-
జోష్లో వెల్స్పన్ కార్ప్- జీఎంఎం ఫాడ్లర్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఆటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. దేశ, విదేశాల నుంచి భారీగా ఆర్డర్లను పొందినట్లు వెల్లడించడంతో సా పైప్స్ తయారీ దిగ్గజం వెల్స్పన్ కార్ప్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క రెండు వారాల పతన బాటనుంచి మంగళవారం బౌన్స్బ్యాక్ సాధించిన ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వెల్స్పన్ కార్ప్ దేశ, విదేశాల నుంచి ఆయిల్, గ్యాస్ రంగ దిగ్గజాల నుంచి రూ. 1,400 కోట్ల విలువైన ఆర్డర్లను పొందినట్లు వెల్స్పన్ కార్ప్ తాజాగా వెల్లడించింది. 147 కేఎంటీకి సమానమైన ఈ ఆర్డర్లలో భాగంగా పైపులను దేశీయంగా రూపొందించనున్నట్లు తెలియజేసింది. తాజా ఆర్డర్లతో కలిపి మొత్తం ఆర్డర్బుక్ 755 కేంఎటీకి చేరినట్లు పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 6,300 కోట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో వెల్స్పన్ కార్ప్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో ప్రస్తుతం రూ. 5.40 ఎగసి రూ. 114 సమీపంలో ఫ్రీజయ్యింది. జీఎంఎం ఫాడ్లర్ ముందు రోజు రెండు వారాల పతన బాటను వీడిన జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్కు మరోసారి డిమాండ్ నెలకొంది. ప్లూటస్ వెల్త్మేనేజ్మెంట్ 1.65 లక్షల షేర్లను తాజాగా కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. దీంతో కొనేవాళ్లు అధికంకాగా... అమ్మేవాళ్లు కరువుకావడంతో ఈ షేరు వరుసగా రెండో రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 190 జమ చేసుకుని రూ. 3,984 సమీపంలో ఫ్రీజయ్యింది. ప్రమోటర్లు మార్కెట్ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్లో 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో ఈ షేరు రెండు వారాలుగా పతన బాటలో సాగుతూ వచ్చింది. ఓఎఫ్ఎస్ ద్వారా షేరుకి రూ. 3,500 ధరలో ప్రమోటర్లు వాటా విక్రయానికి నిర్ణయించిన విషయం విదితమే. -
బీహెచ్ఈఎల్ డిజిన్వెస్ట్మెంట్ వాయిదా!
న్యూఢిల్లీ: విద్యుత్రంగ ఉపకరణాల దిగ్గజం బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు షేరు ధర పతనంకావడంతోపాటు, ఆర్డర్బుక్ బలహీనపడటం కారణంగా నిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 2011లోనే 5% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. అయితే విద్యుత్ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటూరావడంతో ఈ కాలంలో కంపెనీ షేరు ధర కూడా 60% పతనమైంది. తాజాగా ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో బీఎస్ఈలో షేరు దాదాపు 20% పతనమై రూ. 120 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి(ఏప్రిల్-జూన్) క్వార్టర్కు కంపెనీ నికర లాభం దాదాపు సగానికి పడిపోయి రూ. 465 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు కూడా 24% తగ్గి రూ. 6,353 కోట్లకు చేరాయి. ఇక ఆర్డర్బుక్ విలువ రూ. 1.15 లక్షల కోట్ల నుంచి రూ. 1.08 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో డిజిన్వెస్ట్మెంట్ను భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చౌక ధరల్లో కంపెనీ వాటాను విక్రయించడం సమర్థనీయంకాదని వాదిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement