-
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని...
సాక్షి, జయపురం: తమ ప్రేమను పెద్దలు నిరాకరించారన్న మనస్థాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవరంగపూర్ జిల్లాలోని ఉమ్మర్కోట్ సమితిలో సోమవారం చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న ఉమ్మర్కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వివరాలిలా ఉన్నాయి.. హీరాఫూల్ గ్రామ పంచాయతీలోని నువాగుడ గ్రామానికి చెందిన సనమత భొత్ర(21), భగవతి కొలార్(19)లు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. భగవతి తండ్రి తులారాం కొలార్, సమీపంలోని ఓ గ్రామానికి శనివారం వెళ్లాడు. పనులు ముగించుకుని, తిరిగి ఇంటికి రాగా, ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తలుపు తట్టి, కూతురును పిలవగా, ఎంతసేపైనా రాకపోయేసరికి పక్క ఇంటి వారి సాయంతో తులారాం తలుపులు విరగ్గొట్టాడు. అనంతరం ఇంట్లో ఒక దూలానికి వేలాడుబడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కూతురి శవమైన కనిపించడంతో తులారాం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
వివాహితుడితో పెళ్లి వద్దన్నందుకు...
ఏలూరు : తన కాలనీలో ఉండే వివాహితుడిని ఓ యువతి ప్రేమించింది. అతడితో పెళ్లికి సైతం సిద్ధమైంది. వివాహితుడిని పెళ్లిచేసుకోవద్దని తల్లిదండ్రులు వారించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కొత్తపేట ఇందిరాకాలనీలో నివాసం ఉండే నగరపర్తి సింహాద్రి, అప్పాయమ్మ దంపతులకు మూడో కుమార్తె శిరీష (19). ఆమె పదవ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, శిరీష తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుని జీవిస్తుంటారు. తమ కాలనీలో నివాసం ఉండే సూరిబాబు అనే తాపీమేస్త్రీతో శిరీష పరిచయం పెంచుకుంది. అయితే సూరిబాబుకు ఏడాది క్రితమే పెళ్లయింది. అయినప్పటికీ తనకు అతనితోనే వివాహం జరిపించాలంటూ శిరీష పట్టుబడుతోంది. అందుకు ఆమె తల్లిదండ్రులు సింహాద్రి, అప్పాయమ్మలు అంగీకరించకపోవటంతో మనస్తాపానికి లోనైంది. దీంతో గురువారం ఎవరు లేని సమయం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement