-
కౌలు రైతుకు మేలేదీ?
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయనున్న పెట్టుబడి సాయం పథకంపై కౌలు రైతులు నిరాశతో ఉన్నారు. పెట్టుబడి సాయాన్ని పట్టాదారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పంట సాగుచేస్తున్న తమకు ఇవ్వాలని కోరుతున్నారు. పెట్టుబడి సాయం పథకంతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి ఆవేదన చెందుతున్నారు. భూపట్టాదారుల్లోని ధనిక రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. వారి భూమిని సామాన్య రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తాము భూయజమానులకు కౌలు చెల్లిస్తుండగా, ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని వారికే ఇస్తుండటం ఏమిటని అంటున్నారు. జిల్లాలో 1,69,892 ఎకరాల సాగు భూమి జిల్లాలోని 16 మండలాల్లో 1,69,892 ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 3,74,519 రైతులు భూములు కలిగి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల ప్రక్షాళనలో గుర్తించారు. భూమి కలిగిన రైతుల్లో సుమారు 50శాతానికి పైగా తమ భూములను ఇతరులకు కౌలుకు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కౌలుకు తీసుకున్న వారు ఆయా భూములకు సంబంధించి ఎకరానికి రూ.8 నుంచి రూ.11వేల వరకు కౌలు చెల్లిస్తుండగా ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో భూ యజమానికి మరో రూ.4 వేలు అదనంగా లబ్ధిచేకూరనుంది. కౌలు రైతులను ఆదుకోని ప్రభుత్వం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని పంటసాగు చేస్తున్న కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటసాగు చేసిన సమయంలో అనుకోని విపత్తులు వచ్చి నష్టపోయిన సమయంలో సైతం తమకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించిన పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆర్థికంగా చేయూతనందించాలని కౌలు రైతులు కోరుతున్నార సాగు చేసిన వారికే డబ్బులు ఇవ్వాలి పంట సాగు చేసిన వారికే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. పంటలు ఒకరు సాగు చేస్తే ఇంకొకరికి డబ్బులు ఇస్తామనటం సరైనది కాదు. డబ్బులు పట్టాదారులకే ఇవ్వటం వల్ల మాకు ఎలాంటి మేలు జరగదు. – నల్లమాస హరినాథ్, కౌలు రైతు, బయ్యారం రైతులందరికీ సాయం అందించాలి పంటలు పండించే రైతులందరికీ ప్రభుత్వం సాయం అందించాలి. పట్టాదారులకే కాకుండా కాస్తులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించినప్పుడే రైతులు పంటలసాగుపై దృష్టి పెడతారు. వీటితోపాటు పండించిన పంటకు గిట్టుభాటు ధర కల్పించాలి. – గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి -
పాత పద్ధతిలో పాసు పుస్తకాలు
రెండు నెలల గందరగోళానికి తెర సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ పట్టాలెక్కింది. ఇప్పటి వరకు ఆటకెక్కించిన రెవెన్యూ శాఖ ఇప్పుడు మళ్లీ పాత బట్టింది. ఆన్లైన్ విధానంపై ఆలోచనను తాత్కాలికంగా విరమించింది. రెండు నెలలపాటు కొనసాగిన అయోమయానికి తెరదించింది. కొత్త పుస్తకాల ముద్రణను ప్రారంభించింది. కొత్త జిల్లాల పేర్లు ఉండేవిధంగా ముద్రణకు ఆదేశించింది. పహాణీల మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకాలను కూడా ఆన్లైన్ ద్వారా అందజేయాలని గతంలో రెవెన్యూ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి నాటి సీసీఎల్ఏ రేమండ్పీటర్ కసరత్తు కూడా చేశారు. అది పూర్తికాకుండానే మాన్యువల్ పాసుపుస్తకాల జారీ నిలిపివేయాలంటూ రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వాటి ముద్రణ కూడా నిలిచిపోయింది. ఆన్లైన్ కోసం సాఫ్ట్వేర్ సిద్ధం కాకపోవటం, దానికి సంబంధిత సంస్థతో ఒప్పందం జరగకపోవటం, దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదమూ రాకపోవటంతో ఆ కసరత్తులో జాప్యం జరిగింది. ఇంతలో రేమండ్ పీటర్ పదవీవిరమణ చేశారు. దీంతో ఈ విషయాన్ని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రయోగాత్మకంగా ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా వ్యవహరించారు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, చాలాచోట్ల ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతోందని తహసీల్దారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దిగొచ్చిన అధికారులు కాలం కలసి రాక ఖరీఫ్ పంటలను కోల్పోయిన రైతులు రబీపై దృష్టి సారించారు. పంట రుణాల కోసం సిద్ధమవుతుండగా పట్టాదారు పాసు పుస్తకాల సమస్య వచ్చి పడింది. కొత్తగా పాసుపుస్తకాలు అవసరమైనవారికి రుణాలు పొందే వెసులుబాటు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సాగుకు అవసరమైన స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వ పథకం కింద దరఖాస్తు చేసుకుని సబ్సిడీ వెసులబాటు పొందాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక తండ్రి నుంచి సంక్రమించిన భూములను పంచుకునే క్రమంలో వారసులకు కొత్త పాసు పుస్తకాల జారీ కావటం లేదు. భూముల క్రయవిక్రయాలకూ ఇదే ఇబ్బంది ఏర్పడింది. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దీంతో జనం గగ్గోలు పెడుతుండటంతో ఎట్టకేలకు అధికారులు దిగొచ్చారు. -
ఆధార్తో పట్టాదార్ పాస్ పుస్తకాల అనుసంధానం
ఏలూరు, న్యూస్లైన్: ప్రతి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఆధార్తో అనుసంధానం చేయాలని రాష్ట్ర భూపరిపాలనా శాఖ కమిషనర్ ఐవీఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ భూముల రక్షణ, మీ-సేవా, ఆధార్ సీడింగ్ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ-సేవ ద్వారా రెవెన్యూ రికార్డులను మార్పు చేయడానికి వచ్చిన ఆర్జీలను నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించాలన్నారు. వారికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఆదేశించారు. భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి కూడా ఇ-ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాస్ బుక్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సర్కార్ భూమి వివరాలను ఈ నెల 15వ తేదీలోగా పొందుపరచాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను సర్కార్ భూమి వెబ్సైట్లో నమోదు పరచాలని, ప్రభుత్వ భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో కౌలురైతులకు రూ.137.49 కోట్లను అందజేశామన్నారు. దీనిద్వారా 55 వేల 102 మంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. జిల్లాలో లక్షా 26 వేల 178 మంది అర్హులైన కౌలు రైతులకు ఋణ అర్హత కార్డులు అందించామన్నారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement