-
హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం!
హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. సీఎం యోగి పలు సందర్భాల్లో శివుణ్ణి పూజిస్తుంటారు. తరచుగా కాశీకి వెళ్లి విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తుంటారు. సీఎం యోగి తాజాగా చేసిన ఒక పోస్ట్లో గడచిన ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో విజయం సాధించామన్నారు. ఈ 7 సంవత్సరాలు ‘న్యూ ఉత్తర ప్రదేశ్ ఆఫ్ న్యూ ఇండియా’ను సృష్టించేందుకు కృషి చేశామన్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur pic.twitter.com/RA4r1oJDHG — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2024 ప్రజా సంక్షేమ బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సహకారం లభిస్తున్నదని, అందుకు వారికి కృతజ్ఞతలు. హ్యాపీ హోలీ’ అని పేర్కొన్నారు. आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणादायी मार्गदर्शन में उत्तर प्रदेश की 25 करोड़ जनता की सेवा, सुरक्षा और समृद्धि के संकल्प को आज 07 वर्ष पूरे हो रहे हैं। इन 07 वर्षों में सबका साथ-सबका विकास के मंत्र के माध्यम से हर व्यक्ति के जीवन में सकारात्मक परिवर्तन लाने… — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 25, 2024 -
దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?
దీపావళిని కేవలం హిందువులు మాత్రమే కాదు వివిధ రకాల మతస్తులు కూడా జరుపుకుంటారు. అందులో కూడా చాలా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇక దీపాలు వెలిగించి బాణాసంచాలు కాలుస్తూ దేశవిదేశాల్లో ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఏయే మతస్తులు ఏవిధంగా జరుపుకుంటారో చూద్దాం!. ఈ పండగను హిందువులతో పాటుగా బౌద్ధులు, జైనులు,సిక్కులు కూడా వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి పాటిస్తారు! కొందరు ఈ పండుగ నుంచి కొత్త సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తారు! ఈ పండగని ఉత్తర భారత దేశంలో ఐదు రోజుల పండుగగా చేస్తారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా వ్యవహరిస్తూ ..ఆ రోజు లక్ష్మీ పూజ చేసే అలవాటు కూడా ఉంది. మనం మూడు రోజుల పండుగగా దీన్ని జరుపుకుంటాం !నరక చతుర్దశి,దీపావళి అమావాస్య,బలి పాడ్యమి అని ఆ మూడు రోజులను వ్యవహరిస్తారు!మొదటి రెండు రోజులు ఆశ్వయుజ మాసంలో చివరన వస్తాయి.మూడవది అయిన బలి పాడ్యమి మాత్రం కార్తీకమాసం మొదటి రోజున జరుపుకుంటారు!నరక చతుర్దశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి,నరకుని సంహరించి ,అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు!సత్యభామ సమేతుడై శ్రీ కృష్ణుడు నరక సంహారం కోసం సమాయత్తమయ్యాడు!ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది!ఆ పౌరాణిక గాధ మీకందరికీ తెలిసిందే! ఈ కధ బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ,ఈ పండుగకు ,దీనికీ సంబంధించిన సరైన నిర్ధారణ ఏ వ్రత గ్రంధాలలోనూ లేదు! నిజానికి దీని అర్ధం 'నరకం'నుండి విముక్తి పొందాలని!అయితే ,దానికి నరకాసురిడి పేరుని అన్వయించి నరక చతుర్దశిగా పండుగను చేసుకుంటున్నారు!ఈ పండుగను దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు! కొత్త బట్టలు ధరించి,మిఠాయిలు పంచి, దీపాలతో గృహాలను అలంకరించి--ఎంతో దేదీప్యమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. వ్యాపారులు ,లక్ష్మీపూజ చేసి వ్యాపార స్థలాలను కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తవారింటికి రావటం కూడా ఆనవాయతీ ఉంది! ఈ పండుగకు దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తారు!. ఈ దీపాలు వెలిగించటం వెనక ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం కూడా లేకపోలేదు!. దుర్గా దీపావళి..! మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని బయటికి త్రోలి,జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని దీని ఉద్దేశ్యం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం. శ్రీరామచంద్రుడు 14 ఏండ్ల అరణ్యవాసం తర్వాత ఈ రోజున మళ్ళీ అయోధ్యలో కాలు పెట్టాడు. విజయదశమి రోజున రావణ సంహారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు దీపావళి పండుగతో పాటుగా కాళీపూజను కూడా జరుపుకుంటారు. వారు ఈ పండుగను దుర్గా దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ దీపావళి పండుగ రోజుల్లోనే అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించటం చేత బౌద్ధులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జైన మత స్థాపకుడైన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు కూడా ఈ దీపావళి పండుగ రోజుల్లోనే రావటం వల్ల, జైనులు కూడా ఆయనకు స్మ్రుతి చిహ్నంగా దీపాలను వెలిగించి ఈ పండుగను చేసుకుంటారు! సిక్కుల తొమ్మిదవ గురువైన గురు హర్ గోవింద్ ఈ రోజునే గ్వాలియర్ చెరసాల నుంచి విడుదలయిన రోజు కావటం చేత, సిక్కు మతస్తులు కూడా దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు. దీపాలను వెలిగించటం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికతను కూడా సంతరించుకుంది. దురదృష్టం ఏమిటంటే,కొందరికి మాత్రమే ఇది దీపావళి,చాలామంది పేదలకు ఇది అమావాస్య !అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అసలు దీపావళి త్వరలోనే రావాలని భగవంతుని వేడుకుందాం! --కూర్పరి - శారదాప్రసాద్ (చదవండి: దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!) -
హ్యాపీ బర్త్డే ఇషా : ‘సంగీత్’ పై ఆసక్తికర వార్త
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీ వివాహం వేడుక అంశం మరోసారి వార్తల్లో కిచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు)మూడుముళ్ల సంబరానికి ముందస్తు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేట్ కుటుంబాలు ప్లాన్ చేశాయి. పెళ్లిలో ప్రధాన ఘట్టమైన సంగీత్ ను స్పెషల్ ఎట్రాక్షన్తో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయనున్నాయని మీడియాలో పలు అంచనాలు గుప్పుమన్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ ప్రదర్శన ఇవ్వనున్నారట. అంతేకాదు ఇందుకు ఆమె భారీగా పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రీ రాయల్ వెడ్డింగ్ బాష్ను ఉదయపూర్లో ప్లాన్ చేశారట. ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ఈ సంగీత్ కార్యక్రమంలో తన ప్రదర్శనతో హల్ చల్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది. కాగా డిసెంబర్10న ముంబైలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారట. ఈ లవ్బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 23 ఇషా అంబానీ 27వ పుట్టిన రోజు. -
బీబర్ వేదికపై నా ప్రదర్శన లేదు: నటి
ముంబయి: త్వరలో ముంబయిలో జరగనున్న హాలీవుడ్ పాప్ యువ కెరటం జస్టిన్ బీబర్ నిర్వహించే సంగీత కార్యక్రమ వేదికపై తాను ఉండటం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పష్టం చేసింది. వచ్చే మే నెలలో ముంబయిలో బీబర్ పాప్ గీతాలతో ఉర్రూతలూరించనున్నాడు. ఈ కార్యక్రమంలో సోనాక్షి కూడా పాలుపంచుకోబోతుందంటూ బాలీవుడ్లో కోడై కూస్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్నా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘ముందుగా మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బీబర్ కచేరిలో నా ప్రదర్శన లేదు. ఇప్పటికే నేను ఈ విషయం పలు విధాలుగా చెప్పాను. మీడియా ద్వారా కూడా చెప్పాను. నేను పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అదంతా కూడా ఊహగానామే’ అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. తనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని, ప్రదర్శన ఇవ్వడాన్ని ఇష్టపడతానని, పాడేందుకు కూడా ఆసక్తి ఉంటుందని చెప్పారు. -
నదుల ప్రక్షాళన చేపట్టాలి
హనుమాన్ పీఠాధిపతి రాములు స్వామి ఏటూరునాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదుల ప్రక్షాళన చేపట్టాలని హనుమాన్ పీఠాధిపతి గాదెపాక రాములు స్వామి అన్నారు. తెలంగాణలోని గోదావరి పుష్కరఘాట్ల సందర్శనలో భాగంగా మంగళవారం మండలంలోని రామన్నగూడెం ఘాట్ వద్ద గోదావరి నదికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల్లో మలినాలను తొలగించి, మానవ మనగడకు ఆరోగ్య ప్రదాతలుగా బాధ్యత వహించాలన్నారు. చాలా మంది ఘాట్ల వద్ద మలినాలను వదిలేయడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. నదుల పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించి 1465 కిలోమీటర్ల ప్రయాణంతో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, పర్ణశాల, భద్రాచలం, రాజమండ్రి, ధవళేశ్వరంలో ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తోందన్నారు. పర్ణశాల, భద్రాచలం, రామన్నగూడెం ఘాట్లను, బుధవారం నుంచి కాళ్లేశ్వరం, ధర్మపురి, బాసరను సందర్శిస్తానని వెల్లడించారు. దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన తాను పవిత్ర నదులను శుద్ధి చేసి అపవిత్రం కాకుండా ఉండేందుకు ఈనెల 20 నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో మౌనదీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement