-
కాంగ్రెస్లో కలకలం
చైర్మన్ చేవెళ్ల రూరల్: డీసీసీ అధ్యక్షుడి మార్పు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో అప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న క్యామ మల్లేశ్, చేవెళ్ల మండలానికి చెందిన పడాల వెంకటస్వామి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే క్యామ టికెట్ దక్కించుకుని ఎన్నికల బరిలో నిలిచారు. అధినాయకత్వం పడాలను బుజ్జగించి డీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికల్లో ఓటమిపాలైన క్యామనురిగి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్వర్వులు ఇవ్వడంతో జిల్లా నేతలంతా షాక్కు గురయ్యారు. ఈ ఆనూహ్య మార్పును మల్లేశ్ వైరివర్గం జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన వర్గీయుడైన పడాలను తప్పించి... క్యామకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డితో శుక్రవారం భేటీ అయిన సబిత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్, దళితుడైన వెంకటస్వామిని అనూహ్యంగా పదవి నుంచి మార్చడం ఎంతవరకు సబబని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానంతో చర్చించాలని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నెల 24,25వ తేదీల్లో ‘మేధో మథనం’ జరుగుతున్న తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఒకింత ఆందోళన వ్యక్తం చేసిన జానా... ఈ వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల భోగట్టా. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవి నుంచి పడాల వెంకటస్వామిని అవమానరీతిలో తప్పించడంపై ఆయన సొంత నియోజకవర్గంలో తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న పడాలను ఆకస్మికంగా మార్చడాన్ని తప్పుబడుతున్న నేతలు.. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పదవులు అమ్ముకుంటున్నారు పశ్చిమ రంగారెడ్డి ప్రాంతానికి చెందిన దళితుడికి డీసీసీ దక్కిందని సంతోషపడ్డామని, మూడు నెలలకే మార్చడం సమంజసం కాదని మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్రెడ్డి అన్నారు. చేవెళ్లలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కొందరు డబ్బులను పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. వెంటనే అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకుంటే పశ్చిమ రంగారెడ్డిలోని పార్టీ మండల అధ్యక్షులమంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కొంతమంది పైరవీలు, స్వార్థం కోసమే రోజకీయాలు చేస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిర్లక్ష్య ధోరణి వల్లే పార్టీ మొత్తం నాశనం అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సబితారెడ్డిని కలిసి పార్టీలో కొనసాగాలో లేదో తేల్చుకుంటామని అన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి శివానందం, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు శ్రీశైలం, నాయకులు అలీ, మాధవరెడ్డి, హన్మంత్రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, ఆలూరు నర్సింలు, తదితరులు ఉన్నారు. -
మళ్లీ మల్లేశ్కే డీసీసీ పగ్గాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సారథిగా క్యామ మల్లేశ్ మరోసారి నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ గురువారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన మల్లేశ్ను జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ నుంచి తప్పించింది. దీంతో చేవెళ్ల టికెట్ను ఆశించి భంగపడ్డ పడాల వెంకటస్వామికి ఎన్నికల వేళ ఈ పదవిని కట్టబెట్టారు. ఎన్నికలు పూర్తికావడం... పార్టీ ఘోరపరాజయం చ విచూసిన నేపథ్యంలో పడాలకు ఉద్వాసన పలికి, తిరిగి క్యామకే డీసీసీ పగ్గాలను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందూ కాలేజీలో ‘మేధోమథనం’ సదస్సును నిర్వహిస్తుండడం... అతిరథమహారథులు వస్తున్న ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించిన పీసీసీ... సీనియర్ అయిన మల్లేశ్ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించేందుకు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై ఆందోళనలు చేస్తామని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని క్యామ అన్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారపార్టీకి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పార్టీకి పూర్వవైభవం తె చ్చేందుకు, సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు త్వరలోనే జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తానని, ముఖ్యనేతల సలహాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement