-
మిస్టరీ విప్పిన పెట్రోల్ క్యాన్
అనంతపురం, పామిడి: ‘ఎంత తెలివిగా హత్య చేసినా హంతకులు ఏదోక క్లూ వదిలేపోతారు’, ‘తీగ లాగితే డొంక కదులుతుంది’ మిస్టరీగా మారిన కేసులను ఛేదించే పోలీసులు వీటిని దృష్టిలో ఉంచుకునే దర్యాప్తు ప్రారంభిస్తారు. పెద్దవడుగూరు మండలం వీరెపల్లి శివార్లలో గత నెల 21న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు కూడా ఈ విధంగానే ఛేదించబడింది. హంతకులు తాము ఉపయోగించిన పెట్రోల్ క్యాన్ను వదిలేసిపోవడం, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కేసును ఛేదించడం నెల తిరక్కముందే జరిగిపోయాయి. మృతుడు కర్నూలు జిల్లా ఆదోనిలోని రాజీవ్ కాలనీకి చెందిన బోయ ప్రదీప్(18) అని గుర్తించారు. నిందితులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్స్టేషన్లో ఏఎస్పీ చౌడేశ్వరి వెల్లడించారు. బోయ ప్రదీప్ తల్లి రోజా పదేళ్ల క్రితం భర్త పరంజ్యోతితో విడిపోయింది. డోన్ పట్టణానికి చెందిన నాగమద్దిలేటిని 2010 సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు విజయ్(12), ప్రదీప్(9). ఈ పెళ్లతో తలెత్తిన గొడవల కారణంగా నాగమద్దిలేటి, రోజా విజయ్ను, ప్రదీప్ను తీసుకుని ఆదోనికి వచ్చి కాపురం పెట్టారు. చిన్న కుమారుడు ప్రదీప్ 10 వతరగతి వరకూ చదివి జల్సాలకు, తాగుడుకు బానిసయ్యాడు. బుల్లెట్ బైకు కావాలంటూ తల్లి రోజాతో నిత్యం గొడవ పడేవాడు. నువ్వంటే అసహ్యమంటూ ఈసడించుకునేవాడు. దీనికితోడు వరుసకు అత్తయిన నాగమద్దిలేటి సొంత చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని గత నెల 19న ఇంటికి వెళ్లాడు. నాగమద్దిలేటికి ఆయన చిన్న చెల్లెలు ఈ విషయాన్ని తెలిపింది. అప్పటికే నాగమద్దిలేటి తన స్నేహితుడు గౌస్ఖాన్ ఇంట్లో మరో స్నేహితుడు సంపత్కుమార్తో కలిసి మద్యం సేవిస్తున్నాడు. స్నేహితులు ముగ్గురూ కలిసి ఎలాగైనా ప్రదీప్ను అంతమొందించాలనుకున్నారు. ప్రదీప్ను కొట్టి బలవంతంగా వారి బైకులో డోన్వైపు తీసుకెళ్లారు. డోన్కు కొద్దిదూరంలో గుత్తిరోడ్డు వైపు కంపచెట్లలోకి తీసుకెళ్లి రెండు చేతులూ వెనక్కు కట్టేసి బెల్టుతో గొంతు బిగించి చంపేశారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా వైపు తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి ఆనవాలు లేకుండా చేయాలనుకున్నారు. ఇంటి సామాన్లు మార్చాలని చెప్పి కర్నూలుకు చెందిన మధు బొలెరో వాహనాన్ని అద్దెకు పిలిపించుకున్నారు. సామాన్లు లోడ్ చేసేసరికి కాసేపు నిద్రపో అని డ్రైవర్గా వచ్చిన వెంకటేష్కు చెప్పారు. అతను నిద్రపోగానే వారు ఆ వాహనాన్ని తీసుకుని వెళ్లారు. డోన్ వెలుపల తారకరామనగర్లోని రాజు పెట్రోలు బంకుకు వద్దకెళ్లి రూ.800లకు పెట్రోలును క్యాన్లో తీసుకుని, ప్రదీప్ మృతదేహాన్ని తీసుకుని వీరెపల్లికి తెచ్చారు. ఆ గ్రామ సమీపంలో ప్రదీప్ మృతదేహంపై పెట్రోలు పోసి అంటించారు. అయితే పెట్రోల్ క్యాన్ అక్కడే వదిలేశారు. తిరుగు ప్రయాణంలో గుత్తి బాటలో సుంకులమ్మ గుడికి వెళ్లారు. వాళ్లు వదిలేసిన పెట్రోలు క్యాన్ ఆధారంగా ఏఎస్పీ చౌడశ్వరి ఆధ్వర్యంలో, పామిడి రూరల్ సీఐ రాము సారథ్యంలో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారు పెట్రోలు బంకు, సుంకులమ్మ గుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. రెండుచోట్లా కనిపించింది వారే కావడంతో బొలెరో వాహనం నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో రోజా సైతం మృతి చెందింది తన కుమారుడు ప్రదీపేనని గుర్తించిం ది. ఈ నేపథ్యంలో నిందితులు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు. రివార్డుకు సిఫారసు చేశాం : ఏఎస్పీ ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిస్టరీగా మారిన కేసును అనతికాలంలో ఛేదించడంలో సీఐ రాముతోపాటు ఎస్ఐ రమేష్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మాణిక్యం, రాజ్కుమార్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, చంద్ర, రవి, శ్రీనాథ్, వివేక్ చేసిన కృషిని ఆమె అభినందించారు. వారికి రివార్డు కోసం ప్రతిపాదించామన్నారు. -
అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి
అనంతపురం, న్యూస్లైన్ : మండుతున్న పొయ్యిపై పెట్రోలు క్యాన్ పడడంతో ఇంటికి నిప్పంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం పాతూరులోని రాణినగర్లో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే బ్రహ్మయ్య, గంగమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి, సరస్వతి. వీరిలో ఇద్దరు తమ పిల్లలతో పుట్టింట్లో ఉన్నారు. బ్రహ్మయ్య దంపతులు కూలి పనులకు వెళ్తుండగా, మిగతా కుటుంబ సభ్యులు లూజుగా పెట్రోలు విక్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటూ అరుగుపై ఉన్న పెట్రోలు క్యాన్ను కిందకు నెట్టేశారు. అది మండుతున్న పొయ్యిపై పడడంతో క్షణాల్లో అగ్ని కీలలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముత్యాలమ్మ, ఆమె కూతురు జ్యోతి (8), శ్యామ (5), 11 నెలల మగ శిశువు, వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు నందకిషోర్ (1) తీవ్రంగా గాయపడగా, సరస్వతికి స్వల్ప గాయాలయ్యాయి. 11 నెలల చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో జ్యోతి, శ్యామ, నందకిషోర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ క్షతగాత్రులను పరామర్శించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement