-
యాదాద్రి: వైద్యం అందక రిక్షాలోనే వృద్ధురాలి మృతి
సంస్థాన్ నారాయణపురం: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ నిరుపేద వృద్ధురాలు ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యం కోసం వేచి చూసి ప్రాణాలొదిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన పూస బాలమ్మ(80) ఆలనాపాలనా చూసేవారు లేరు. దీంతో కొద్దిరోజుల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నివసిస్తున్న కూతురు సైదమ్మ వద్దకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలమ్మ 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం పీహెచ్సీకి తీసుకొచ్చి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. వైద్యం కోసం గంటపాటు రిక్షాలోనే ఎదురుచూసింది. వైద్యురాలు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. తన తల్లి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సైదమ్మ ఆరోపించింది. ‘ఆహారం తీసుకోకపోవడంతో బాలమ్మ నీరసంగా ఉంది, పల్స్ పడిపోవడంతోనే మృతి చెందింది. నేను సిబ్బందితో నెలవారీ సమావేశంలో ఉన్నా. తెలిసిన వెంటనే వచ్చి పరిశీలించాను’అని వైద్యురాలు దీప్తి వివరణ ఇచ్చారు. -
పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలి మృతి
కుందుర్పి: పింఛన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు గంటల తరబడి వేచి చూసి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... బెస్తరపల్లికి చెందిన లక్ష్మమ్మ (68) మంగళవారం పింఛన్ తీసుకునేందుకు ఉదయం పది గంటలకే గ్రామ సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం మూడుగంటలు దాటినా పింఛన్ అందలేదు. అన్నపానీయాలు లేకుండా వేచి గంటతరబడి వేచి ఉన్న అక్కడే కుప్పకూలిపోయింది. తోటిపింఛన్దారులు పరిశీలించగా ఆమె ప్రాణం విడిచినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
గుంతలో పడి వృద్ధురాలి మృతి
లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి రెవెన్యూ కార్యాలయం ఎదుట గల చింతతోపులోని గుంతలో పడి ఇదే మండలం రాజీవ్కాలనీకి చెందిన బి.ఎల్.నరసమ్మ(70) గురువారం మృతి చెందిన ఏఎస్ఐ సుబ్బరాం నాయక్ తెలిపారు. వృద్ధురాలు అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయేదన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. అయినా ఫలితం లేదు. చివరకు చింతతోపులోని గుంతలో పడి మృతి చెంది ఉండగా పశువుల కాపరులు గుర్తించారన్నారు. వెంటనే తమకు సమాచారం అందించడంతో సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు ఆయన వివరించారు. ఆరా తీయగా.. రాజీవ్కాలనీకి చెందిన నరసమ్మ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీరామప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రైలు కింద పడి వృద్ధురాలు మృతి
అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలువ సమీపంలో గల రైలు పట్టాలపై పడి గుర్తు తెలియని వృద్ధురాలు(65) ఆదివారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలికి కాలు, చేయి సరిగ్గా లేకపోవడంతో వికలాంగురాలిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వడియంపేటకు చెందిన పామిశెట్టి పోలేరమ్మ (70) అంగడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద బొలెరో వాహనాన్ని రివర్స్ తీసుకుంటూ పోలేరమ్మను ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలపాలైన పోలేరమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement