-
ఏఐసీసీలో కీలక మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏఐసీసీలో కీలక మార్పులు కొనసాగిస్తున్నారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు మార్పులు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు,ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. తాజా నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. జేడీ శీలం, సంపత్లకు చోటు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంను ఏఐసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్కు అనుసంధానిస్తూ నియమించారు. ఏపీకి తమిళనాడుకు చెందిన క్రిస్టోఫర్ తిలక్, సీడీ మయ్యప్పన్లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. తెలంగాణకు చెందిన సంపత్ కుమార్ను ఏఐసీసీ కార్యదర్శిగా, మహారాష్ట్రకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా శశికాంత్ శర్మ, కార్యదర్శిగా మహేంద్ర జోషీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా లోక్సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను నియమించారు. ఖర్గేకు మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శులుగా సోనల్ పటేల్, అశోక్ దువా నియమితులయ్యారు. -
టాటాసన్స్ లో కీలక మార్పులు
ముంబై: టాటా సన్స్ అధినేతగా సైరస్ మిస్త్రీ పై వేటు పడిన అనంతరం సంస్థలో శుక్రవారం నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తర్వాత ఒకవైపు కొత్త చైర్మన్ కోసం ముమ్మర కసరత్తు జరుగుతుండగా, మరోవైపు సంస్థ తన సంస్థాగత నిర్మాణంలో ప్రధాన మార్పులు ప్రకటించింది. కొత్త మ్యానేజ్మెంట్ టీం ను ప్రకటించింది. టాటాసన్స్ హెచ్ ఆర్ గ్రూపు హెడ్ గా ఎస్ పద్మనాభన్ ను నియమించింది. టాటా బిజినెస్ ఎక్స్ లెన్స్ గ్రూపు బాధ్యతలకు తోడుగా ఆయనకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. విదేశీ సంస్థ నిర్వహణ బాధ్యతలను ముకుంద్ రాజన్ కు అప్పగించింది. అమెరికా, సింగపూర్, దుబాయ్, చైనా లో టాటా సన్స్ విదేశీ ప్రతినిధి కార్యాలయాలు, కార్యకలాపాలు పర్యవేక్షించే అదనపు బాధ్యతను అప్పగించింది. ముఖ్యంగా టాటా సన్స్ ముగ్గురు అగ్ర కార్యనిర్వాహకులు నిర్మల్య కుమార్ ఎన్ ఎస్ రాజన్, మధు కన్నన్ రాజీనామా తర్వాత ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించింది. చీఫ్ టెక్నాలజీ గ్రూపు హెడ్ గా గోపీచంద్ కాట్రగడ్డ కొనసాగుతారని, ఢిల్లీ కార్యాలయం నుంచి పబ్లిక్ అఫైర్స్ ను సంజయ్ సింగ్ పర్యవేక్షించనున్నారని తెలిపింది. టాటా బ్రాండ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ బాధ్యతల్లో హరీష్ భట్ లను నియమించింది. కాగా అక్టోబర్ 24 న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా మిస్త్రీ స్థానే తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలను రతన్ టాటా చేపట్టారు. సంస్థ నాలుగు నెలల్లో ఒక కొత్త చైర్మన్ ను నియామకంకోసం తీవ్ర వెదుకులాట సాగుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశంపై స్పష్టత లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement