-
చిరంజీవి గైర్హాజరుపై కాంగ్రెస్ క్లారిటీ
విజయవాడ: ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గైర్హాజరుపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల చిరంజీవి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ తోనే ఉంటారని తెలిపారు. కాగా శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.పీ దిగ్విజయ్ సింగ్, కుంతియా, కొప్పుల రాజు, కె.వి.పి., రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ప్రజాసమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. పార్టీ ఫిరాయింపులకి కాంగ్రెస్ వ్యతిరేకమని, ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రపతికి ఉత్తరం రాశామన్నారు. అలాగే మాజీ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ ఫిరాయించిన ఎవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఫిరాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్ను తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు నేడు అదే విధానాన్ని అవలంభించడం దారుణమని విమర్శించారు. తమ పార్టీ నుంచి వెళ్లినవారికి కూడా పదవులు ఇచ్చారన్నారు. ఫిరాయింపుకు పాల్పడివారు ఎవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మాజీ మంత్రి
చిత్తూరు: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీల అనుమతితోనే ప్రత్యేక హోదా అంశం కేబినెట్లో ప్రవేశపెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావటం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ప్రణాళికపరంగా పోరాటం చేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
సాయంత్రం పల్లంరాజు నివాసంలో కాపు నేతల భేటీ
హైదరాబాద్ : భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రముఖ కాపు నేతలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో సమావేశం కానున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు కాపు నేతలతో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు భేటీ అయ్యారు. కాపులను వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఇక ముద్రగడ దీక్షపై కడపలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపు, బలిజ, అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురాంరెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ముద్రగడ దీక్షను వెనకుండి నడిపిస్తున్నారంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడకిచ్చిన హామీలు అధికారులు చెప్పినవే అని, లోకేశ్ చెప్పినవి కాదని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గంటా తెలిపారు. -
'సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పల్లంరాజు స్పందించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు రికార్డయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు పాత్రను పల్లంరాజు తప్పుపడుతూ సీఎం పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేయడం సరికాదని పల్లంరాజు అన్నారు. -
హైదరాబాద్ విషయంలో విఫలం-తూర్పుగోదావరి కోసం ప్రయత్నం
కాకినాడ: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, ఇప్పుడు సీమాంధ్ర రాజధానిని తూర్పు గోదావరి జిల్లాకు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పళ్లం రాజు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకే రాజధానిని రప్పించడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో సీబీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని ఎక్కడనే విషయంపై కేంద్రం ఓ కమిటీని నియమిస్తుందని చెప్పారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా స్వీకరిస్తాం రాష్ట్రవిభజన విషయంలో తాము పొరబాటు చేసినట్లు ప్రజలు భావిస్తే, వచ్చే ఎన్నికల్లో వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వీకరిస్తామని పళ్లంరాజు చెప్పారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఓ ల్యాబ్తో పాటు నూతనంగా నిర్మించే ఐసీయూకి ఆయన శంకుస్ధాపన చేశారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచే లోక్సభకు పోటీచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అంశం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అన్ని పార్టీల నిర్ణయం మేరకే విభజన జరిగిందని తెలిపారు. హైదరాబాద్ను యూటీ చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement