-
నేడు సినీ మార్గదర్శకుడు కేవీ రెడ్డి వర్ధంతి
సినిమాకు ఒక విధానం ఉందనీ, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందనీ, దాన్ని అనుసరించే సినిమాలు తీయాలని చెప్పి, చేసి చూపిన దర్శక మేధావి కేవీ రెడ్డి. సరైన స్క్రిప్టు సినిమాకు ముఖ్యమనీ, స్క్రీన్ప్లే సిద్ధమైతే సినిమా మూడొంతులు పూర్తయినట్టేనని నిరూపించిన దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగణ్యులు. దర్శకునిగా కేవీ రెడ్డి మూడు దశా బ్దాల కాలంలో తీసిన సినిమాల సంఖ్య కేవలం 14. తమిళ, హిందీ వెర్షన్లతో కలిపితే 18. వీటిలో 5 పౌరాణికాలు, నాలుగు జానపదాలు, 3 సాంఘికాలు, రెండు చారిత్రకాలు ఉన్నాయి. ఆయన పేరు చెప్పగానే ‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి కథ’, ‘దొంగ రాముడు’ గుర్తొస్తాయి. కేవీ 1937లో తన మిత్రుడు మూలా నారాయణస్వామి భాగ స్వామిగా ఉన్న ‘రోహిణీ పిక్చర్స్’లో ప్రొడ క్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేరడంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పట్లో రోహిణీ పిక్చర్స్ హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) తీసింది. ఇక్కడే ఆయనకి బీఎన్ రెడ్డి, సముద్రాల, నాగిరెడ్డిలతో పరిచయమైంది. తర్వాత వీరంతా బయటికి వచ్చి వాహినీ పిక్చర్స్ స్థాపించారు. వాహినీ పతాకంపై బీఎన్ తీసిన ‘వందేమాతరం’ (1939), ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941) చిత్రాలకు కేవీ సహాయ దర్శకులుగా చేశారు. దేవత తరువాత కేవీకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అది మూలా నారాయణస్వామి పెట్టుబడితో తీసిన ‘భక్తపోతన’ (1942). అది రజతోత్సవాలు జరుపుకుంది. ‘గుణసుందరి కథ’ (1949) విజయం ఇచ్చిన ప్రేరణతో విజయావారికి మరో అద్భుత జనరంజకం ‘పాతాళభైరవి’ (1951) తీశారు. ‘మాయాబజార్’ (1957) ఒక చరిత్రను సృష్టించింది. కేవీ దర్శకత్వ ప్రతిభకు, పకడ్బందీ స్క్రీన్ ప్లేకు ఈ చిత్రం ఒక తిరుగులేని సిలబస్. తెలుగు చిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కేవీ రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) 1912 జులై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పుట్టారు. 1972 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. కేవీ మనమధ్య లేక పోయినా ఆయన కళకు, వ్యాపారానికి సమన్వయం చేస్తూ తీసిన చిత్రాలు చూస్తున్నంత కాలం చిరంజీవిగా నిలిచే ఉంటారు. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. – హెచ్. రమేష్ బాబు, చలనచిత్ర పరిశోధకులు (నేడు కేవీ రెడ్డి వర్ధంతి) -
ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?
రచయితగా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్న కోన వెంకట్కి ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావటం లేదు. శ్రీనువైట్లతో వివాదం, ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ మనసు మార్చుకొని చేసిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచటంతో ఇటీవల సక్సెస్లతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కోన. అదే సమయంలో నిర్మాతగా మారి ఒకప్పటి క్లాసిక్ టైటిల్స్తో సినిమాలను నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా గీతాంజలి పేరుతో ఓ హార్రర్ కామెడీని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. అదే జోష్లో మరో క్లాసిక్ శంకరాభరణం టైటిల్తో క్రైమ్ కామెడీని ప్లాన్ చేసిన కోన ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయాడు. అంతేకాదు క్లాసిక్ టైటిల్ను సరైన సినిమాకు వినియోగించలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. అయినా కోన వెంకట్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే అపురూప చిత్ర రాజాల్లో ఒకటైన పాతాళభైరవి టైటిల్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోనవెంకట్. ప్రతి తెలుగు వాడికి సుపరిచితమైన ఈ టైటిల్తో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కోనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ పేరుకు న్యాయం చేసే అంత మంచి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది వెయిట్ చేయాల్సిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement