-
ఎంజీఎంలో జేసీ హల్చల్
ఎంజీఎం, న్యూస్లైన్ : నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాస్పత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు హల్చల్ చేశారు. ఈనెల 19న(ఆదివారం) హెచ్డీఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న జేసీ ముందుగా అత్యవసర వార్డు, తర్వాత ఓపీ విభాగం, బ్లడ్బ్యాంక్, ఏఆర్టీ సెంటర్, ఏపీఎంఎస్ఐడీసీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్ను పరిశీలించారు. అనంత రం రోగులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. సాయంత్రం 6.00 గంటల తర్వాత సూపరిం టెండెంట్ చాంబర్లో సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, హెచ్ఓడీ కరుణాకర్రెడ్డి, బలరాం, డైటీషియన్ వీరమల్లు తదితరులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం ఆస్పత్రిలో 1.10 కోట్లతో ఏపీఎంఎస్ఐడీసీ అధికారు లు చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించినప్పుడు చేపట్టిన పనుల వివరాలు తెలుపాలని కోరారు. ఓపీ విభాగంలో రోగుల సౌకర్యార్థం రక్త సేకరణ గదిలో చేపట్టిన టాయ్లెట్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిన విషయాన్ని గ్రహించిన ఆమె ఈఈ దేవేందర్పై మండిపడ్డారు. నాసిరకంగా పనులు నిర్వహిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణాలపై సూపరింటెండెంట్తో చర్చించి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడల్ డయాగ్నస్టిక్స్ నిర్వహణపై జేసీ నిప్పులు చెరిగారు. ఇన్పేషంట్ల రిపోర్టులు సెంటర్లోనే దర్శనమివ్వడం, ఈనెల 7న తీసిన స్కానింగ్ రిపోర్టులు వార్డుకు చేరకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రోగులకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంజీఎం ఇన్పే షంట్లకు ఇవ్వడం లేదని పలువురు రోగులతోపాటు వైద్యసిబ్బంది సైతం ఆమెకు వివరించారు. మెడల్ నిర్వహణతీరును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఎన్ని స్కానింగ్లు తీస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. వేయ్యి పడకల ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న డైట్(భోజనాన్ని) ఎలా ఉంటుందని జేసీ పౌసుమిబసు సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్లతోకలిసి రుచిచూశారు. డైట్లో అందుబాటులో ఉంచిన సరుకులను సైతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడీ తీరుపై అసహనం ఆస్పత్రి అసిస్టెండ్ డెరైక్టర్ విధులు నిర్వహిస్తున్న తీరుపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. అతను పలువురు సిబ్బం దికి సంబంధించిన సెలవులు, ఆయ సంతోషమ్మ వేతన చెల్లింపు విషయంలో అతడి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథ శిశువుల తరలింపు కోసం ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు ఎంజీఎంలో 9 మంది అనాథ శిశువులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు సుమారు ఆరు నెలలుగా ఎంజీఎంలోనే ఉండడంతో ఆస్పత్రి సిబ్బందికి ఇబ్బంది మారింది. ఆ చిన్నారులను శిశు గృహాలకు తరలించాలని ఏన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడంతో సంబంధిత సిబ్బంది జేసీకి వివరిం చారు. దీంతో ఆమె అనాథ పిల్లలను తరలించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
విధుల్లో చేరిన కొత్త జేసీ
కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాకు జాయింట్ కలెక్టర్గా వచ్చిన పౌసుమి బసు బుధవారం విధుల్లో చేరారు. ఇంతకాలం ఇన్చార్జ్ జేసీగా ఉన్న వివేక్యాదవ్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కలెక్టరేట్లోని జేసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్య్కూట్ అతిథి గృహానికి వెళ్లారు. సాయంత్రం కార్యాలయంలో డీఆర్వో సురేంద్రకరణ్, ఆర్డీవోలు, పౌరసరఫరాల సంస మేనేజరు రాజేంద్రకుమార్, ఇతరు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా : జేసీ విధుల్లో చేరిన జేసీ పౌసుమి బసును బుధవారం సాయంత్రం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని ఉద్యోగ సంఘాల నేతలతో జేసీ అన్నారు. జిల్లాలో సుమారు 70 శాఖల ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. జేసీని కలిసినవారిలో గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రాజేష్కుమార్గౌడ్, కార్యదర్శి రత్నవీరాచారి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, కార్యదర్శి రాజ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు చీకటి వెంకటేశ్వర్లు, మహేష్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రత్నాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాందారి బిక్షపతి, శ్రీశైలం, రంజిత్, చుంచు రవీందర్, నాల్గవ తర గతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యనాయక్, ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం బాధ్యుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement