-
డిఫాల్టర్లకూ సీఎంపీ కేటాయింపు
- ప్రారంభం కాని మిల్లులకూ ఇచ్చారు - పేరు ఒకరిది.. మిల్లింగ్ మరోచోట - పౌర సరఫరాలశాఖ అధికారుల తీరు - రైసుమిల్లర్ల వద్దే 98,355 మెట్రిక్ టన్నుల బియ్యం - గతంలో ఓ వ్యాపారి ఆత్మహత్య సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ’(సీఎంపీ) కింద ధాన్యం కేటాయింపులో ఎక్కడ చూసినా అధికారుల డొల్లతనమే కనిపిస్తోంది. సీఎంపీ కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించి మా మూళ్లు అందించిన రైసుమిల్లర్లకే పెద్దపీట వేశారు. ఇందుకు 2013-14 ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ కేటాయిం పులే ఉదాహరణ. ఓ వైపు కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేయని 53 పారా బాయిల్డ్, రా రైసుమిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. తిరిగి అదే జాబితాలోని రైసుమిల్లర్లకు 2013-14 ఖరీఫ్లో టన్నుల కొద్దీ ధాన్యాన్ని కేటాయించారు. రా రైసు మిల్లులు 5 వేల క్వింటాళ్ల నుంచి 10 వేల క్వింటాళ్లు, పారా బాయిల్డ్ మిల్లులైతే 10 వేల క్వింటాళ్లు, డబుల్ ప్లాంటులు ఉన్న మిల్లులు 20 వేల క్వింటాళ్లు కస్టమ్ మిల్లింగ్ కింద బియ్యం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ధాన్యాన్ని పొందిన రా రైసుమిల్లర్లు 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున పౌరసరఫరాలశాఖకు చెల్లించాల్సి వుండగా, పారాబాయిల్డ్ మిల్లులైతే 68 కిలోలు ఇవ్వాలి. అయితే ఇదేమీ పట్టని అధికారులు, కొందరు రైసుమిల్లర్లకు ఇష్టారాజ్యంగా కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. అంతా పథకం ప్రకారమే లాబీయింగ్కు అలవాటు పడిన ఓ మిల్లర్ల నేత ఒత్తిళ్లు, పౌరసరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పని చేస్తూ ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ఓ ద్వితీయ శ్రేణి అధికారి కలిసి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారన్న విమర్శలు కొందరు రైసుమిల్లర్లే చేస్తున్నారు. ప్రతియేడు జరుగుతున్న తంతుపై ఏ ఉన్నతాధికారి స్పందించిన పాపాన పోలేదంటున్నారు. ‘అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో...’ అన్న చందంగా ప్రతియేటా జరుగుతున్న సీఎంపీ కేటాయింపుల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయన్న విమర్శలు ఇటు రైసుమిల్లర్లు, అటు పౌరసరఫరాల శాఖలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈసారి కూడ ఇదే తంతు జరగ్గా రూ. 251 కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు కొందరు వ్యాపారం చేస్తున్నారు. 2013-14 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా 1,87,028 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేం దుకు 88 మంది మిల్లర్లకు ఇచ్చింది. ఈ మేరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1,27,179 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగిం చాలి. ఇదంతా గడువులోపే జరగాలి. అయితే ప్రభు త్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణి జిల్లాలోని మిల్లర్లకు ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 29,746 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించారు. మిగతా బియ్యం కోసం అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6ఏ తదితర, ఇతర ఎలాంటి కేసులు లేకుండా వ్యాపారం చేసే రైసుమిల్లులను ఎంపిక చేసి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీని కేటాయించాల్సి ఉంది. ఇవేమీ పట్టని అధికారులు మామూళ్లు, పరిచయాలు, ప్రలోభాలకు పెద్దపీట వేసి ఇష్టారాజ్యంగా సీఎంపీ ఇవ్వడం రైసుమిల్లర్లలో చర్చనీయాంశమైంది. సీఎంపీ నిబంధనలు అక్రమ వ్యాపారులకు వరంగా మారగా, అంతంతమాత్రంగా వ్యాపారం చేసుకునే మిల్లర్లకు శాపంగా కూడ మారుతోంది. గతేడాది కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం తీసుకున్న రైసుమిల్లర్లలో 48 మందిని పౌరసరఫరాల శాఖ డిఫాల్టర్లుగా గుర్తించింది. అదే 2013-14కు వచ్చే సరికి అందులో 26 మందిని కలిపి మొత్తం 88 మందికి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీని కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో ఓ పారాబాయిల్డ్ రైసుమిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించే నాటికి విద్యుత్ కనెక్షన్ కూడ ఇవ్వలేదు. అలాగే నడవని రైసుమిల్లులకు కూడ సీఎంపీ ఇచ్చిన అధికారులు వాటిని మరో చోట మిల్లింగ్ చేసి, అస లు మిల్లుల యజమానులకు కమీషన్ దక్కకుండా చేసిన వైనం ఉంది. ఇదే క్రమంలో 2012-13 సీజన్ లో సీఎంపీ కారణంగా నందిపేట మండలం తొడుపునూరుకు చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడ ఉంది. జుక్కల్ మండలంలో ఓ రైసుమిల్లుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కేసు కూడ నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ ప్యాడీ విషయంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
మిల్లర్ల సంచిలో సర్కారు వడ్లు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ’ (సీఎం పీ) కింద కేటాయించిన ప్రభుత్వ ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు సొంత ఆస్తిగానే భావిస్తున్నారు. ధాన్యం తీసుకుని గడువులోగా బియ్యం అప్పగించాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నారు. లాబీయింగ్కు అలవాటు పడి న ఓ మిల్లర్ల సంఘం నేత ఒత్తిళ్లు, పౌరసరఫరాల శాఖలో ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ఓ ద్వితీయశ్రేణి అధికారి మూలంగా రూ. 251 కోట్ల విలు వ చేసే ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు కొందరు వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రతి ఏటా ప్రభుత్వం ఖరీఫ్ మార్కెట్ సీజనుగా భావిస్తుంది. ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్ పరంగా ఖరీఫ్ సీజనుగానే పేర్కొంటుంది. గతేడాది అక్టోబరు ఆరంభం నుంచి ఈ ఏడాది సెప్టెం బరు వరకు ఈ సీజను ఉంటుంది. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను మరో నెల రోజుల్లో ముగియనుంది. జిల్లాలోని మిల్లర్లు మాత్రం ధాన్యం స్వాధీనం చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా కేవలం 23 శాతం బియ్యం మాత్రమే అందజేశారు. ఇంకా 77 శాతం (98,355 మెట్రిక్ టన్నుల) బియ్యాన్ని అప్పగిం చకుండా తమ వద్దే పెట్టుకున్నారు. కొందరు రైసుమిల్లర్ల సంఘం నేతల అండదండలు, పౌరసరఫరాల శాఖలోని ఓ సహాయ అధికారి సహకారంతో వీరు నిబంధనలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రైసుమిల్లర్లకు చేరింది ఇలా.. వరి సాగు విస్తీర్ణం జిల్లాలో ఎక్కువగా ఉం టుంది. ధాన్యం ఉత్పత్తి ఇదే తీరుగా ఉం టుంది. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్ మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభాపేక్షతో పక్కదారిపడుతోంది. రెండుమూడేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు స్వాహా చేయడం రివాజుగా మారుతోంది. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజనులోనూ ఇదే జరిగింది. మరి కొద్ది రోజు ల్లో గడువు ముగియనుండగా ఇప్పటికీ ఇంకా 98,355 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు తమ వద్దే పెట్టుకున్నారు. 2013-14 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1,87,028 మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్లో 88 మంది మిల్లర్లకు ఇచ్చింది. ఈ మేరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1,28,101 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఇదంతా గడువు ముగిసేలోపే జరగాలి. ప్రభుత్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణి జిల్లాలోని మిల్లర్లలో ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 29,746 మె.టన్నుల బియ్యం చెల్లిం చారు. ఇంకా 98,355 టన్నుల బియ్యం వీరి వద్దే ఉండిపోయింది. ఇలా ప్రభుత్వ బియ్యం ఇవ్వని మిల్లర్లు గత ఖరీఫ్లో 10 మంది ఉన్నారు. అయినా పౌరసరఫరాల శాఖలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి ఈ ఖరీఫ్ సీజన్లోను భారీగా ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. ఎందుకు ఉదాసీనత.. కస్టం మిల్లింగ్ ప్యాడీ కింద ధాన్యం కేటాయించే విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఒక సీజన్లో కస్టమ్ మిల్లింగ్కు సహకరించని రైసుమిల్లర్లకు మరో సీజన్లోను అధికారులు ఎందుకు ధాన్యం కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదని ఆ శాఖలోని అధికారులే అంటున్నారు. ఈ ఏడాదిలో కస్టమ్ మిల్లింగ్ కోసం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని 51 మంది మిల్లర్లకు 80,488 మె.టన్నుల ధాన్యం కేటాయించారు. ఈ మేరకు 54,669 మె.టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 11,944 మె.టన్నులు మాత్రమే ఇచ్చారు. 42,725 మె.టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి. ఇందులో సారంగపూర్కు చెందిన శ్రీసిద్దివినాయక అండ్ కంపెనీ, శ్రీ ఆర్కె ఎంఆర్ఎం, శేషాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్లు 100 శాతం చెల్లించగా... ఖానాపూర్లోని శ్రీవంశీకృష్ట 98 శాతం, శ్రీరామ మోడ్రన్ పారాబాయిల్డ్ (సారంగపూర్), లక్ష్మీబాలాజీ ఇండస్ట్రీస్ (ఖానాపూర్)లు 95 శాతం బియ్యం చెల్లించాయి. కామారెడ్డి రెవెన్యూ డివిజన్లో 32,426 మెట్రిక్ టన్నుల ధాన్యంకు 22,047 మె.టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 14 శాతం మాత్రమే ఇచ్చారు. బోధన్ డివిజన్లోని 26 మిల్లర్లకు 75,753 మె.టన్నుల ధాన్యం ఇచ్చిన పౌరసరఫరాలశాఖ 51,384 మె.టన్నుల బియ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టింది. అయితే ఇప్పటి వరకు కేవలం 14,674 మె.టన్నులు బియ్యం చెల్లించిన మిల్లర్లు 36,710 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మిగతా రైసుమిల్లర్లు నిర్దేశించిన సమయంలో బియ్యం ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉన్నా... కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యంతో వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడించాలని చూస్తున్నారు. ఇందుకు ఆ శాఖలోని డీఎస్వో తర్వాత స్థానం లో ఓ అధికారే ఊతం ఇస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి పౌరసరఫరాల శాఖ తీరుపై నిరంతరం పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కస్టమ్ మిల్లింగ్కు సంబంధిం చిన కేటాయింపులపై విచారణ జరిపి... గడువులోగా బియ్యం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
‘అధికారులు తీరు మార్చుకోవాలి’
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement