-
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్గాంగ్ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్కాంగ్కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్తో వివాహేతర సంబంధమే చిన్గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్గాంగ్కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్బాల్ క్లబ్కి యజమాని కూడా అయిన గ్వాంగ్చాంగ్ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి
బీజింగ్: చైనా ఉపాధ్యక్షుడు జాంగ్ గవోలీ తనను బలవంతంగా లొంగదీసుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన చైనా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షూయి మాట మార్చింది. తనపై లైంగిక దాడే జరగలేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సింగపూర్కు చెందిన ఓ చైనా భాషా పత్రికతో మాట్లాడుతూ.. ఆమె ఈ మేరకు స్పష్టం చేసింది. లైంగిక దాడి అంశంపై తాను చేసిన ఆన్లైన్ పోస్ట్ను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తనపై లైంగిక దాడి జరిగిందని తాను ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపింది. ఇదిలా ఉంటే, లైంగిక దాడి విషయమై చైనా ప్రభుత్వం పెంగ్పై ఒత్తిడి తెచ్చిందంటూ మహిళల టెన్నిస్ సమాఖ్య అనుమానం వ్యక్తం చేస్తుంది. పెంగ్.. చైనా ఉపాధ్యక్షుడిపై ఆరోపణలు చేసిన నాటి నుంచి కనిపించకుండా పోవడంతో టెన్నిస్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: భార్య, గర్ల్ఫ్రెండ్ వల్లే అదంతా.. బీసీసీఐ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
నాటకీయ పరిణామాలు.. చైనాకు దిమ్మతిరిగే షాక్
అగ్రదేశాలతో పోటీ పడి పరుగులు తీసే క్రమంలో.. డ్రాగన్ కంట్రీ బొక్కాబోర్లా పడుతోంది. అది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. అలాగే అంతర్జాతీయ సమాజంలో చైనా పేరును బద్నాం చేసేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా, చేష్టలకు పాల్పడ్డా సహించడం లేదు. ఈ క్రమంలోనే సొంత క్రీడాకారిణి విషయంలో తప్పటడుగు వేసి.. ఫలితం అనుభవిస్తోంది ఇప్పుడు. క్రీడలంటే అమిత ఆసక్తి చూపే చైనాపైనే ఇప్పుడు క్రీడాలోకం తిరగబడింది. కనిపించకుండా పోయిన చైనా టెన్సిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(WTA) చైనాను ఏకీపారేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెంగ్ ఆచూకీ చెప్పేవరకు అంతర్జాతీయ టెన్నిస్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న చైనాలో తక్షణమే పోటీలను నిలిపివేస్తున్నట్లు డబ్ల్యూటీఏ అధ్యక్షుడు స్టీవ్ సిమన్ ప్రకటించారు. ఈ విషయంలో డబ్ల్యూటీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విషయంలోకి వెళితే.. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కీలకనేత జాంగ్ గవోలి (అధ్యక్షుడు జిన్ పింగ్కు కీలక అనుచరుడు) తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్ షువాయి నవంబర్ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే ఆమె ఏరోజైతే పోస్ట్ డిలీట్ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయం బయటకు తెలియడంతో పెంగ్ షువాయి అదృశ్యంపై పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. అంతర్జాతీయ టెన్నిస్ స్టార్లు నొవాక్ జకోవిచ్ మొదలుకొని సెరెనా, నవామీ ఒసాకా, నాదల్, పలువురు మాజీ టెన్నిస్ క్రీడాకారులతో పాటు ఇతర రంగాలకు చెందిన క్రీడాకారులు సైతం ఆమె ఆచూకీ చెప్పాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మోసం బట్టబయలు! కాగా, పెంగ్ కనిపించకపోవడంపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టీవ్ సిమన్. ఆమె ఆచూకీపై సందేహాలు వ్యక్తం చేస్తూ వెంటనే చైనా ప్రభుత్వం ఆమె ఆచూకీ గురించి చెప్పాలని.. లేదంటే ఆ దేశంలో జరగనున్న అన్ని టోర్నీలను తక్షణమే నిలిపివేస్తామని హెచ్చరించారు. దీంతో చైనా అధికార మీడియా సంస్థ హడావిడి మొదలుపెట్టింది. పెంగ్ పేరుతో డబ్ల్యూటీఏకి ఒక ఈ మెయిల్ పంపించింది. ''తాను సురక్షితంగానే ఉన్నానని.. నేను చేసిన ఆరోపణలు నిజం కావని.. త్వరలోనే బయటికి వస్తానని'' పేర్కొంది. ఇంకో మెట్టు ఎక్కి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ థామస్ బాచ్తో పెంగ్ మాట్లాడిదంటూ చైనా ప్రభుత్వం అక్కడి చానెళ్లలో పలు వీడియోలు ప్రసారం చేసింది. అయితే ఈ తతంగం అంతా డబ్ల్యూటీఏకు అనుమానాల్ని కలిగించింది. చైనా ప్రభుత్వం పంపించిన ఈమెయిల్, వీడియోకాల్పై అనుమానం వ్యక్తం చేసిన స్టీవ్ సిమన్ పెంగ్.. ఆచూకీపై స్పష్టమైన ఇవ్వాలని చైనాను కోరాడు. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ దేశంలో నిర్వహించాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement