-
ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు!
గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో ఉల్లి ఘాటెక్కిపోతోంది. భారతీయ మార్కెట్లో ధరల నియంత్రణతో పాటు, సరఫరా మెరుగుపరచడానికి కేంద్రం నిన్న 40 శాతం టాక్స్ విధించింది. ఢిల్లీ ప్రజలకు ఉల్లి ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి తక్కువ ధరకే విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) నిర్ణయించింది. కావున రేపటి నుంచి దేశ రాజధానిలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ను రూపొందించింది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రారంభంలో ఢిల్లీలో బఫర్ ఉల్లిపాయలను రిటైల్ చేయడం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా.. ఢిల్లీలో రేపు సుమారు 10 మొబైల్ వ్యాన్లు దీని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ తరువాత క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరకే ఉల్లి విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
ముఖ్యమంత్రిని పరుగులు పెట్టిస్తున్న ధరలు
న్యూఢిల్లీ:పొట్టిగా ఉండే ఉల్లి షీలా పుట్టి ముంచుతుందా? ఆమె కలవరపడుతున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది. గతంలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కూడా ఉన్న ఉల్లి సరిగ్గా ఢిల్లీ విధానసభ ఎన్నికలకు ఆరు వారాల ముందే ఉల్లి ఘాటెక్కుతుండడంతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్తోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కలవరపడుతోంది. వీలైనంత త్వరగా ఉల్లి ధరలను నేలపైకి తెచ్చేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే షీలాదీక్షిత్ గురువారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్పవార్, ఆహారశాఖ మంత్రి కేవీ థామస్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. ఉల్లిధరను తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. నగరంలో ఉల్లి ధరను నియంత్రించడం కోసం లాభనష్టాలతో ప్రమేయం లేకుండా ఢిల్లీవాసులకు అవసరమైనంత ఉల్లిపాయలను అందించవలసిందిగా నాఫెడ్ను ఆదేశించాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఆమె చెప్పారు. ఉల్లిని మొబైల్ వ్యాన్ల ద్వారా మళ్లీ విక్రయించడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సర్కారు ఎన్నికల కమిషన్కు లేఖ రాయనుందన్నారు. గతంలో కూడా ఉల్లిని నగరంలో పలుచోట్ల మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయించామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం వల్ల నిలిపివేసిన ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టడానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాయనున్నట్లు ఆమె చెప్పారు. రాజధానికి ఉల్లి సరఫరా మెరుగుపరచడ్డం కోసం రాష్ట్ర అధికారుల బృందాన్ని మహారాష్ట్రకు పంపినట్లు చెప్పారు. అధికారులు నాసిక్ చేరుకున్నారని, నాసిక్, కొల్హాపుర్ నుంచి దాదాపు 1000 టన్నుల ఉల్లి త్వరలో ఢిల్లీకి రానుందన్నారు. పుణేలో ఉల్లి ధరకిలో 40 రూపాయలు ఉందన్న సంగతి తెలిసిం దని, అధికారులు అక్కడికి కూడా వెళ్తారని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాచ్ చవాన్తో కూడా మాట్లాడానన్నారు. ఈ విషయంలో ఢిల్లీకి వీలైనంత సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని షీలాదీక్షిత్ చెప్పారు. ఉల్లిపండే ప్రాంతాల్లో భారీ వర్షాల కార ణంగా పంట దెబ్బతిందని, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో రాజధానిలో ఉల్లి ధర తగ్గుతుందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని ఉల్లిని అక్రమం గా నిల్వ చేయరాదని వ్యాపారులను కోరారు. పరిస్థితిని అవకాశంగా తీసుకోరాదంటూ హెచ్చరించారు. ప్రతిపక్షాల ఎద్దేవా... ఉల్లి ధరలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయి. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ విసిరిన సవాలు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబు ఇవ్వడానికి నిరాకరించారు. ఉల్లిధరలను తగ్గించే విషయమై షీలాదీక్షిత్ కేంద్ర మంత్రిని కలవడాన్ని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఓ నాటకంగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని విక్రయించడానికి షీలాదీక్షిత్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా లేదా అన్నది ముఖ్యం కాదని, మొబైల్ వ్యాన్లలో ఉల్లిని అమ్మితే కొనుక్కోవడానికి ప్రజలు దరియాగంజ్ వరకు రావాలా? అని ప్రశ్నించారు. ఇదంతా ప్రజల కంట్లో దుమ్ముకొట్టే వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. ఉల్లి ధర షీలాను కంటతడి పెట్టిస్తోందని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కరీ విమర్శించారు. ఉల్లి ధరలను నియంత్రిచలేకపోయిన కాంగ్రెస్కు అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. ఉల్లిపాయలు ఢిల్లీలో బీజేపీ సర్కారు కొంపముంచాయని, ఆ తరువాత బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ కొంప ముంచుతాయని జేడీయూ ఎంపీ కేసీ త్యాగి విమర్శించారు. -
మళ్లీ ఉల్లి ఘాటు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఉల్లి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ గగన మార్గం పడుతున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.55 దాకా పలుకుతుండగా, చిల్లర మార్కెట్లో సైజును బట్టి రూ.65 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు. దీపావళి నాటికి టపాకాయలు బదులు ఉల్లి బాంబులా పేలుతుందని అప్పుడే వ్యంగ్యోక్తులు వినబడుతున్నాయి. బాగలకోటె, గదగ జిల్లాల నుంచి ఉల్లి మార్కెట్కు వస్తే ధర మరింత తగ్గవ చ్చని వ్యాపారులు చెబుతున్నారు. గదగలో బంపర్ క్రాప్ పండిందని విన వ చ్చిన ప్పటికీ, ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల పంట నష్టం జరిగిందని చెబుతున్నారు. అదే కనుక నిజమైతే కేజీ రూ.వంద దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మహారాష్ట్ర న ుంచి పంట వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. ఇప్పటికే వంటల్లో ఉల్లి వినియోగాన్ని చాలా వరకు తగ్గించేశారు. గతంలో కేజీలు లెక్కన తీసుకెళ్లే వారు ఇప్పుడు పావు కేజీ, అర కిలోతో సర్దుకు పోతున్నారు. ఉల్లితో బాగా ముడిపడి ఉండే వంటలను తగ్గించేశారు. గతంలో నగరంలోని మాంసాహార హోటళ్లలో అడగకున్నా పిడికెడు ఉల్లి పాయలు ఇచ్చే వారు. ఇప్పుడు అడిగినా వాటిని చూపించడం కూడా లేదు. ఉల్లి ధర పాత స్థాయికి వచ్చేంత వరకు ఇంతేనని హోటళ్ల యజమానులు తెలిపారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
Advertisement