-
ఓఎన్జీసీ కార్మికులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, యానాం : ఓఎన్జీసీ కాంట్రాక్ట్ కార్మికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రజాసంకల్పయాత్ర 203వ రోజు పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ వారి తాను ఉన్నానంటూ భరోసానిస్తున్న రాజన్న తనయుడు వైఎస్ జగన్కు ఓఎన్జీసీ కార్మికులు తమ కష్టాలు చెప్పుకున్నారు. అకారణంగా నిన్నటినుంచి 36 మందిని పనిలోంచి తొలగించారని కార్మికులు వాపోయారు. ‘ఓఎన్జీసీ ఫైర్ ఫైటర్స్ సంస్థలో జరిగే ప్రమాదాలతో పాటు చుట్టుపక్కల ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా స్పందిస్తున్నాం. ఓఎన్జీసీ సంస్థ ప్రారంభం నుంచి మేం పనిచేస్తున్నాం. ఆ పదివేల జీతానికి కూడా నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించి మమ్మల్ని పనిలోంచి తొలగిస్తున్నారు. మా భూములు తీసుకుని ఉపాధి కల్పించినట్లే కల్పించి.. కార్మికులను తొలగించడం ఎంతవరకు న్యాయం. 36 మందిని పనిలోంచి తొలగించి కేవలం ముగ్గురుతో ఎలా నెట్టుకొస్తారు. అత్యంత ప్రమాదకరమైన పెట్రోలియం ప్లాంట్లలో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించినా పట్టించుకోవడం లేదు. తమను ఉద్యోగంలో కొనసాగించడంతో పాటు పర్మినెంట్ చేయాలని కోరుతున్నాం. మాకు న్యాయం జరిగేలా చూడాలన్నా’ అంటూ ఓఎన్జీసీ కాంట్రాక్ట్ కార్మికులు జననేత వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని కార్మికులకు వైఎస్ జగన్ భరోసా కల్పించి ముందుకు సాగుతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొమరగిరి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్ యానాం చేరుకున్నారు. సుంకరపాలెం, చింతకులవరిపేట, ఇంజారం మీదుగా కోలంక వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సోమవారం కొనసాగనుంది. -
జీజీఎస్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
గొల్లపాలెం (మలికిపురం) : గ్రామాభివృద్ధి విషయంలో ఓఎన్జీసీ వైఖరికి నిరసనగా మలికిపురం మండలం గొల్లపాలెంలో గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. జీజీఎస్ ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 25 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా వందలాది మంది మహిళలు, గ్రామస్తులు శిబిరం కూర్చొన్నారు. కాకినాడ డీఎస్పీ వి.విజయరావు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జీజీఎస్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఓఎన్జీసీ అధికారుల తరపున గ్రామస్తులతో చర్చించారు. ఆయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల బావులు దెబ్బతినే అవకాశం ఉందని, బావులు మూసుకుపోతే ఒక్కొక్క బావిని మరలా తెరిచేందుకు రూ.కోటికి పైగా ఖర్చవుతుందని ఓఎన్జీసీ అధికారులు ఆందోళన చెందుతున్నట్టు వివరించారు. కొన్ని ట్యాంకులు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చి, స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు భీష్మించారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు సెప్టెంబర్ ఒకటో తేదీన వస్తారంటున్నారని చెప్పారు. అప్పటి వరకూ ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామం నుంచి కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు తరలించుకు పోతున్న ఓఎన్జీసీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు ఈ ఆందోళన చేపట్టారు. డీఎస్పీ వైఖరితో ఉద్రిక్తత : ఎమ్మెల్యే ఆగ్రహం మలికిపురం : గొల్లపాలెం ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీజీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులను బలవంతంగా తొలగించేందుకు కాకినాడ డీఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో పోలీసులు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు ఫోన్లో తెలిపారు. వెంటనే అక్కడి చేరుకున్న ఎమ్మెల్యే సూర్యారావు డీఎస్పీతో పాటు ఓఎన్జీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తుల పోరాటం చేస్తుంటే, వారి ఆవేదన వినేందుకు ఒక్క ఓఎన్జీసీ అధికారి కూడా రాకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. లాఠీ చార్జీ చేస్తే.. ముందు తనపై చేయాలని చెప్పారు. ఓ కేంద్ర మంత్రి హస్తం? గొల్లపాలెంలో ఉద్రిక్తతకు ఓ కేంద్ర మంత్రి వైఖరి కారణమని తెలుస్తోంది. గొల్లపాలెం జీజీఎస్లో ఆయనకు కాంట్రాక్టు ఉందని, ఈ ఆందోళనల వల్ల ఆయన పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్టు తెలిసింది. దీంతో ఆ మంత్రి.. కలెక్టర్, ఎస్పీలకు ఫో¯Œæలో హుకుం జారీచేశారని, దీంతో పోలీసులు, స్థానిక ఓఎన్జీసీ అధికారుల చర్యల వల్ల ఉద్రిక్తత ఏర్పడినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆగ్రహంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement