-
ఆ 4 ఐఫోన్లకు టాటా చెప్పేసిన యాపిల్..
Apple discontinues 4 iPhones: ఐఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ (Apple) ప్రకటించింది. తాజాగా జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series)ను లాంచ్ చేసింది. మరోవైపు పలు ఐఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లో అధికారికంగా నిలిపేసింది. నిలిపేసిన ఐఫోన్లు ఇవే.. యాపిల్ నిలిపేసిన ఐఫోన్ మోడల్లలో ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 13 మినీ, (iPhone 13 mini), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఉన్నాయి. గత ఏడాది రూ. 1,39,900 ధరతో విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ను అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. అలాగే గతేడాదిలోనే రూ. 1,29,900 ధరతో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో మోడల్ను కూడా భారత మార్కెట్లో నిలిపివేసింది. (జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!) ఇక 2021లో రూ. 69,900లకు విడుదలైన ఆపిల్ ఐఫోన్ 13 మినీకి కూడా యాపిల్ వీడ్కోలు పలికింది. నిలిపివేసిన ఐఫోన్లలో మోడల్లలో ఐఫోన్ 12 కూడా ఉంది. 2020లో ఐఫోన్ 12 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,900 ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పటికీ ఈ పాత ఐఫోన్ మోడల్లపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్, ఫ్టిప్కార్ట్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆయా సంస్థలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకూ వీటిని విక్రయిస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇవే.. కాగా యాపిల్ కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 15 (iPhone 15) ప్రారంభ ధర రూ. 79,900. ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ధర రూ. 89,900. ఇక ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లకు ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అధికారిక సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. -
పాత నమూనాలోనే ప్రాణహిత కాల్వలు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గతంలో నిర్ధారించిన నమూనాలోనే ప్రాణహిత ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులు కొనసాగించాలని మంత్రి హరీశ్రావు నిర్ణయించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణ డిజైన్లను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించి త్వరితగతిన అనుమతులు పొందాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో అధికారులతో హరీశ్ సమీక్ష నిర్వహించారు. ప్రాణహితకాల్వ 78వ కి.మీ. నుంచి సుందిళ్ల బ్యారేజీకి టేకుమట్ల వాగు ద్వారా నీటిని గ్రావిటీతో తరలించేందుకు సర్వే జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి కొండపోచమ్మ జలాశయం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే చెల్లించి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రధాన కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ సంస్థలకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి ప్రతి వారం సమీక్ష జరపాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్షిస్తూ గోదావరి నుంచి కిన్నెరసాని, ముర్రేడు వాగు వరకు ప్రాజెక్టు పనులకు ఈ నెలాఖరు దాకా టెండర్లు పిలవాలని ఆదేశించారు. భక్తరామదాసు ప్రాజెక్టు పనులను, శ్రీరాంసాగర్ రెండో దశ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement