-
ఈ–కిరాణాలో హోరాహోరీ
ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ఈ–గ్రోసరీ సెగ్మెంట్ఈ–గ్రోసరీ సెగ్మెంట్ (ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్ ఆర్డర్ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్ కేక్. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, –మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింతగా గుమ్మరించడం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్గా ఉన్న బిగ్బాస్కెట్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం కోసం పేటీఎమ్కు చెందిన ఈ టైల్ ప్లాట్ఫామ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఫ్లిప్కార్ట్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్మార్ట్ సంస్థ ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తన ఈ కామర్స్ నెట్వర్క్ను మరింత పటిష్టం చేయబోతోంది. అంతేకాకుండా ఇటీవలనే మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్ కంపెనీ కూడా ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసం భారీగా పెట్టుబడులు గుమ్మరించబోతోంది. బిగ్బాస్కెట్ కోసం పేటీఎమ్ మాల్... బిగ్బాస్కెట్ మొదటగా బెంగళూరులో తన కార్యకలాపాలు ఆరంభించింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్ను డెలివరీ చేస్తోంది. 20,000పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. లో అత్యధిక మార్కెట్ వాటా బిగ్ బాస్కెట్దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్బాస్కెట్కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా. ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినప్పటికీ, ఈ కంపెనీ ఇంకా బ్రేక్ ఈవెన్కు రాలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్కు చెందిన ఈ టైల్ ప్లాట్ఫార్మ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించిన చర్చలు గత ఏడాదే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని సమాచారం. వాల్మార్ట్ సంస్థ, భారత్లో ఈ కామర్స్ సంస్థతో టై–అప్ కుదుర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినప్పటినుంచే బిగ్బాస్కెట్లో మెజారిటీ వాటా కొనుగోలుకు పేటీఎమ్ చర్చలు జరపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బిగ్బాస్కెట్తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎమ్కు దన్నుగా నిలుస్తున్న అలీబాబా.. బిగ్బాస్కెట్లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా పేర్కొంది. విలువ దగ్గరే పీటముడి ? బిగ్బాస్కెట్–పేటీఎమ్ మాల్ డీల్ విషయమై... బిగ్బాస్కెట్ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైననే పీటముడి పడినట్లు బిగ్బాస్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశం తేలకనే చర్చలు ముందుకు సాగట్లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకుగాను పేటీఎమ్ మాల్లో తమకొక డైరెక్టర్ పదవి కావాలని కూడా బిగ్బాస్కెట్ కోరుతోందని సమాచారం. డీల్ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్బాస్కెట్కు ప్రీమియమ్ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి. బిగ్బాస్కెట్ అయితే బావుంటుంది..! ఈ కామర్స్ స్పేస్లో అమెజాన్–ఫ్లిప్కార్ట్ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్ మాల్ ఈ కామర్స్ స్పేస్లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్బాస్కెట్లో వాటా కొనుగోలు కోసం పేటీఎమ్ మాల్ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని నిపుణులంటున్నారు. బిగ్బాస్కెట్తో టై అప్ వల్ల పేటీఎమ్ మాల్కు రిపీటెడ్ కస్టమర్లు లభిస్తారని, ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్బాస్కెట్తో జత కడితే అది పేటీఎమ్ మాల్కు, బిగ్బాస్కెట్.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు. ఈ–గ్రోసరీదే హవా... ఆన్లైన్ మార్కెట్ సంస్థలకు భవిష్యత్తులో గ్రోసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని రెండేళ్ల క్రితమే అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అంచనా వేశారు. అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఐదేళ్లలో ఆన్లైన్ వ్యాపారంలో సగం వాటా గ్రోసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ గ్రోసరీ మార్కెట్ జోరు అంతకంతకూ పెరగనున్నదని గుర్తించిన అన్ని ఈ–కామర్స్ సంస్థలు గ్రోసరీస్పేస్లో మరింత మార్కెట్ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాల్మార్ట్ నుంచి సూపర్మార్ట్... అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ తదితర సంస్థలు ఈ గ్రోసరీ సెగ్మెంట్లో మరింత వాటా కొల్లగొట్టడంపై దృష్టి పెట్టాయి. ఇటీవలనే ఫ్లిప్కార్ట్ను కొనుగోలు చేసిన వాల్మార్ట్...ఈ గ్రోసరీ సెగ్మెంట్ కోసమే 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్లైన్ గ్రోసరీ విభాగాన్ని సూపర్మార్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్బై ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్కార్ట్ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సప్లై చెయిన్ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే 8,000 స్టోర్స్ను నిర్వహిస్తోంది. భారత్లో నాలుగో అతి పెద్ద రిటైల్ చెయిన్ మోర్ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు. ♦ రూ.1,460 కోట్లు–బిగ్బాస్కెట్లో ఆలీబాబా ఇన్వెస్ట్ చేసిన మొత్తం ♦ రూ.2,920 కోట్లు –ఈ–గ్రోసరీ కోసం వాల్మార్ట్–ఫ్లిప్కార్ట్ ఇన్వెస్ట్ చేయనున్న మొత్తం ♦ రూ.4,200 కోట్లు–మోర్ కోసం అమెజాన్, సమర క్యాపిటల్లు వెచ్చించిన మొత్తం ♦ 8,000– రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య. ఈ స్టోర్స్ను ఈ–గ్రోసరీ కోసం వినియోగించాలనుకుంటున్న రిలయన్స్ -
ఆర్డరు ఇచ్చిన మర్నాడే డెలివరీ..
- హైదరాబాద్లో సేవలు - ప్రారంభించిన ఆస్క్మీబజార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఆస్క్మీబజార్.. నెక్స్ట్ డే డెలివరీ (ఎన్డీడీ) విధానాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డరు ఇచ్చిన తర్వాతి రోజు లేదా 24 గంటల్లో డెలివరీ ఇవ్వడం ఈ సేవల ప్రత్యేకత. వెబ్సైట్లో హైదరాబాద్ పేజీలో ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయాన్సెస్, బేబీకేర్ తదితర 13 విభాగాల్లో 5,000 పైచిలుకు ఉత్పత్తులను పొందుపరిచారు. ఎన్డీడీ కింద ఇచ్చే డెలివరీకి అదనంగా ఎటువంటి చార్జీ చేయరు. ఈ విధానాన్ని ప్రస్తుతం 22 నగరాల్లో కంపెనీ అమలు చేస్తోంది. అక్టోబరు చివరికల్లా 50 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ఎన్డీడీ హెడ్ మరీచి మాథుర్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లోనూ అడుగు పెడతామని చెప్పారు. బ్రాండెడ్ ఉత్పత్తులను తక్కువ ధరలో విక్రయించడం వెబ్సైట్ ప్రత్యేకత అని వివరించారు. త్వరలో నిత్యావసరాల విక్రయాలు.. కూరగాయలు, పప్పుదినుసుల వంటి నిత్యావసరాల ఆన్లైన్ విక్రయాలను కంపెనీ ప్రస్తుతం దేశ రాజధాని ప్రాంతంలో పైలట్ కింద చేపట్టింది. 3-6 నెలల్లో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ సేవలు ప్రారంభం అవుతాయని మాథుర్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యాప్లకు భిన్నంగా ఈ సేవలను తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, ఆస్క్మీబజార్ ఒక నగరంలోని విక్రేతలు, వినియోగదారులను అనుసంధానిస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ, ఈఎంఐ, కార్డు ద్వారా చెల్లింపుల సౌకర్యం ఉంది. -
స్నాప్డీల్, హెచ్డీఎఫ్సీల కో బ్రాండెడ్ ఈ కామర్స్ క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు విసా సహకారంతో కో-బ్రాండెడ్ ఈ కామర్స్ క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చాయి.ఈ కార్డ్తో ఆన్లైన్ చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్డీల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్ద్వారా చెల్లింపులు చేసేవారికి రివార్డ్ పాయింట్లను కూడా ఇస్తామని పేర్కొంది. ఈ కార్డ్ కోసం స్నాప్డీల్ (వెబ్సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. -
స్నాప్డీల్లో మైక్రోసాఫ్ట్ స్టోర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్లో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్రాండెడ్ ఆన్లైన్ స్టోర్ ను ప్రారంభించింది. స్నాప్డీల్లో మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్నాప్డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్) టోనీ నవీన్ చెప్పారు. ఈ ఆన్లైన్ స్టోర్లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఫోన్లు, ట్యాబ్లు, పీసీలు, సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులు పెరుగుతున్నారని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్ ఓఈఎం డెరైక్టర్ శర్లిన్ తాయిల్ చెప్పారు. తాము స్నాప్డీల్లో ఆన్లైన్లో ఏర్పాటు చేసిన స్టోర్ ద్వారా మంచి అమ్మకాలు సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement