-
బుడ్డ శనగ రైతులకు శుభవార్త
♦ జిల్లాలో 11,262మందికి రూ55.54కోట్లు మంజూరు ♦ వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ ♦ ఫలించిన ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి, ♦ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల కృషి పులివెందుల/రూరల్ : జిల్లాలో 2012-13 రబీ సీజన్లో సాగు చేసి ప్రీమియం చెల్లించిన బుడ్డ శనగ రైతులకు వారం, పది రోజుల్లో బీమా మొత్తాన్ని జమ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2012-13 రబీ సీజన్లో 55 వేలమంది రైతులు బుడ్డ శనగకు ప్రీమియం చెల్లించారు. ఇందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో 28,372 మంది రైతులకు సంబంధించి రూ.124.03 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన 26వేలమంది రైతులకు పరిహారం మంజూరు కాలేదు. ఈ రైతుల దరఖాస్తులలో డేటా షోయింగ్, రైతులు, రెవెన్యూ అధికారుల సంతకాలు లేకపోవడం, డబుల్ ఎంట్రీ కారణాలతో ఏఐసీ(అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ) ఆఫ్ ఇండియా అధికారులు వాటిని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో పరిహారం అందని రైతులకు బీమా మంజూరుచేయాలంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు పలుమార్లు ఏఐసీ ఆఫ్ ఇండియా జీఎం రాజేశ్వరిసింగ్, వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గతంలో ఏఐసీ ఆఫ్ ఇండియా కార్యాలయానికి రైతులతో వెళ్లి వారి పరిస్థితిని వివరించి నెల రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని ఇద్దరు ఒత్తిడి తెచ్చారు. రెండో విడతలో 11,262 మందికి లబ్ధి జిల్లావ్యాప్తంగా 11,262 మంది రైతులకు రూ55.54కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి 3,623మంది రైతులు ఉన్నారు. వీరికి వారం, పదిరోజుల్లో పరిహారం వారి ఖాతాల్లో జమ కానుంది. మిగిలిన రైతులకు సైతం పరిహారం అందించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు కృషిచేయనున్నారు. బుడ్డశనగ రైతుల బీమా మంజూరుకు కృషిచేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలకు వేముల జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పుడు దండగ... ఇప్పుడు పిచ్చోళ్లా
రైతులంటే అంత చులకనా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్: జిల్లాలో శనగరైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేశారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ళ పాలనలో వ్యవసాయం దండగ అన్నాడని, ఇప్పుడు శనగ రైతులను పిచ్చోళ్లనడం చూస్తుంటే చంద్రబాబు వైఖరికి ఏంటో అర్ధమవుతుందన్నారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గాని, మంత్రి గాని జిల్లాలో ఉన్న సమస్యలపై ఏ ఒక్క రోజైనా తమ ముఖ్యమంత్రితో మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రబుత్వం స్పందించి శనగరైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు రూ.75 కోట్లు నిధులిచ్చి ఏ విధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. మొదటి టన్నెల్ పూర్తి చేయటానికి రూ.250 కోట్లు అవసరమవుతుందని అయితే ఇంత తక్కువ నిధులు కేటాయించిన చంద్రబాబు ఏ విధంగా సంవత్సరంలో పూర్తి చేయగలరని నిలదీశారు.ఇప్పటికైనా అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మొద్దునిద్రను వీడి ప్రజాసమస్యలు, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి పార్టీలకు అతీతంగా పని చేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement