-
రాచబాటల్లో రయ్ రయ్!
జిల్లాలో రోడ్ల ఆధునీకరణ, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల నిర్మాణ పనులు దాదాపుగాపూర్తయ్యాయి. వర్షాలకు దెబ్బతిన్న రహదారుల గుర్తించిన ప్రభుత్వం రోడ్ల విస్తరణ, ఆధునీకరణ, అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు చేపట్టడంతో వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. పాడేరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో రహదారులు కొత్తశోభను సంతరించుకున్నాయి. పాడేరు/రంపచోడవరం: పాడేరు నియోజకవర్గంలో 9 పనులకు సంబంధించి రూ.21.36 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరు ఆర్అండ్బీ డివిజన్ పరిధిలోని పాడేరు–వడ్డాది మార్గంలో 8.3 కిలోమీటర్ల పక్కా రోడ్డు అభివృద్ధికి రూ.2.85 కోట్లతో పనులు పూర్తయ్యాయి. పాడేరు నుంచి చింతపల్లి రోడ్డు అభివృద్ధికి రూ.4.25 కోట్లు, నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా సీలేరు వరకు రోడ్డుకు రూ. 2.80 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డుకు రూ.2.58 కోట్లు, ఇదే రోడ్డులో 46 నుంచి 54 కిలోమీటరు వరకు రూ.2.75 కోట్లు, 60వ కిలోమీటరు నుంచి 64 కిలోమీటర్ల వరకు అభివృద్ధికి రూ.1.88 కోట్లు అందిస్తున్నారు. పాడేరు–చింతపల్లి రోడ్డుకు రూ.కోటి, పాడేరు–వడ్డాది రోడ్డు నుంచి కందమామిడి జంక్షన్ నుంచి బంగారుమెట్ట రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభదశలో ఉన్నాయి. అరకు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులకు పనులకు రూ.5.35 కోట్లు మంజూరయ్యాయి. పాడేరు అర్ అండ్ బీ డివిజన్ పరిధిలోని హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో నాలుగు రోడ్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.5.35 కోట్లు మంజూరు చేసింది. ఇందులో పాడేరు–అరకులోయ ఆర్ అండ్బీ రోడ్డు నుంచి బాకూరు పోయే రోడ్డులో 5/6 నుంచి 13/24 వరకు రూ.1.48 కోట్లు కేటాయించారు. ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట రోడ్డులో 5/6 నుంచి 6/4 రోడ్డుకు రూ.48 లక్షలు, పాడేరు–పెదబయలు, మంచంగిపుట్టు, జోలాపుట్ట రోడ్డులోని 7 నుంచి 12/8, 32, 34 కిలోమీటర్ల రోడ్డులో రోడ్డులో రోడ్డ అభివృద్ధి, ప్రత్యేక మరమ్మతులకు రూ.2.66 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ మేరకు పనులన్నీ పూర్తయ్యాయి. అలాగే పాడేరు, బంగారుమెట్ట, నుర్మతి రోడ్డులోని 50 నుంచి 52 కిలోమీటర్ల రోడ్డు ఉన్న బొండాపల్లి ప్రాంతంలో రోడ్డు అభివృద్ధికి రూ.73 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. రంపచోడవరం డివిజన్లో ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్శాఖ, రోడ్డు భవనాలు శాఖ ఇంజనీర్లు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మారేడుమిల్లి నుంచి పుల్లంగి వరకు 30 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులను రోడ్లు భవనాలశాఖ రూ.12కోట్లతో పూర్తి చేసింది. దీనివల్ల మండలకేంద్రం నుంచి మారేడుమిల్లి వరకు రహదారి సౌకర్యం చేకూరింది. 40 గ్రామాల ప్రజల సమస్య పరిష్కారమైంది. ఆకుమామిడి కోట నుంచి గుర్తేడు వరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ పనులు చేపట్టింది. గోకవరం నుంచి పోతవరం వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును రూ. 12 కోట్ల వ్యయంతో రోడ్డు భవనాలు శాఖ పూర్తి చేసింది. కొత్తపల్లి నుంచి గోకవరం వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర రోడ్డును రూ. 20 కోట్లు వ్యయంతో ఆర్అండ్బీ అధికారులు నిర్మించారు. గతంలో ఈ రోడ్డులో వర్షం పడితే ఎక్కడిక్కడ కొండవాగులు పొంగి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉండేది. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో కూడా అనేక ప్రధాన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు వెచ్చించింది. దీనిలో భాగంగా చేపట్టిన రంపచోడవరం మండలం పందిరిమామిడి నుంచి చవిటిదిబ్బల రోడ్డు నిర్మాణం చివరి దశకు చేరింది. దీనవల్ల రంపచోడవరం, మారేడుమిల్లి, వై. రామవరం మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాల గిరిజనులు రంపచోడవరం చేరుకునేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. నాబార్డు ఏఐఐబీ సహకారంతో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో రూ.78 కోట్ల వ్యయంతో 150 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా 50 రహదారుల నిర్మాణం చేపట్టగా వీటిలో 8 పనులు పూర్తి చేశారు. మరో 28 పనులు చివరి దశలో ఉన్నాయి. మరో పది రోడ్ల నిర్మాణం అటవీ అభ్యంతరాల కారణంగా ప్రారంభం కాలేదు. జూన్ నెలాఖరుకు రోడ్లన్నీ పూర్తి ఇప్పటికే మరమ్మతుల పనులు పూర్తికావస్తున్నాయి. రోడ్ల ఆధునీకరణ నిర్మాణాలు, బీటీ రోడ్డులు, సీఆర్ఎఫ్ ఫండ్స్ రోడ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తి చేస్తాం. ఆదిశగా నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన లైన్ల రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. సగానికి పైగా రోడ్ల నిర్మాణపనులు దాదాపు పూర్తకావస్తున్నాయి. రోడ్ల నిర్మాణాలను నాడు–నేడు పద్ధతిలో చేపడుతున్నాం. – కె.జాన్ సుధాకర్,ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ (చదవండి: చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్..) -
ఇంత దారుణమా..?
- పుష్కరాల పనుల్లో జిల్లా వెనుకబడింది - ఇంకెప్పుడు పూర్తి చేస్తారు - పార్కింగ్ స్థలాలు అవసరమో లేదో తెలియదా..? - ప్రపోజల్స్, పనులు చూస్తే నవ్విపోతారు - పంచాయతీరాజ్ ఇంజినీర్లపై ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి అసహనం ఇందూరు : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహించే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిద్దామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, మీరేమో ఇక్కడ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. పుష్కర ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా మీకు రాలేదా..? ఈ ప్రపోజల్స్ను... పనులను ఎవరికైనా చూపిస్తే నవ్విపోతారు. ఇంత దారుణంగా ఏ జిల్లాలో లేదు. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లే డు.’ అని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (ఈఎన్సీ) ఎం. సత్య నారాయణరెడ్డి పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా సందర్శనకు వచ్చిన ఆయన పలు మండలాలను పర్యటించి పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంజినీర్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 ప్యాకేజీలకు, 3420 రోడ్లు వేస్తున్నామన్నారు. నిజామాబాద్లో 16 పుష్కర ఘాట్లకు గాను 15 ఘాట్లకు టెండర్లు నిర్వహించగా, ఇందులో మూడింటికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లు రాలేదని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనుల విషయంలో తికమకపడుతున్నారని, గత సమావేశంలో అన్ని వివరించి చెప్పినా ఇంజనీర్లకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ప్రారంభించిన పనులు ఏ ఒక్కటి కూడా ముందుకు కదలడం లేదని, గ్రౌండింగ్, ప్రోగ్రెస్, పర్ఫామెన్స్లో దారుణంగా ఉందని అన్నారు. ఇలాగైతే పనులెప్పుడు పూర్తి చేస్తారని మండిపడ్డారు. ఎక్కువ జన తాకిడి ఉండే కందకుర్తి ఘాట్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం దారుణమని, ఇదొక్కటే కాకుండా చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు నిర్మించకుండా పనులు చేపట్టడం సిగ్గుచేటన్నారు. పుష్కర పనులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీవ్రం గా ఉందని చెప్పారు. సమష్టిగా పని చేసి జిల్లా రూపు రేఖలు మార్చాలని సూచించారు. జూన్ 15 గడువు... పుష్కరాల పనులపై చాలా ఒత్తిడి ఉందని, ఇంకా నెల న్నర సమయం ఉందని, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని ఇం జినీర్లకు సూచించారు. ప్రారంభమైన పనులను, టెండర్లు రాని పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయూలని ఆదేశించారు. గతంలో నిజామాబాద్లో ఐదు పుష్కర ఘాట్లు ఉంటే, 11 కొత్త వాటితో కలుపుకుని మొత్తం 16 ఘాట్లు పూర్తి చేయాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఏర్పాటు చేయని వాటికి కలెక్టర్ ద్వారా ప్రపోజల్స్ను 24 గంటల్లో తనకు పంపించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యమూర్తిని ఆదేశించారు.60 శాతం పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యులను చేయాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్లు వేయడం, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయ డం పంచాయతీరాజ్ శాఖ ప్రధాన ఉద్దేశమన్నారు. చేసే పనులు నాణ్యంగా ఉండాలన్నారు. అనంతరం ఎంఆర్ఆర్, ఆర్ఐడీఎఫ్, బీఆర్జీఎఫ్, నాబార్డు, 13వ ఆర్థిక సంఘం, తదితర పథకాల నిధుల ద్వారా చేపడుతున్న భవనాలు, రోడ్డు పనులు, వాటి పురోగతిపై సమీక్షించారు. పీఆర్ డిప్యూటీ డీఈ జలేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement