-
ముంచడానికే మహాకూటమి
పాపన్నపేట(మెదక్): కుట్రదారులారా.. ఖబర్దార్.. తెలంగాణను ముంచడానికే మహాకూటమి ఏర్పడిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి నిర్ణయాలు ఆంధ్రాలోగాని ఢిల్లీలోగాని నిర్ణయించేందుకు తెలంగాణ బిడ్డలు ఒప్పుకోరని, కూటమీ కుట్రలను తిప్పి కొడతారని హెచ్చరించారు. వందసీట్లు పక్కాగా సాధించి తెలంగాణ సత్తా చాటు తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీల సిద్ధాంతాలు మరిచి ఒక్కటి కావడం మోసపూరిత కుట్రకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే అనైతిక పొత్తులు పెట్టుకున్నారని అన్నారు. ఆరోజు టీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వారితో జై తెలంగాణ అనిపించి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు ఆపాలని 20కిపైగా కేసులు వేయడంతోపాటు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ 20 ఏళ్ల పాలన, కాంగ్రెస్60 ఏళ్ల పాలనలో తెలంగాణ నిండా మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలను గడపడగడపకు అందిస్తూ.. తెలంగాణ ప్రజలు జీవన ప్రమాణాలను మెరుగుపర్చారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, పింఛన్ల పెంపు, 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, కేసీఆర్ కిట్లు, కంటి పరీక్షలతో తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. వీటిని చూసి తట్టుకోలేక ఉత్తమ్కుమార్ ఉత్త మాటలతో ప్రజల్లోకి వస్తుంటే ఎవరు నమ్ముతారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని, ప్రజల బతుకులు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఆమె వెంట ఎంపీపీ పవిత్రదుర్గయ్య, ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మొద్దు మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హవేళిఘణాపూర్ మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన సుమారు 80మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి పద్మాదేవేందర్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 60 ఏళ్ల పాలించాయని, వారి పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అడ్డు పడుతున్నారన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్న బ్యాతోల్ గ్రామస్తులు -
చెరువును దత్తత తీసుకున్న టీయూడబ్ల్యుజే
మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, అధికారులు పాలు పంచుకుంటున్నారు. తాజాగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కవలంపేట చెరువును టీయూడబ్ల్యుజే (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) దత్తత తీసుకుంది. ఈ చెరువులో పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement