-
తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా
పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఓ జర్నలిస్ట్పై దూషణలకు దిగారు. ఓ దినపత్రికలో వ చ్చిన కథనం నేపథ్యంలో సదరు జర్నలి స్ట్కు ఫోన్చేసి ‘తమాషా చేస్తున్నావా.. నా పేరుతో కథనం రాస్తావా.. ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు. ఈ ఆడియో కాస్తా మంగళవారం సోషల్ మీడియాలో వైరలైంది. అనంతరం తన ను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఫోన్లో దూ షించారని జర్నలిస్టు సంతోష్నాయక్ పో లీసులను ఆశ్రయించాడు. తాను రాసిన కథనానికి ఎమ్మెల్యే ఫోన్లో దూషించడం తో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని డీఎస్పీ భీంరెడ్డిని కలసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే తీరును టీయూడబ్ల్యూజే– ఐజేయూ ఒక ప్రకటనలో ఖండించింది. -
మినీ ఇండియా
సాక్షి, పటాన్చెరు : అసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికుల సంగమంగా విరాజిల్లుతోంది. గతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతం 2008లో పటాన్చెరు కేంద్రంగా శాసనసభ స్థానంగా రూపుదిద్దుకుంది. అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనూ కార్మిక సంఘాల నేతలే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. పటాన్చెరు నియోజకవర్గ ముఖచిత్రం.. మొత్తం ఓటర్లు : 2,73,210 పురుషులు: 1,40,988 మహిళలు: 1,32,168 ఇతరులు: 54 పోలింగ్ స్టేషన్లు: 340 2009లో తొలి సారి ఎన్నికలు 2009లో తొలి సారిగా పటాన్చెరు నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాలను కలుపుతూ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి టి. నందీశ్వర్గౌడ్ ఎన్నికయ్యారు. తన సమీప అభ్యర్థి ఎం.సపాన్దేవ్పై నందీశ్వర్ విజయం సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గూడెం మహిపాల్రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సపాన్దేవ్కు 55100 ఓట్లు రాగా మహిపాల్రెడ్డికి 73986 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో పటాన్చెరు అంతర్భాంగా ఉన్న సమయంలో పటాన్చెరుకు చెందిన దివంగత నాయకులు నర్సింహ్మారెడ్డి(స్వతంత్ర–1978), సదాశివరెడ్డి(టీడీపీ–1994) ఎమ్మెల్యేలుగా పని చేశారు. 1999లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రపంచ స్థాయి కీర్తి.. పటాన్చెరు ప్రాంతం నిజాం కాలంలో సుభా కేంద్రంగా పట్టణ రూపురేఖలను సంతరించుకుంది. ఇక్కడ గొప్ప వ్యాపారం కేంద్రం ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. గొల్కండ కోటకు మొత్తం ఏడు దర్వాజలు ఉండగా ఒక దాని పేరు పటాన్చెరు దర్వాజగా ఉంది. నిజాంకాలంలో పటాన్చెరు ప్రాంతం సుభా కేంద్రాంగా ఉంది. ఆ తర్వాత ఇక్రిశాట్, బీహెచ్ఈఎల్, బీడీఎల్ ఏర్పాటుతో పటాన్చెరుకు ప్రపంచè స్థాయి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. రాను రాను పటాన్చెరు అంటేనే పరిశ్రమల కేంద్రంగా పేరొందింది. ఇది ఇలా ఉంటే 2010 నాటికి ఈ ప్రాంతంలో 15 వందల పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ ప్రాంతం భూలోక నరకంగా, కాలుష్యానికి చిరునామాగా మిగిలింది. మిని ఇండియాగా.. దేశం నలుమూలల నుంచి వలస వచ్చి వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న వారితో ఈ ప్రాంతం మిని ఇండియాగా మారింది. పటాన్చెరు నియోజకవర్గం ప్రాంతంలోని పాశమైలారం పారిశ్రామికవాడ, బొల్లారం ప్రాంతంలోని పరిశ్రమల్లో దాదాపు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలను చూడవచ్చు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదార్లు ఇక్కడ ఉన్న తమ పరిశ్రమలను పరిశీలించేందుకు వచ్చి వెళ్తుంటారు. తాజాగా అమెజాన్, గ్రోఫర్స్ వంటి ఎంఎన్సీ ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికైనా సరకులను సరఫరా చేసేందుకు నాగులపల్లిలో కంటేనర్ కార్పొరేషన్ సంస్థ ఇన్లాండ్ కంటేనర్ రావాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో మూసాపేట(హైదరాబాద్)లోని కాంకార్డ్ను నాగులపల్లికి తరలించనున్నట్లు సమాచారం. పటాన్చెరు నియోజకవర్గ ప్రాంతంలో ఔటర్ రింగ్రోడ్డు దాదాపు 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఓఆర్ఆర్ ఏర్పాటుతో పటాన్చెరు ప్రాంతం రూపురేఖలు మారిపోయి పట్టణం విస్తరించింది. సమీప ప్రాంతాలకు సైతం పట్టణ రూపు వచ్చింది. రెండు దశాబ్ధాల క్రితం అమీన్పూర్లో ఎనిమిది వేల జనాభ ఉండేది. ప్రస్తుతం ఆ గ్రామంలో వందకు పైగా కాలనీలు వెలిశాయి. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం ప్రాంతాలు పట్టణాలుగా రూపాంతరం చెందాయి. పాలన సౌలభ్యత కోసం ప్రభుత్వం వాటిని మున్సిపాల్టీలుగా మార్చింది. అవి మాత్రమే కాకుండా అన్ని గ్రామాల్లో కాలనీలు వెలిశాయి. జిన్నారంలోని కొన్ని ప్రాంతాలు మినాహా దాదాపు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలు నగర రూపును సంతరించుకున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూర గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి. కార్మిక వర్గాలే కీలకం ప్రభుత్వ రంగ, ప్రైవేటు పరిశ్రమల్లో పని చేసే కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించే నాయకులకు ఇక్కడ ఆదరణ లభిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గత ఎన్నికల్లో కార్మిక వర్గాల విశ్వాసాన్ని చురగొన్నారు. అంతకుముందు పటాన్చెరు తొలి ఎమ్మెల్యేగా పని చేసిన నందీశ్వర్గౌడ్ కూడ గతంలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇద్దరు కూడ దివంగత కాంగ్రెస్ నేత, కార్మిక, శ్రామిక వర్గాల నాయకుడిగా గుర్తింపు పొందిన పి.జనార్ధన్రెడ్డి శిష్యులుగా గుర్తింపు పొందారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న పరిశ్రమల్లో పని చేసే వారంతా తెలంగాణాలోని ఇతర జిల్లాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఆయా పరిశ్రమల పేరిట కాలనీలు ఏర్పడ్డాయి. ఆల్విన్, డిఫెన్స్, బీడీఎల్, బీరంగూడలోని ఐటీ డబ్లు్య, స్నిగ్నోడ్, ఎన్ఎస్ఎల్ కాలనీ ఇలా వందలాది కాలనీలు ఆయా పరిశ్రమల పేరిటే ఉన్నాయి. కార్మిక వర్గాలకు గతంలో ఇళ్లు ఇప్పించేందుకు నాయకులు కృషి చేశారు. ఇప్పుడు బీహెచ్ఈఎల్ కార్మిక సంఘాలు కూడ చౌకగా కార్మికులకు ఇళ్లు ఇప్పించేందుకు ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇళ్లు కట్టిస్తున్నాయి. -
విందు పేరుతో ప్రలోభాలు: ఎమ్మెల్యేపై కేసు నమోదు
మెదక్ జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్పై స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ నందీశ్వర్ గౌడ్పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గత అర్థరాత్రి హోటల్లో ముస్లిం ఓటర్లకు సదరు ఎమ్మెల్యే విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఆ విందుపై కొంత మంది యువకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హోటల్పై దాడి చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement