-
అమెరికాపై మోజు తగ్గుతోందా?
వాషింగ్టన్: అమెరికా మోజు తగ్గుతోందా? ఈ ప్రశ్నకు అమెరికా పర్యాటకశాఖ మాత్రం అవుననే చెబుతోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య గత ఆరు నెలల్లో 13 శాతం తగ్గిందట. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి నుంచి జూన్ వరకు ప్రయాణికుల సంఖ్య 12.9 శాతం తగ్గింది. ఈ ఆరు నెలల్లో చివరి మూడు నెలలు.. అంటే ఏప్రిల్, మే, జూన్లో 18.3 శాతం తగ్గుదల నమోదైంది. ‘2017 తొలి త్రైమాసికంలో తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై అమెరికా అంత తీవ్రమైన ఆంక్షలు అమలు చేయలేదు. అయితే రెండో త్రైమాసికంలో మాత్రం కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న మార్పులే ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమ’ని బ్రాండ్ యూఎస్ఏ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్ థాంప్సన్ అన్నారు. భారత్లో పెరుగుతున్న మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమై ఉండవచ్చని థాంప్సన్ అభిప్రాయపడ్డారు. -
స్పృహ కోల్పోతున్న.. సురక్షితంగా చేర్చిండు
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి బూర్గంపాడు: కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై..నీరసంతో స్పృహ కోల్పోబోతున్నా..బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి..ప్రయాణికులను రక్షించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం నుంచి బస్సు బయల్దేరగా..40 నిమిషాల తర్వాత డ్రైవర్ మల్సూర్ అస్వస్థతకు గురై..చొక్కా తడిచేలా చెమట పట్టి.. నీరసంగా మారాడు. శరీరం తూలిపడుతున్న విషయాన్ని కండక్టర్ గమనించి ఏమైందని ప్రశ్నిస్తున్నా..ఓపికగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. 11:30 గంటలకు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి ఓపికంతా నశించి బస్సును రోడ్డు పక్కన ఆపేసి స్టీరింగ్పై వాలిపోయాడు. ప్రయాణికులు, స్థానిక యువకులు అతడిని కిందకు దింపి..బైక్పై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోవటంతో ఒళ్లంతా చెమటలు పోసి స్పృహ కోల్పోయే స్థితికి చేరాడని తెలిపారు. ఈ స్థితిలోనూ క్షేమంగా డ్రైవింగ్ చేసిన అతడిని అంతా అభినందించారు. ప్రథమ చికిత్స అనంతరం భద్రాచలం తరలించారు. బస్సులోని ప్రయాణికులను కండక్టర్ వేరే బస్సులో ఎక్కించి పంపించారు. -
rtc driver save pasingers
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి బూర్గంపాడు: కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై..నీరసంతో స్పృహ కోల్పోబోతున్నా..బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి..ప్రయాణికులను రక్షించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం నుంచి బస్సు బయల్దేరగా..40 నిమిషాల తర్వాత డ్రైవర్ మల్సూర్ అస్వస్థతకు గురై..చొక్కా తడిచేలా చెమట పట్టి.. నీరసంగా మారాడు. శరీరం తూలిపడుతున్న విషయాన్ని కండక్టర్ గమనించి ఏమైందని ప్రశ్నిస్తున్నా..ఓపికగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. 11:30 గంటలకు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి ఓపికంతా నశించి బస్సును రోడ్డు పక్కన ఆపేసి స్టీరింగ్పై వాలిపోయాడు. ప్రయాణికులు, స్థానిక యువకులు అతడిని కిందకు దింపి..బైక్పై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోవటంతో ఒళ్లంతా చెమటలు పోసి స్పృహ కోల్పోయే స్థితికి చేరాడని తెలిపారు. ఈ స్థితిలోనూ క్షేమంగా డ్రైవింగ్ చేసిన అతడిని అంతా అభినందించారు. ప్రథమ చికిత్స అనంతరం భద్రాచలం తరలించారు. బస్సులోని ప్రయాణికులను కండక్టర్ వేరే బస్సులో ఎక్కించి పంపించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement