-
కష్టపడి చదివి.. ఎస్సై పోస్టుకు ఎంపికై ..
కందుకూరు రూరల్: ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తల్లి కష్టపడి చదివించింది. అతను ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో 398వ ర్యాంక్ సాధించాడు. వివరాలిలా ఉన్నాయి. వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన నేలకూరి వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు ఏడుకొండలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 8 నుంచి 10 వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీటీసీ సింగరాయకొండ పీఎన్సీఏలో పూర్తి చేశాడు. ఉపాధ్యాయ పోస్ట్ సాధించాలని కోచింగ్ తీసుకొని రెండుసార్లు డీఎస్సీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. అనంతరం ఆర్థిక పరిస్థితులతో చదువు కొనసాగించలేక, ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాధ్యతంతా తల్లి మీదే పడింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకుని కాకినాడలో కోచింగ్కు వెళ్లాడు. తల్లి ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజులకు నగదు పంపేది. ఏడుకొండలు పరిస్థితిని గమనించి గ్రామానికి చెందిన అనుమోలు రవీంద్ర, మాదాల లక్ష్మీనరసింహం ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. చదువే ఆయుధం కష్టాలు ఉన్నాయని కుంగిపోతే చదువుకోలేం. ఇష్టపడి చదవాలి. తల్లి రెక్కల కష్టం నాకు తెలిసొచ్చింది. అందుకే పట్టుదలతో చదివి ఎస్సై పోస్టు సాధించాను. పేదలకు చదువే ఆయుధం. – నేలకూరి ఏడుకొండలు -
అంతా ‘ఓపెన్’.. చూస్కో, రాస్కో
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..) -
జులై 17న దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
కల్లూరు (రూరల్): సిల్వర్ జూబ్లీ కళాశాలలోని అంబేడ్కర్ రీజనల్ సెంటర్లో దూర విద్య సప్లిమెంటరీ పరీక్షలు జులై 17నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఏపీ ఆన్లైన్లో చెల్లించడానికి ఈ నెల 28న ఆఖరని, ప్రతి పరీక్షకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీజీ మొదటి సంవత్సరం జులై 17 నుంచి 22వరకు, ద్వితీయ సంవత్సరం 24 నుంచి 29 వరకు, ఎంబీఏ మూడవ సంవత్సరం 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరవ్వాలని, ఇతర వివరాలకు అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. -
ఏప్రిల్ 25 నుంచి దూరవిద్య పరీక్షలు
కర్నూలు (ఆర్యూ) : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దూర విద్య వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహిస్తునట్లు కర్నూలు రీజనల్ సెంటర్ సహాయ సంచాలకులు డా.ఎం.అజంతకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు కింద ప్రతి పేపర్కు రూ.100 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీలోగా ఏపీ ఆన్లైన్లో చెల్లించాలన్నారు. మూడవ సంవత్సరం రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే నెల 2 నుంచి 7వ తేదీ వరకు, మొదటి సంవత్సర పరీక్షలు మే నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలకు బీ.క్యాంపు సిల్వర్ జూబ్లీ కళాశాలలోని స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు. -
ఓపెన్ యూనివర్సిటీ తరగతులు రద్దు
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రంలో ఈనెల 6న తరగతులు రద్దు చేసినట్లు కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజు కానిస్టేబుల్ నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఓపెన్ యూనివర్సిటీ తరగతులు రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి తరగతులు షెడ్యూలు ప్రకారం జరుగుతాయన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
వాల్మీకులు కాంగ్రెస్ వెంటే..
మోసపూరిత హామీలు నమ్మొద్దు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement