-
సింగిల్ గ్రిడ్
నల్లగొండ : జిల్లా వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు తారుమారయ్యాయి. తొలుత ప్రతిపాదించిన ప్రకారం కాకుండా, గ్రిడ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చారు. నాలుగు గ్రిడ్లకు బదులుగా సింగిల్ (ఒక్కటే) గ్రిడ్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పాలేరు, ఉదయసముద్రం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్..ఈ మూడింటిని కేంద్రంగా చేసుకుని నాలుగు గ్రిడ్లు ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అక్కంపల్లి నుంచి జంటనగరాలకు నీటి సరఫరా జరుగుతుండగా, పాలేరు జలాలు ఖమ్మం పట్టణవాసులకే సరిపోవడం లేదు. అదీగాక ఉదయసముద్రం రిజర్వాయర్కు రావాల్సిన నీటికేటాయింపులే పూర్తిస్థాయిలో అందడంలేదు. ముఖ్యంగా జంటనగరాలకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐకేబీఆర్లో నీటి కేటాయింపులు చేశారు. ఇక్కడి నుంచి నీటిని వాటర్గ్రిడ్కు తరలిస్తే జంటనగరవాసులతో పాటు, ఉదయసముద్రం కింద ఉన్న మండలాలకు కూడా తీవ్ర నీటిసమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం పునరాలోచించింది. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూడు రిజర్వాయర్ల్లో నీటినిల్వలు గరిష్టస్థాయికి చేరుకుంటాయి. దీంతో జిల్లా ప్రజాప్రతినిధులు, సాగునీటి రంగ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత రాష్ట్రప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి కాకుండా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు నల్లగొండ జిల్లాకు తీసుకురావాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే అధికారులు సరికొత్తగా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలనే ప్రభుత్వం కూడా ఆమోదించేందుకు సిద్ధమైంది. శ్రీశైలం టు నల్లగొండ శ్రీశైలం బ్యాక్వాటర్ సమీపంలో ఉన్న ఎల్లూరు నుంచి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ వరకు 18 కిలోమీటర్ల మేర భారీ పైప్లైన్ నిర్మిస్తారు. కొల్లాపూర్ సమీపంలో వన్యప్రాణి కేంద్రానికి సంబంధించి అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ 600 మీటర్లు ఎత్తయిన గుట్టపైన జీఎల్బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నిర్మిస్తారు. ఇక్కడి నుంచి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు నల్లగొండకు జిల్లాకు పైప్లైన్ ఏర్పాటు చేస్తారు. కొల్లాపూర్ నుంచే వచ్చే పైప్లైను డిండి ద్వారా నుంచి మన జిల్లాలోకి ప్రవేశిస్తుంది. శ్రీశైలం నుంచి డిండి వరకు 50 కి.మీ మేర పైప్లైను నిర్మించి కృష్ణాజలాలు తీసుకొస్తారు. మన జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత తొలుత చింతపల్లి మండలం గొడకొండ్ల వద్ద ప్రతిపాదించిన ట్రీట్మెంట్ ప్లాంట్లోకి నీటిని పంపింగ్ చేస్తారు. ఇదే పైప్లైన్ ద్వారానే భువనగిరి, సూర్యాపేట మండలం ఉండ్రుకొండ, మునగాల మండలం బరాఖత్గూడెం వద్ద ప్రతిపాదించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని చేరుస్తారు. ఈ ప్లాంట్లలో నిల్వ ఉంచిన నీటిని ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా ట్యాంకులకు ఎక్కించి పైప్లైన్ల ద్వారా గ్రామాలకు నీరందిస్తారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీల నీటిని జిల్లా తాగునీటి అవసరాలకు తరలిస్తారు. పెరగనున్న అంచనాలు తొలుత ప్రతిపాదించిన నాలుగు గ్రిడ్ల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీనికి అదనంగా మరో నాలుగైదు కోట్లు పన్నులు, జీతాలు, వగైరా వంటి ఖర్చులు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే పైప్లైన్ జిల్లా మొత్తం ఏర్పాటు చేయాల్సి వస్తుండడంతో పైప్లైన్ ఖర్చు భారీగా ఉంటోంది. కావు న అంచనా వ్యయం కూడా మూడు వేల కోట్ల రూపాయలు దాటే అవకాశముందని అధికాారులు చెబుతున్నారు. పూర్తి అంచనా వ్యయం లెక్కలు చివరి దశలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఆ పథకాలు నిర్మించాలనే ఆలోచన! ఇదిలా ఉంటే గ్రిడ్ కారణంగా వివిధ నియోజక వర్గాల్లో తొలుత రద్దు చేయాలనుకున్న తాగునీటి పథకాలను తిరిగి వాటిని నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. వాటర్ గ్రిడ్ నుంచి మినహాయించిన 16 మండలాల్లో కృష్ణాజలాలు సరఫరా అయ్యేందుకు పథకాలు ఉన్నందున వీటి ద్వారానే మిగిలిన అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. ఈ 16 మండలాలు మినహాయింపు... శాలిగౌరారం మోత్కూరు కట్టంగూరు నకిరేకల్ కేతేపల్లి రామన్నపేట నార్కట్పల్లి చిట్యాల తిప్పర్తి నల్లగొండ కనగల్ మఠంపల్లి మేళ్లచెర్వు మోతె త్రిపురారం చందంపేట మంచినీటి రిజర్వాయర్లు, కృష్ణానది తీరానికి సమీపంలో ఉన్న ఈ మండలాలను గ్రిడ్ నుంచి మిన హాయించారు. వీటి పరిధిలో కొనసాగుతున్న తాగునీటి పథకాల ద్వారానే అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయనున్నారు. -
పాలేరు.. తేలేరా?
సూర్యాపేట పట్టణవాసులకు పాలేరు జలాలు అందని ద్రాక్షగానే మారాయి. పాలేరు జలాల నినాదం.. ఇక్కడి నాయకులకు ఎన్నికల వాగ్దానంగా మారిపో యింది. ఈ జలాలు అందిస్తామని ప్రతి సారి ఎన్నికల సమయంలో నేతలు హామీలివ్వడం ఆ తరువాత మరచిపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఇక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. మున్సిపాలిటీ వారు సర ఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడంలేదు. ఇది కూడా మురికిగా ఉండడంతో ప్యూరిఫైడ్ నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. సూర్యాపేట పురపాలక సంఘం ఆర్భాటంగా సరఫరా చేసేది పేరుకు మంచినీరు.. అందిం చేది మాత్రం మురుగునీరు. సాధారణ అవసరాలకు కూడా పనికిరాని నీటిని అందిస్తుండడంతో స్థాని కులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం లో లక్షా 5 వేల జనాభా ఉండగా డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం వ్యాపార, వాణిజ్య, విద్యా అవసరాల కోసం సుమారు 40 వేల మందికి పైగా పట్టణానికి వచ్చి పోతుంటారు. ఒక్కొక్కరికి నిత్యం 125 లీటర్లు అవసరముండగా వారందరికీ మొ త్తం 18 ఎమ్ఎల్డీలు(మిలియన్ లీటర్ ఫర్ డే ) కావాల్సి ఉంది. కానీ పట్టణానికి సరఫరా చేసే దోసపహాడ్ రిజర్వాయర్ నుంచి 5 ఎమ్ఎల్డీలు, మూసీ నుంచి 8 ఎమ్ఎల్డీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. దీంతో మరోఐదు ఎమ్ఎల్డీల కొరత ఏర్పడింది. ఇవి కూడా ప్రస్తుతం ఒక్కోప్రాంతానికి ఒక్కో రోజు చొప్పున మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే అందుతున్నాయి. ముందుచూపు లేకే దోసపహాడ్, మూసీలకు నిధుల మళ్లింపు.. పట్టణ జనాభాకు సరిపోను నీటి అవసరాలపై గత మున్సిపల్ పాలకులకు ముందు చూపులేకే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. గత మున్సిపల్ పాలకుల్లో ఒకరు దోసపహాడ్, మరొకరు మూసీ నుంచి అదనపు పైపులైన్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని అప్పుడే పాలేరు పథకాన్ని ముందుకు తెస్తే ఈ పరిస్థితి తలెత్తేదేకాదంటున్నారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. పట్టణానికి సుమారు వంద కోట్లతో పాలేరు జలాలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డి ప్రతిపాదనలు పంపారు. అయితే గతంలో కోట్ల నిధులు దోసపహాడ్, మూసీలకు వెచ్చించారని, తిరిగి పట్టణానికి వంద కోట్లతో పాలేరు పథకాన్ని తీసుకొచ్చేందుకు సాంకేతిక సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో రెండు పథకాలకు డబ్బు వెచ్చించి తిరిగి పాలేరు పథకమంటే ఎలా కుదురుతుందని కేంద్ర స్థాయిలో అధికారులు కొర్రి పెడుతున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ముందుచూపులేకుండా డబ్బులు వెచ్చించి ప్రజలకు తాగునీరందించలేక పోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలు చేపడతామని కేంద్ర స్థాయి అధికారులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సహకారంతో సమస్యను పరిష్కరించి పాలేరు పథకాన్ని మం జూరు చేయించే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందన్నారు. లేకపోతే ఇప్పటికే పనులు ప్రా రంభం కావాల్సి ఉండేదని ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటికి ఏటా *5వేలు ఖర్చు పాల కంటే.. ఎక్కువ ఖర్చు తాగునీటికి కే టాయించిన దౌర్భాగ్య పరిస్థితి సూర్యాపేట పట్టణ ప్రజలకు దాపురించింది. నిరుపేద, మధ్య తరగతి సంపాదన రోజుకు సుమారు *200 చొప్పున ఏడాదికి *72 వేలు . ఇందులో సుమారు *5 వేలు తాగునీటి కోసం వెచ్చిస్తున్నారు. * 2 లకే 20 లీటర్ల మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా * 5 నుంచి * 10లకు క్యాన్ విక్రయిస్తున్నారు. నెరవేరని హామీలు 1999 ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి మిర్యాలగూడ పార్లమెంటు ని యోజకవర్గం నుంచి పోటీ చేసి సూర్యాపే ట వచ్చిన సందర్భంగా పాలేరు ద్వారా కృ ష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.2004 ఎన్నికల్లోనూ తిరిగి జైపాల్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేదాసు వెంకయ్యలు ఇదే వాగ్దానం చేశారు.మున్సిపల్ ఎన్నికల్లోనూ చైర్మన్ అభ్యర్థులు ప్రతిసారి ఇదే వాగ్దానం చేస్తు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement