-
శుభకార్యానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
బత్తలపల్లి : రోడ్డుపక్కనున్న బావిలో ఈతకొట్టేందుకు పైనుంచి దూకిన టైల్స్వర్కర్ కడుపుభాగంలో బలమైన దెబ్బతగిలి నీటమునిగి మృతిచెందాడు. ఈదులముష్టూరులో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులతోపాటు ఎస్ఐ హారున్బాషా తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చెందిన టైల్స్వర్కర్ బలిజ వన్నూరుస్వామి (25) తన స్నేహితులు రాము, అనిల్, శేఖర్తో కలిసి బంధువుల గృహప్రవేశం కోసం శుక్రవారం ఆటోలో ధర్మవరం వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగుపయనమయ్యారు. బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని వ్యవసాయ బావి వద్ద కొందరు చిన్నారులు ఈత కొడుతుండడం గమనించారు. ఎండలకు ఉక్కపోతగా ఉండటంతో ఆటోను పక్కన ఆపి ఈతకొట్టేందుకు వెళ్లారు. బావిలో నీరు బాగా ఉండటంతో వన్నూరుస్వామి రెండుసార్లు పై భాగం నుంచి నీళ్లలోకి దూకాడు. మూడోసారి నీటిలోకి దూకినపుడు కడుపుభాగంలో దెబ్బతగిలింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు నీటి అడుగుభాగంలో గాలించి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడక వన్నూరుస్వామి మృతిచెందాడు. తహసీల్దార్ సురేష్బాబు, ఎస్ఐ హారున్బాషా తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి
దుగ్గొండి(నర్సంపేట) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన వరంగల్రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పాశికంటి మహేందర్, రమ దంపతుల కుమారుడు పాశికంటి రాకేష్ (22) అనస్తిషియా డిప్లొమా పూర్తి చేశాడు. అనంతరం గత సంవత్సర కాలంగా హన్మకొండలోని మాక్స్కేర్ ఆస్పత్రిలో అనస్తిషియా అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా తిమ్మంపేట గ్రామం వట్టెంచెరువు కట్ట క్రాస్ తిరుగుతుండగా మహ్మదాపురం నుంచి తిమ్మంపేట వైపుకు ట్రాక్టర్ ఎదురుగా వస్తుండటంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఇదే క్రమంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ రాకేష్ పైనుంచి వెళ్లింది. దీంతో రాజేష్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితమే కూతురు.. పాశికంటి మహేందర్, రమ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఇటీవల 10 రోజుల క్రితం గర్భవతిగా ఉన్న కూతురు అనూషకు అధిక రక్తస్రావం కావడంతో చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందింది. దశదిన కర్మ పూర్తి అయిన వెంటనే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్న పేగులను పొగొట్టుకున్న వారి రోదనలు కంటతడి పెట్టించాయి. మహ్మదాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆటో బోల్తా.. ఒకరి మృతి
వనపర్తి : ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నాగవరంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ మశ్చెందర్రెడ్డి కథనం ప్రకారం.. సహచరుడి కూతురు పెళ్లి సందర్భంగా బుధవారం రాత్రి కొత్తకోటలో నిర్వహించిన ఎదుర్కోళ్ల కార్యక్రమానికి వెళ్లి వేడుక చూసుకుని తిరిగి ఇంటికి ట్రాలీ ఆటోలో వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వనపర్తి మండలం నాగవరం గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్తో కలిపి మొత్తం 13 మంది ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భరత్, రవి, భూపాల్, రాజు గాయాలపాలయ్యారు. మిగతా వారికి ప్రమాదం త్రుటిలో తప్పింది. వీరిలో భరత్(30) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు హైదరాబాద్కు సిఫార్సు చేశారు. వెళ్తుండగానే భరత్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. రవి, భూపాల్, రాజులను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అంజికి స్వల్ప గాయాలపాలయ్యారు. అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దేవరకొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి దేవరకొండ పట్టణ శివారులో చోటుచేసుకుంది. దేవరకొండ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం బొల్లనపల్లి పెద్దతండాకు చెందిన జర్పుల శంకర్(30), కాట్రావత్ కిషన్, కాట్రావత్ కల్యాణ్ కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న తమ బంధువు వివాహానికి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో దేవరకొండపట్టణ శివారులోకి రాగానే దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్ మృతిచెందాడు. గాయలపాలైన కాట్రావత్ కిషన్, కాట్రావత్ కల్యాణ్ను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. శంకర్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు ఢీ: ఒకరు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా అతడిని నాయుడుపేటకు చెందిన కాశి గురుప్రసాద్గా గుర్తించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తిరుపతి వెళ్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement