-
పా‘లేట్’పల్లి రిజర్వాయర్!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): బ్రిటీష్ కాలం నుంచి హామీలకే పరిమితమైన పాలేటి రిజర్వాయర్కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కనిగిరిలో భూమి పూజ చేసి మోక్షం కలిగించారు. నిధుల కేటాయింపు జరిగినా అప్పటి అధికారులు స్థానిక పాలకుల లోపంతో పనులు క్షేత్రస్థాయిలో ముందడగు వేయలేదు. ఆ తర్వాత 2013 ఏప్రిల్ 1న పాలేటిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య భూమి పూజ చేశారు. అప్పటి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు విడుదల చేసి మొదటి విడత పనులు ప్రారంభించినా టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండో విడత నిధుల కేటాయింపు జరగలేదు. సుమారు మూడేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరిగింది. 15 ఏళ్ల క్రితం రూ.5 కోట్లుకాగా రెండోసారి 2012లో రూ.17.8 కోట్లకు పెరిగింది. 2017లో తిరిగి ప్రతిపాదన పంపించగా ప్రస్తుతం రూ.22.67 కోట్లకు వ్యయం చేరింది. గతంలో శాంక్షన్ జరిగిన నిధులే తప్పా చంద్రబాబు హయాంలో కొత్తగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. రిజర్వాయర్ గురించి.. ♦ కనిగిరి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ పాలేటిపల్లి రిజర్వాయర్ ♦ సుమారు 1,500 ఎకరాల ఆయకట్టుతో ప్రాజెక్టు డిజైన్ రూపొందించారు ♦ పాలేరు వాగు నుంచి పందువగండి, ఎన్.గొల్లపల్లి మీదుగా పాలేటిపల్లిలోకి నీరు చేరుతాయి ♦ ఈ రిజర్వాయర్ నిర్మాణంతో పీసీపల్లి మండలంలో బట్టుపల్లి, పాలేటిపల్లి, తలకొండపాడు, కనిగిరి మండలం రాచగుండ్లపాడు, లింగోజిపురం పంచాయతీల్లో (220 ఎకరాల్లో) పారుదల. సాగు, తాగు నీటికి ఉపయోగం. ♦ ప్రాజెక్టు చెరువు మునకతో కలిపి విస్తీర్ణం 350 ఎకరాలు. కుడికాలువ 10 కిమి, ఎడమకాలువ 4.25 కిమిల పోడవుతో డిజైన్ ♦ ఎడమ కాలువ కింద 510 ఎకరాలు, కుడికాలువ కింద 990 ఎకరాలు ఆయకట్టు జరగని భూ సేకరణ ♦ రిజర్వాయర్కు తొట్టి, అలుగు, తూములు, మునక భూములకు 350 ఎకరాల భూసేకరణ జరిగింది. ♦ కుడి, ఎడమ కాలువ నిర్మాణాలను సుమారు 87.38 ఎకరాలు భూసేకరణ జరగాలి ♦ 87 ఎకరాల భూసేకరణలో 57 ఎకరాలు పట్టా భూమికాగా మిగతాది అసైన్డ్ భూమి ♦ 11.7 కిలో మీటర్లు పొడవు, సుమారు 2 మీటర్ల వెడల్పులో కాలువ నిర్మాణం చేపట్టాలి ♦ మూడేళ్ల నుంచి సర్వేలకే పరిమితం కలగని మోక్షం టీడీపీ ప్రభుత్వం హయాంలో పాలేటిపల్లి రిజర్వార్కు పనులు పడకేశాయి. 2014కు ముందు శాంక్షనై నిధుల్లేక ఆగిన హెడ్ వర్క్ నిర్మాణ పనులు అరకొరకగా 2016లో పూర్తి చేశారు. ఆ తర్వాత 2017లో రీ ఎస్టీమేషన్ నిధుల శాంక్షన్ చేశారేగానీ కారణాలు ఏమైనా అధికారులు ఎంతమంది మారినా పనులు ముందడగు పడలేదు. సుమారు రూ.7.29 కోట్ల కెనాల్స్ పనులకు నేటికీ టెండర్లు పిలవ లేదు. ఫలితంగా మూడేళ్ల నుంచి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆగిన పనులు ♦ రిజర్వాయర్కు మంజూరైన రూ.22.67 కోట్లను మూడు దశలుగా ఖర్చు చేయాలి. ♦ ప్రాజెక్టు అలుగులు, కట్ట, తూములు తొట్టి నిర్మాణానికి కొంత, కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి కొంత, మునక భూములకు నష్టపరిహారం చెల్లింపులకు కొన్ని నిధులు కేటాయించారు. ♦ తొట్టిమునక భూములకు నష్టరిహారం చెల్లింపులు రూ.1.88 కోట్లు చెల్లించారు. ♦ తొట్టి, తూము, కట్టలు, అలుగుకు రూ.8 కోట్ల పనులు జరిగాయి. ♦ మిగతా రూ.12 (పెరిగిన వ్యయం) కోట్లతో కుడి, ఎడమ కాలువలు పనులు జరగాలి. -
తవ్వెయ్.. దోచెయ్
పీసీపల్లి, పెద్దారవీడు, న్యూస్లైన్: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. పీసీపల్లి మండలంలో పాలేటి రిజర్వాయర్ పేరు చెప్పుకొని ఇసుక తరలిస్తుంటే...పెద్దారవీడు మండలం తోకపల్లెలో తీగలేరు నుంచి ఇసుక తవ్వి అమ్ముకుంటున్నారు. పీసీపల్లి ప్రాంతంలో దళారులు ఏకంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని మరీ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఒక వ్యాపారి ఇసుక తరలించేందుకే ఏకంగా ఐదు ట్రాక్టర్లు కొత్తవి కొనుగోలు చేశాడంటే..ఇసుక చౌర్యం ఎంతమేర జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే పాలేటి రిజర్వాయర్ కోసం తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. అసలు రిజర్వాయర్ కోసం తీసుకెళ్తున్నారో..లేక బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారో పట్టించుకోకుండా ఇసుక వ్యాపారులిచ్చే మామూళ్లకు తలొగ్గి అధికారులు అక్రమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక వ్యాపారం మండలంలోని పాలేటిగంగ, వెంగళాపురం, పోతవరం, నేరేడుపల్లి, అలవలపాడు, బట్టుపల్లి, పెదవరిమడుగు, పాలేటిపల్లి, పాలేటి రిజర్వాయర్ చుట్టుపక్కల ఇసుక తరలిస్తున్నారు. కూలీలకు ట్రక్కు నింపితే రూ.500ల వరకు చెల్లించి యజమానులు ట్రక్కు ఇసుక రూ. 3500 వరకు అమ్ముకుంటారు. అదే టిప్పర్ అయితే దాదాపుగా రూ.15 వేల దాకా విక్రయిస్తారు. రోజూ ట్రాక్టర్లలో వంద లోడ్లకు పైగా ఇసుకను కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, బొట్లగూడూరు, పొన్నలూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో ఉండే చోటా అధికార పార్టీ నాయకుల అండ దండలతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ఇసుక తరలింపుపై ఆర్డీఓ బాపిరెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్లందరూ సమ్మెలో ఉండటంతో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించలేకపోతున్నామని, సమ్మె విరమించిన వెంటనే ఇసుక అక్రమ రవాణాకు చెక్పెడతామన్నారు. తీగలేరు నుంచి... పెద్దారవీడు మండలంలోని తోకపల్లె, రామాయపాలెం, ప్రగళ్లపాడు గ్రామాల సమీపంలో ఉన్న తీగలేరు కాలువ నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఎక్కువగా రాత్రిపూట జేసీబీలతో తవ్వి తీసుకెళ్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేల చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లోని గ్రామాలకు ట్రాక్టర్ల యజమానులు ఇసుక తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధర మారుతుంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుక తవ్వేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో తీగలేరు కాలువలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఇద్దరు గ్రామ నౌకరులను ఏర్పాటు చేశారు. పగటిపూట ఒకరు, రాత్రిపూట మరొకరిని తహసీల్దార్ కాపలాగా నియమించారు. ఈ మధ్యకాలంలో కాపలా లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డులేకుండా పోయింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement