-
పెద్దాస్పత్రి..రద్దీలో మేటి
సాక్షి, ఖమ్మం వైద్య విభాగం: ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఇటీవల కాలంలో నిత్యం రోగుల తో కిటకిటలాడుతోంది. సరికొత్త భవనాలు అందుబాటులోకి రావడం, 400 పడకలు ఏర్పాటు కావడం, మెరుగైన వైద్యసేవలను విస్తృతపర్చడం, మాతా శిశు సంరక్షణ చికిత్సలు మంచిగా ఉన్నాయనే గుర్తింపు లభించడం.. తదితర కారణాలతో ఖమ్మంలోని పెద్దాస్పత్రికి రోగులు బారులు తీరుతున్నారు. కొన్ని నెలలుగా ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ల సంఖ్య పుంజుకోవడంతో 24 గంటలపాటు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జ్వర పీడితులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు ..నిత్యం ఇక్కడ చికిత్స పొందుతుండడం సహజమే. ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడంతో ప్రసవాలకు వచ్చే వారు అంతకంతకూ పెరుగుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 6లక్షల మందికి పైగా వైద్య సేవలు పొందడంతో..రద్దీ తీవ్రత స్థాయిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య నాలుగింతలు పెరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. రోజూ 1200 మందికి పైగా వైద్య సేవలు పొందేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ సంఖ్య సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇన్, ఔట్ పేషెంట్లు పెరగడంతో వైద్యులపై మరింత భారం పడుతోంది. వైద్య పరీక్షలు చేయడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. ఔట్ పేషెంట్ రోగులకు వారి జబ్బును బట్టి వైద్యం చేసి ఇంటికి పంపిస్తారు. రోగం నయం అయ్యేవరకు.. మందులు వాడుతూ డాక్టర్ మళ్లీ రమ్మన్నప్పుడు వచ్చి చెకప్ చేయించుకుంటుంటారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు జిల్లా ఆస్పత్రిలో 6,06,552 మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు లభించాయి. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏడాదిగా ఓపీ, ఐపీ సేవలు ఇలా.. నెల ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఏప్రిల్(2018) 47,577 3,108 మే 45,362 2,880 జూన్ 48,168 2,841 జూలై 55,778 3,546 ఆగస్టు 59,813 4,606 సెప్టెంబర్ 66,248 4,842 అక్టోబర్ 64,075 4,148 నవంబర్ 58,644 3,448 డిసెంబర్ 53,054 3,125 జనవరి(2019) 53,633 3,054 ఫిబ్రవరి 54,200 3,344 6,06,552 38,942 39వేల మంది ఇన్ పేషెంట్లు.. ఆర్థోపెడిక్, గైనిక్, పీడియాట్రీషన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి చికిత్స అయినా ఇక్కడి డాక్టర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇన్ పేషెంట్ సేవలు కూడా కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రసూతి సేవలు అధికంగా అందుతుండగా, అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. షిఫ్టులవారీగా వైద్యులు సేవలు అందిస్తుండడంతో సమీప ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు నొప్పులు వచ్చినా, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు జరిగినప్పుడు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. 11 నెలల్లో పెద్దాస్పత్రిలో 39,000 వరకు ఇన్ పేషెంట్ ద్వారా వైద్య సేవలు అందించారు. ప్రసవాల్లో రికార్డు.. ప్రతి నెలా 900కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2017 జూన్ 2న ప్రభుత్వం కేసీఆర్ కట్ పథకాన్ని ప్రవేశపెట్టాక ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు ఆర్థికసాయం, కేసీఆర్ కిట్ లభిస్తున్నాయి. శిశువు, తల్లికి అవసరమైన 15 రకాల వస్తువులు కిట్లో ఉంటాయి. ఈ పథకం రాకముందు రోజుకు 10లోపు ప్రసవాలు జరిగేవి. కానీ.. ప్రస్తుతం రోజుకు 30 వరకు చేస్తున్నారు. పథకం ప్రారంభమైన 20 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,000 ప్రసవాలు నిర్వహించారు. అందులో ఒక్క జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే 14వేల డెలివరీలు జరపడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే మూడు వంతులకు పైగా పెద్దాస్పత్రిలోనే జరుగుతున్నాయి. సేవలు మరింత పెంచేందుకు కృషి ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి రోగికి వైద్య సేవలందిస్తాం. మందులు, బ్లేడ్ల కొరత లేకుండా చూస్తున్నాం. అలాగే ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నాం. ఎంతమంది పేషెంట్లు వచ్చినా వైద్యం చేస్తాం. – డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
రోగాల కాలం
– చిన్న పిల్లలతో కిక్కిరిస్తున్న ఆస్పత్రులు – జిల్లాలో పెరుగుతోన్న నిమోనియా కేసులు – వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు – జిల్లా వ్యాప్తంగా 537 కేసులు గుర్తింపు ధర్మవరం అర్బన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వర్షాలు కురియాల్సిన సమయంలో భానుడి ప్రతాపం చూపటం, ఇదే సమయంలో పగటి పూట ఉక్కపోత, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటం రోగాలకు కారణమవుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు విషజ్వరాలతోపాటు నిమోనియా, ఆస్తమా వంటి వ్యాధులకు గురవుతున్నారు. దీంతో గత పదిరోజుల నుంచి జిల్లాలో చిన్నపిల్లల ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. జలుబుతో మొదలై... తొలుత జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతోంది. నిమోనియా తీవ్రత పెరగడంతో పలువురు పిల్లలు ఆస్తమా, ఫిట్స్కు గురవుతున్నారు. పగలు వేడిగా ఉండటం, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటంతో పిల్లల శరీరం ఇందుకు తట్టుకోవడం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తేమ శాతం తగ్గటం, పెరగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆహార నియమావళిని పాటించకపోవడం వల్ల చిన్నపిల్లలు నిమోనియా బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 537 కేసులు గుర్తింపు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారికంగా 537 నిమోనియా కేసులు నమోదయ్యాయి. ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో నిమోనియా కేసులు నమోదవుతున్నాయి. కొంత మంది వైద్యులు కేవలం దగ్గు, జలుబుగానే వైద్యం చేస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు – వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నందున సాధ్యమైనంత వరకు పిల్లలను బయట తిప్పకూడదు. – చల్లటి పదార్థాలు, చల్లని నీరు తాగించకూడదు. సాధ్యమైనంత వరకు గోరువెచ్చటి నీటిని మాత్రమే తాగించాలి. – చల్లటి గాలి తగలకుండా దలసరి దుస్తులు వేయాలి. – ఒక రోజులో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు - డాక్టర్ యుగంధర్, డిప్యూటీ డీఎంహెచ్వో, ధర్మవరం చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రికి చాలా నిమోనియా, ఆస్తమా కేసులు వస్తున్నాయి. ఇందులో చాలా కేసులు క్లిష్టమైనవిగా ఉంటున్నాయి. కొద్దిపాటి జలుబు, దగ్గు మొదలుకాగానే జాగ్రత్త పడటం మంచిది. జిల్లా వ్యాప్తంగా 537 కేసులను వైద్యులు గుర్తించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వీటి సంఖ్య వందలకు దాటింది. కేసులు పెరుగుతున్నాయి - డాక్టర్ బి.వి.సుబ్బారావు, చిన్నపిల్లల వైద్యుడు, ధర్మవరం నిమోనియా, ఆస్తమాతో బాధపడుతున్న పిల్లల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చలికాలంలో రావాల్సిన కేసులు ఈ సీజన్లో వస్తున్నాయి. 2010, 2014లో ఇదే తరహా కేసులు వచ్చాయి. తిరిగి ఈ ఏడాది కేసులు గణనీయంగా నమోదయ్యాయి. గడిచిన 10 రోజుల్లో నిమోనియా, ఆస్తమా కేసులు ఎక్కువగా వచ్చాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా నిమోనియా సోకుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement