బుధవారం రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు అమ్మకానికి తెచ్చారు. పాత మార్కెట్ అవరణతో పాటు కొత్త షాపుల అవరణంతా ఉల్లి కుప్పలతో నిండి పోయింది. నాలుగు వేల బస్తాల ఉల్లి పాయలు మార్కెట్కు వచ్చి ఉండవచ్చని వ్యాపారుల అంచనా. ఒక దశలో ట్రాక్టర్లపై వచ్చిన ఉల్లిపాయలను వ్యాపారులు కింద పోయకుండా అలాగే ఉంచారు. రెండు వారాల క్రితం వరకు క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1650వరకు ఉండగా ఈ వారం రూ. 1350కు పడి పోయింది. దీనికితోడు ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు కరువయ్యారు. చాలా కుప్పలను వేలం వేయకుండా రూ.400 నుంచి రూ. 800కు క్వింటాల్ కొనుగోలు చేశారు. వ్యాపారులు వచ్చినా.. ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు వచ్చిన ఉల్లి ధరలు పెరగలేదు. హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారులు వేలంలో ధరలు పెంచడానికి వెనకడుగు వేశారు. అయితే రెండు వారాల ఉల్లిపాయలు ఒకే వారం రావడం వల్ల ఉల్లి ధరలు తగ్గాయని రైతులు అంటున్నారు. తక్కువ మొత్తంలో ఉల్లిపాయలు వచ్చినప్పుడు ఉల్లి ధరలు పెరగడం, ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు ధరలు తగ్గడం పరిపాటిగా మారిందని రైతులు అంటున్నారు. ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం ఉల్లి పాయలను కొనుగోలు చేశారు. చాలామంది ఏడాది పాటు ఇంట్లో నిల్వ చేసుకోడానికి, పెళ్లి పేరంటాల కోసం బస్తాలలో కొనుగోలు చేశారు. ఇక సంతల్లో విక్రయించే వారు తక్కువ వేలం వచ్చిన ఉల్లి కుప్పల నుంచి కొనుగోలు చేశారు. -
మామిడి రైతు నిలువు దోపిడీ
సూర్యాపేట, న్యూస్లైన్ : సూర్యాపేటలోని జనగాం ఎక్స్రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన మూడు ప్రైవేటు మార్కెట్యార్డులు ఉన్నాయి. ఇక్కడినుంచి రోజూ 30లారీల మామిడికాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఈ యార్డులకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి రైతులు మామిడికాయలు విక్రయించేందుకు వస్తున్నారు. రైతుల నుంచి లోకల్ కాయను టన్నుకు 16 వేల నుంచి 23 వేల వరకు, ఇతర ప్రాంతాల కాయలను టన్నుకు రూ.13 నుంచి రూ.15 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటినే రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకు భోపాల్, ఇండోర్, కోల్కతా, నాగ్పూర్, ముంబై, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీకి 15టన్నుల చొప్పున ఎగుమతి అవుతుంది. సుమారు 450 టన్నుల మామిడికాయ ప్రతిరోజూ ఎగుమతి అవుతుంది. కానీ ఈ మార్కెట్ యార్డులకు ఎలాంటి అనుమతులూ లేవు. మార్కెట్కు చెల్లించాల్సిన సెస్ను కూడా చెల్లించడం లేదు. ఒక్క శాతం సెస్ రూపేణా చెల్లించినా ప్రతిరోజు రూ.45వేల ఆదాయం మార్కెటింగ్ శాఖకు వస్తుంది. కానీ వ్యాపారులు ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండానే మామిడికాయను ఖరీదు చేస్తుండడంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఎగుమతి ఇలా.. మార్కెట్కు వచ్చిన పచ్చి మామిడికాయను గ్రేడింగ్ విధానంలో నాలుగు రకాలుగా విభజిస్తున్నారు. కాయసైజును బట్టి డబ్బాలను తయారుచేసి లోడింగ్ చేస్తున్నారు. వాటిలో కార్బైడ్ను పెట్టి సీజ్ చేయడంతో మూడు రోజుల్లో ఆకుపచ్చగా ఉన్న మామిడికాయలు పసుపురంగులోకి మారుతుంటాయి. వారు పంపించాల్సిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత నేరుగా డబ్బాలను ఇప్పితే రంగుమారి నిగనిగలాడుతుంది. వాటిని ఆయా ప్రాంతాల్లో టన్నుకు రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు. కార్బైడ్ ప్యాకింగ్.. కార్బైడ్ను బహిరంగ ప్రదేశాల్లో ప్యాకింగ్ చేయడం వల్ల దానికి గాలిసోకి ఊపిరితిత్తుల వ్యాధి భారీన పడే ప్రమాదముందని డాక్టర్లు తెలుపుతున్నారు. మామిడికాయల ప్యాకింగ్ సమయానికి ముందే మహిళలు, పిల్లలతో కార్బైడ్ పొట్లాలను తయారుచేస్తున్నారు. ఆయా పొట్లాలను మామిడికాయ డబ్బాల్లో అమరుస్తున్నారు. నష్టాల బాటలో కౌలు రైతులు.. లక్షలాది రూపాయలు వెచ్చించి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ యేడు వాతావరణం అనుకూలించక 25 శాతం కూడా దిగుబడి రాలేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నెలలో పూత రావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత వచ్చి రాలిపోయిందని వాపోతున్నారు. దీంతో ఇప్పటికీ 30 శాతం దిగుబడి మాత్రమే వచ్చిందని, మరోనెల రోజుల పాటు మరికొంత దిగుబడి వచ్చే అవకాశముందంటున్నారు. నియంత్రణ లేని చెక్పోస్టులు.. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెక్పోస్టుల వద్ద నియంత్రణ కొరవడింది. మార్కెటింగ్ శాఖ నుంచి అనుమతి పత్రం ఇవ్వకుండానే కొన్ని లారీలను తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల డ్యూటీ లో ఉండాల్సిన అధికారులు కూడా డుమ్మా కొట్టి ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. రోజూ 45 లారీల మామిడికాయ వెళ్తుంటే వ్యాపారుల వద్ద లారీకి రూ.300 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చెక్పోస్టులపై నియంత్రణ చేస్తే మార్కెట్ ఆదా యం పెరుగుతుంది. పాత మార్కెట్లో మామిడి కాయను ఖరీదు చేయాలి సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో మామిడికాయ ఖరీదు చేసేందుకు వసతులు కల్పించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు దూర ప్రాంతాల్లో ఇబ్బందులు పడకుండా పాత మార్కెట్లో ఉన్న షెడ్లలో కాయను పోసుకునేందుకు ఏర్పాటుచేసి వ్యాపారులను మార్కెట్లోకి పిలిపించాలని రైతు సంఘం నాయకుడు మల్లు నాగార్జున్రెడ్డి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement