-
సెల్ బుక్ చేస్తే సబ్బు వచ్చింది
కాళేశ్వరం(మంథని): టీవీలో ప్రకటన చూసి సెల్ఫోన్ కోసం ఆర్డర్ ఇవ్వగా, దాని బదులు సబ్బు రావడంతో మోసపోయానని ఓ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ అంకం రాజబాపు టీవీలో ఓ కంపెనీకి సంబంధించి 4జీ సెల్ఫోన్ ప్రకటన చూశాడు. దాని విలువ రూ.3,390 ఉన్నట్లు చెప్పగా, వెంటనే స్క్రీన్పై ఉన్న 04067037189 నంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాడు. కొద్ది రోజులకు పార్శిల్లో డబ్బులు చెల్లించి తీసుకున్నాడు. అందులో వచ్చిన సెల్ఫోన్ 20 రోజులకే సాఫ్ట్వేర్ పోయింది. సెల్ఫోన్కు ఆ కంపెనీ సంవత్సరం వారంటీ ఇవ్వగా బాధితుడు స్క్రీన్పై ఉన్న 04067037189 నంబర్కు ఫోన్ చేయగా, మరో 9560942125, 9650755884 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఆ నంబర్లకు కాల్ చేయగా సిబ్బంది సూచన మేరకు సాఫ్ట్వేర్ పాడైన ఫోన్ను తిరిగి కంపెనీ అడ్రస్, ఫోన్ ఫొటోలు తీసి ఆయా నంబర్లకు వాట్సప్లో పంపాడు. 15 రోజుల తర్వాత కంపెనీ స్టిక్కరింగ్తో పార్శిల్ వచ్చింది. విప్ప చూడగా సబ్బు ఉండటంతో అవాక్కయ్యాడు. మళ్లీ అవే నంబర్లకు ఫోన్ చేయగా పొరపాటు జరిగిందని, మళ్లీ కంప్లేంట్ తీసుకుంటున్నామని సిబ్బంది చెప్పారు. రెండు రోజుల క్రితం మళ్లీ పార్శిల్ రాగా విప్పి చూడటంతో ఘడి డిటర్జెంట్ సబ్బు వచ్చింది. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. మళ్లీ ఆయా నంబర్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని వాపోయాడు. టీవీలో, ఆన్లైన్లో వస్తువుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి మోసం చేస్తున్నారని, సైబర్ క్రైం పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అంకం రాజబాపు కోరుతున్నాడు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా!
రైతుల బలవన్మరణాలను అడ్డుకోలేని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బెంగళూరు: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల వరుస ఆత్మహత్యలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని, అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. హుబ్లీలోని ఎపీఎంసీ మార్కెట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక లాంటి వారని, వారికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రాలకు సాయం అందించేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మార్కెటింగ్ సౌలభ్యం ఒక విప్లవాత్మక పరిణామమని ఈ సదుపాయం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దళారుల చేతుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అంతేకాక ఈ-మార్కెటింగ్ సౌలభ్యంద్వారా పారదర్శకతకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని దాదాపు 585 వ్యవసాయ మార్కెట్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement