-
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
మెరిశారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. గత ఏడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను మరో మెట్టు పెకైక్కించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను మూడో స్థానంలో నిలిపారు. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 88,691 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 64,958 మంది పాసై 73.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో పెరుగుదల.. ఇంటర్ సెకండియర్లో గత ఏడాది కంటే ఈసారి ఫలితాల శాతం కాస్త పెరిగింది. గత ఏడాది 72.62శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 73.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో 0.61శాతం పెరుగుదల నమోదైంది. ఈ దఫా కూడా బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. 47,984 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 33,588 మంది ఉత్తీర్ణులై 70 శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా 40,707 మంది బాలికలు పరీక్షలు రాయగా 31,370 మంది పాసై 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 7 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకులో ముందుకు.. ఫలితాల్లో పెరుగుదలతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులోనూ జిల్లా స్థానం మెరుగుపడింది. గత రెండేళ్లుగా నాలుగో స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈసారి మూడోస్థానానికి చేరింది. ఈ ఏడాది వొకేషనల్ కేటగిరీలోనూ ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 2687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 1567 మంది పాసై 58 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల నుంచి 2741 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 1542 మంది ఉత్తీర్ణులై 56శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీల్లో 60శాతం ఫలితాలు వచ్చాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement