-
భద్రం బ్రదర్.. సీవోడీనే బెటర్
మహేశ్వరి అనే మహిళ ఈ–కామర్స్ వెబ్సైట్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా ల్యాప్టాప్ కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకున్న తరువాత తెరిచి చూస్తే ఆమె ఆర్డర్ పెట్టిన కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా వేరే సాఫ్ట్వేర్తో ఉన్న నకిలీ ల్యాప్టాప్ వచ్చినట్టు గ్రహించింది. ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కు ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ.. పట్టించుకోలేదు. కంపెనీ కార్యాలయానికి వెళితే ఆమె ఫిర్యాదును పరిష్కరించే బాధ్యులెవరూ కనిపించలేదు. చేసేది లేక అదనంగా సొమ్ము చెల్లించి ఆ ల్యాప్టాప్లోనే తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా ఎంతోమంది.. ఎన్నో విధాలుగా మోసపోతున్నారు. – సాక్షి, అమరావతి ఆన్లైన్ షాపింగ్ మారుమూల పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ చేస్తే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా వేరొకటి రావడం.. వస్తువును రిఫండ్ చేస్తే డబ్బులు తిరిగి రాకపోవడం వంటి మోసాలు పెరుగుతున్నాయి. నగదు చెల్లించినా వస్తువు రాకపోవడం.. క్రెడిట్, డెబిట్ కార్డులను తస్కరించి వేరొకరు ఆన్లైన్ షాపింగ్ చేయడం వంటి మోసాలెన్నో జరుగుతున్నాయి. ఇలా మోసపోతున్న వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మన దేశంలో ఈ–కామర్స్ వ్యాపారంపై నిర్దిష్ట నిబంధనలు లేవు. కానీ.. వినియోగదారుల రక్షణ చట్టం–1986, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం 2008, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలైన నియంత్రణ సంస్థలచే నిర్దేశించిన విధానాలు ఈ–కామర్స్ సంస్థలకు కూడా వర్తిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలంటే.. ఈ–కామర్స్ సంస్థల చేతిలో ఎవరైనా మోసపోతే.. ‘కన్సూమర్ కోర్ట్ ఆన్లైన్ ఇండియా’, కన్సూమర్ ఫోరమ్, కమిషన్లలో ఫిర్యాదు చేయొచ్చు. వీటికి వెబ్సైట్, యాప్, టీవీ షాపింగ్ షో ద్వారా ఆర్డర్ చేసి రిఫండ్ లేదా రీప్లేస్మెంట్ పొందకపోవడం, ఆలస్యంగా డెలివరీ చేయడం, తప్పుదారి పట్టించే ప్రమోషన్ల వంటి వాటిపై పైన పేర్కొన్న సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి ముందు ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేయాలి. ప్రతి ఈ–కామర్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిర్దేశించిన విధంగా ఫిర్యాదు అధికారిని అందుబాటులో ఉంచాలి. ఆ వివరాలు కంపెనీ వెబ్సైట్లో ఉండాలి. మీ ఫిర్యాదును సదరు అధికారికి తెలియజేయండి. కొన్ని ఈ–కామర్స్ కంపెనీలు మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరిస్తాయి. అది సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇలా చేసినా ప్రయోజనం లేకపోతే డీలర్, తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్ పేర్లు, చిరునామాలను సేకరించండి. ఆ చిరునామాలకు సమస్యను రిజిస్టర్ పోస్ట్ ద్వారా రాసి పంపండి. గడువు ముగిసిన తర్వాత మీకు ఎలాంటి స్పందన రాకపోతే వినియోగదారుల ఫోరమ్, కమిషన్ను ఆశ్రయించండి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ–కామర్స్ వినియోగదారులు తమ సొంత నగరంలోని వినియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. ‘సైబర్’ భద్రత ఇలా.. ఇటీవల రోగ్ (నకిలీ) వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా తప్పుడు వివరాలతో నకిలీ ఈ–కామర్స్ వెబ్సైట్లు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వీటిని గుర్తించి నిషేధించినా మరో పేరుతో మళ్లీ వస్తున్నాయి. వాటిని తెరిస్తే మనకు తెలియకుండానే మన కార్డుల్లో నగదు ఖర్చవుతుంటుంది. ఇలాంటి నకిలీ, పైరసీ వంటి నేరాల బారినపడిన బాధితులు 24 గంటల్లోపు ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’లో ఫిర్యాదు చేయాలి. సంబంధిత అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా సైబర్ మోసగాళ్లను కనిపెడతారు. నకిలీలను ప్రోత్సహించే డొమైన్పై నేషనల్ ఇంటర్నెట్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుకు వెళ్లి అనధికార లావాదేవీలపై ఫిర్యాదు చేయడం ద్వారా కార్డును బ్లాక్ చేసి, నగదును తిరిగి పొందవచ్చు. అన్నిటికంటే ముందు ఈ–కామర్స్ సైట్ అడ్రస్ను ప్రభుత్వం అందిస్తున్న రిజస్ట్రీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వెతికితే అది అసలైనదో, నకిలీదో తెలిసిపోతుంది. సురక్షిత ఆన్లైన్ షాపింగ్ కోసం.. ► తెలియని ఈ–కామర్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేయడానికి ముందు వాటిని పరిశోధించండి. అనుమానం ఉంటే కొనుగోలును ఆపేయాలి. ► మొదటిసారి సైట్ నుంచి కొనుగోలు చేస్తుంటే క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోండి. ► కొనుగోలు చేయడానికి ముందు నిబంధనలు, గోప్యతా విధానాన్ని చదవండి. ► డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్ థర్డ్ పార్టీతో షేర్ చేస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోండి. ► ఆర్డర్ రద్దు, వాపసు విధానాలను, నియమాలను చదివి అర్థం చేసుకోండి. ► ఈ–కామర్స్ కంపెనీ చిరునామా, ఈ–మెయిల్, ఫోన్ నంబర్, హెల్ప్లైన్ వంటి కస్టమర్ కేర్ వివరాలు వాస్తవమో కాదో నిర్ధారించుకోండి. ► ఉత్పత్తి, వారంటీ వివరాలు తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి. ► నగదు చెల్లించడానికి ముందు, ఆ వస్తువును కంపెనీ మీ పిన్కోడ్కు డెలివరీ చేస్తుందో లేదో చూసుకోండి. ► ఒకవేళ కంపెనీ ధర, వస్తువు వివరణను ఆర్డర్ చేసిన తర్వాత మార్చవచ్చు. కాబట్టి కొనుగోలు చేసిన వెంటనే ఆర్డర్ వివరాలు స్క్రీన్షాట్ తీసుకోండి. ► ఎక్స్చేంజ్ , రిఫండ్ వంటి క్లెయిమ్ల విషయంలో జాగ్రత్త వహించండి. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వస్తువు లోపభూయిష్టంగా ఉంటే కంపెనీలు ఎక్సే్చంజ్, రిఫండ్ చేయాలి. -
ఆన్లైన్ ‘సెక్యూరిటీ’ కొద్ది మందికే!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ పెద్ద ఎత్తున అధికమైంది. ప్రధానంగా పండుగల సీజన్లో గణనీయంగా పెరిగింది. సైబర్ నేరస్తులు ఈ ట్రెండ్ను క్యాష్ చేసుకుంటున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ మెకాఫీ మంగళవారం వెల్లడించింది. మెకాఫీ అడ్వాన్స్డ్ థ్రెట్ రిసర్చ్ టీమ్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతి నిముషానికి 419 సైబర్ నేరాలు నమోదయ్యాయి. జనవరి–మార్చితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయడంతో కస్టమర్లు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడుతున్నారు. నేరస్తుల చేతుల్లోకి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చేరుతోంది. ఆన్లైన్ కోనుగోలుదారుల్లో 27.5 శాతం మంది మాత్రమే సెక్యూరిటీ సొల్యూషన్స్ను వినియోగిస్తున్నారు. ఇది సైబర్ నేరస్తులకు వరంగా మారుతోందని మెకాఫీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకట్ కృష్ణపూర్ తెలిపారు. ఆన్లైన్ ముప్పుపట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నారు. చదవండి: లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన -
పోస్టల్ ఆదాయాలకు ఈ-రిటైల్ బూస్ట్
ముంబై : ఈ-మెయిల్స్, మొబైల్ ఫోన్ల రాకతో కాస్త కుదేలయిన పోస్టల్ శాఖకు .. ఆన్లైన్ షాపింగ్ సంస్థల రూపంలో ఆదాయాలు పెంచుకునేందుకు కొత్త మార్గం లభించింది. ఈ-కామర్స్ సైట్లు తమకొచ్చే ఆర్డర్లను డెలివరీ చేసేందుకు పోస్టల్ సర్వీసులను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఈ-కామర్స్లో అవకాశాలను గుర్తించిన పోస్టల్ శాఖ, వాటిని అందిపుచ్చుకునేందుకు ఈ-కామర్స్, పార్సిల్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కేవలం ఈ-కామర్స్ సంస్థల ఆర్డర్లను డెలివరీ చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రెట్టింపునకు కృషి జరుగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement