-
వైద్యశాఖలో అక్రమ డెప్యూటేషన్లు రద్దు
- నల్లగొండ జిల్లాలో 60 మంది పారామెడికల్ సిబ్బంది వెనక్కి - ప్రాంతీయ పరిధిలోని అక్రమ బదిలీల రద్దుకు సిఫార్సు? - ‘సాక్షి’ కథనంతో కదిలిన డొంక... ఇంకా కొనసాగుతోన్న విచారణ సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఆరో జోన్ ప్రాంతీయ పరిధిలో జరిగిన పారా మెడికల్ సిబ్బంది, సీనియర్ అసిస్టెంట్ కేడర్ అక్రమ డెప్యూటేషన్లను కొన్నింటిని రద్దు చేశారు. ముందుగా నల్లగొండ జిల్లాలో 60 అక్రమ డెప్యూటేషన్లను రద్దు చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ ఇటీవల వాటిని రద్దు చేశారు. గత జనవరి 28వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన వైద్యశాఖలో అక్రమ బదిలీలు కథనానికి స్పందించిన సర్కారు విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ అక్రమ డెప్యూటేషన్లు జరిగాయి. వాటిపైనా విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం వాటిని రద్దు చేసే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సరెండర్ పేరుతో రూ. 3 లక్షల వరకు తీసుకొని వైద్య ఉద్యోగులను వారికి ఇష్టమైన ప్రాంతానికి బదిలీలు చేశారు. వీటి పైనా విచారణ జరుగుతోంది. త్వరలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సరెండర్లను అనంతరం జరిగిన 150 బదిలీల రద్దుకూ సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకాధికారిపైనా చర్యలు:ఆరో జోన్ పరిధిలోని ఆరు జిల్లాలకు వైద్య ఆరోగ్యశాఖలో కీలక అధికారుల్లో ఆయన ఒకరు. అక్రమ డెప్యూటేషన్లకు, సరెండర్లు అనంతరం జరిగిన బదిలీలకు ఆయనే సూత్రధారి అని విచారణ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. సరెండర్ పేరుతో ఇష్టమైన చోటుకు ఉద్యోగులను బదిలీ చేశారు. అందుకు రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. సరెండర్ కుదరకపోతే డెప్యూటేషన్ సదుపాయాన్ని వాడేసుకున్నారు. రూ.50 వేలు తీసుకుని నల్లగొండలో 60 మంది పారామెడికల్, సీనియర్ అసిస్టెంట్లను కోరుకున్న చోటికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి తల్లికి ప్రమోషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో 12 మంది ఏఎన్ఎంల పదోన్నతులను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపైనా విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉంది. -
పారా మెడికల్ @ కెరీర్
వైద్య రంగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ వైద్య సేవలు విస్తరించడం..ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం.. వెరసి రోగులకు చికిత్సనందించడంలో వైద్యులకు సహాయంగా నిలిచే పారా మెడికల్ సిబ్బందికి డిమాండ్ పెరిగింది. రక్త పరీక్ష నుంచి రేడియాలజీ వరకు.. సిటీస్కాన్ నుంచి ఎండోస్కోపి వరకూ.. పారామెడికల్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమైనవి. ఒక రకంగా చెప్పాలంటే వీరి తోడ్పాటు లేకుండా ఆయా విభాగాల పర్యవేక్షణ సాధ్యం కాదు. స్వల్ప వ్యవధి గల కోర్సుల ద్వారానే ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఉపాధిని, ఉద్యోగ అవకాశాలను అందించే పారామెడికల్ కెరీర్ గురించి తెలుసుకుందాం.... వైద్య సేవల విస్తరణ వేగంగా జరుగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు నగరాల్లోనే కాకుండా చిన్నచిన్న పట్టణాల్లో సైతం ఏర్పాటవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి తక్షణమే ఉపాధి లభిస్తోంది. పారామెడికల్ కోర్సులు విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారాయి అంటున్నారు నిపుణులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశం కల్పించే ఈ కోర్సుల్లో చేరితే ఆకర్షణీయమైన కెరీర్కు మార్గం పడినట్లే. అవకాశాలు: విస్తరిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్లో డాక్టర్కు అనుబంధంగా సేవలు అందించ డానికి పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరి. డయాగ్నోస్టిక్ సెంటర్స, ఎక్స్-రే యూనిట్లు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఈసీజీ సెంటర్లు, ఆపద సమయాల్లో రక్తం అందించే బ్లడ్ బ్యాంక్లు మనకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లోను కనిపిస్తాయి. వీటికి సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బంది చాలా అవసరం. ఇటీవల కాలంలో గుండె సంబంధ శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగింది. హృద్రోగ చికిత్సను అందించే ఫిజిషియన్కు సహకరించే పర్ఫ్యూషన్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్లు పాత్ర కీలకంగా మారింది. ఈ విభాగాల్లో సిబ్బందికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి పారామెడికల్ కోర్సు పూర్తయిన వెంటేనే ఉద్యోగం లభించడం ఖాయం. అర్హత: పారామెడికల్ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ (సెన్సైస్) విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సంబంధిత పర్యవేక్షణ విభాగం జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్), గాంధీ మెడికల్ కాలేజీ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అందులో నైపుణ్యం ఉన్న వారిని నేరుగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎయిమ్స్ కూడా ఇటువంటి కోర్సులను అందిస్తోంది. సాధారణంగా ఈ కోర్సుల కాలవ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు వేతనం లభిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లోనైతే రూ.10 వేల నుంచి 12 వేల వరకు అందుతుంది. తర్వాత అర్హత అనుభవం ఆధారంగా నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు పారామెడికల్కు సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్లు వివిధ రకాల కోర్సులను అందజేస్తున్నాయి. వీటికి సరైన గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఇన్స్టిట్యూట్లలో చేరడం మంచిది. ఎన్ఎస్డీసీ-హెచ్ఎస్ఎస్సీ ఏర్పాటు: దేశంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా సుక్షితులైన పారామెడికల్ సిబ్బంది తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ-జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ)..హెల్త్కేర్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ (హెచ్ఎస్ఎస్సీ)ను ఏర్పాటు చేసింది. ఇది పారామెడికల్కు సంబంధించి 29 విభాగాలను గుర్తించింది. ప్రస్తుత అవసరాలకనుగుణంగా కోర్సు సిలబస్ను రూపొందించడంలో నిమగ్నమైంది. హెచ్ఎస్ఎస్సీ వివిధ అనుబంధ సంస్థల ద్వారా అందజేసే ఈ కోర్సులకు నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు. అభ్యర్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని భావిస్తే వారిని హెచ్ఎస్ఎస్సీ పరీక్ష (అసెస్మెంట్)కు పంపొచ్చు. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణులతో కూడిన ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ సదరు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, రిపోర్ట్ కార్డు అందజేస్తుంది. దాని ఆధారంగా దేశ వ్యాప్తంగా పారామెడికల్ ఉద్యోగాల కోసం ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్ టె క్నీషియన్ విధి. ఈ కోర్సు తర్వాత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీగా బీఎస్సీ(ఎంఎల్టీ) చేయొచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ (సెన్సైస్) తర్వాత బీఎస్సీ ఎంఎల్టీలో ప్రవేశం పొందొచ్చు.. డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది..? దానికి రేడియేషన్ ఎంత ఇవ్వాలి.. రేడియేషన్ అవసరం ఉందా,లేదా అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు. డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నీషియన్ హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్-లంగ్ మిషిన్ ఎంపిక, అమరికలో పర్ఫ్యూషన్ టెక్నీషియన్లు బాధ్యత తీసుకుంటారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధ శస్త్ర చికిత్సలు పెరుగుతుండటంతో వీరి అవసరం పెరుగుతోంది. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ ఎంఆర్ఐ, ఎక్స్రే, సిటీస్కాన్, ఆల్ట్రా సౌండ్ వంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్లకు వీరు సహాయపడతారు. డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్థారణ, ‘బ్రోంకే స్కోపి’టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు. సర్టిఫికెట్ ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ బ్లడ్ బ్యాంక్ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్బ్యాంక్కు సంబంధించిన అన్ని రికార్డులను, ఇతర విధులను నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత. సర్టిఫికెట్ ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అన స్థీషియా(మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్లు, డాక్టర్లకు తగువిధంగా సహాయపడుతుంటారు. సర్టిఫికెట్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ ల్యాబ్ నిర్వహణ, ఫిల్మ్స్ డెవలప్మెంట్, ఇమేజింగ్ టెక్నాలజిస్ట్/రేడియాలజిస్ట్లకు సంబంధిత వ్యవహారాల్లో తగిన విధంగా సహాయం చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు. సర్టిఫికెట్ ఇన్ ఎమర్జెన్సీ పారా మెడిక్ టెక్నాలజిస్ట్ ఎమర్జెన్సీ సమయంలో గోల్డెన్ అవర్గా పరిగణించే సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తికి కావల్సిన రెస్పిరేటరీ, కార్డియాక్ సపోర్ట్ అందివ్వడం, రిహ్రై డేషన్, రక్తం పోకుండా చూడడం వంటి అత్యవసర విధులను వీరు పర్యవేక్షిస్తుంటారు. సర్టిఫికెట్ ఇన్ టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్ ఒక వ్యక్తికి ఏదైనా ఆనారోగ్యం కలిగితే.. దానికి సంబంధించిన మెడికల్ డయోగ్నోసిస్, ట్రీట్మెంట్ వంటి అంశాలపై సమాచారాన్ని టెలిమెడిసిన్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉపయోగించి టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్లు అందిస్తారు. ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఈ తరహా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ పుట్టుకతో మాట్లాడటంలో వచ్చిన లోపాలు, పదాలు/శబ్దాలను స్పష్టంగా పలకలేకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం వంటి లోపాలను లాంగ్వేజ్ టెక్నిక్స్ ద్వారా సరిచేయడం వీరి ప్రధాన బాధ్యత. సర్టిఫికెట్ ఇన్ ఈసీజీ టెక్నీషియన్ ఈసీజీ టెక్నీషియన్ హృదయ స్పందనను రికార్డ్ చేసే ఈక్విప్మెంట్ ద్వారా రోగి హార్ట్ బీట్, తదితర అంశాలను రికార్డ్ చేసి సంబంధిత ఫిజీషియన్కు ఆ రికార్డులను అందజేస్తాడు. తద్వారా హార్ట్, వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్కు చికిత్స అందించడంలో సహాయపడతాడు. సర్టిఫికెట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ వివిధ పరీక్షల్లో భాగంగా తీసిన ఎక్స్రే ఫిల్మ్స్ను డెవలప్ చేయడం, సంబంధిత ల్యాబ్ నిర్వహణ వంటి బాధ్యతలను డార్క్ రూమ్ అసిస్టెంట్ నిర్వహిస్తాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement