-
కార్పొరేట్ ఇండియా చూపంతా వారిపైనే
ముంబై : వాన్నాక్రై, పెట్యా వంటి సైబర్ దాడులు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. ఈ దాడులతో ఆర్థిక వ్యవస్థలు స్తంభిస్తున్నాయి. తమ ఐటీ సిస్టమ్లను కొల్లగడుతున్న సైబర్ దాడుల నుంచి బయటపడేందుకు కార్పొరేట్ ఇండియా దృష్టి అంతా ఇప్పుడు సైబర్ సెక్యురిటీ నిపుణులపై పడింది. ఈ దాడులను అరికట్టడానికి కంపెనీలు భారీగా సైబర్ నిపుణులను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో సైబర్ సెక్యురిటీపై స్పెషలైజేషన్ చేసిన గ్రాడ్యుయేట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సైబర్ సెక్యురిటీ నిపుణులకు ఏర్పడుతున్న డిమాండ్తో యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు సైతం దీనికి సంబంధించిన ప్రొగ్రామ్లను తమ క్యాంపస్లలో ప్రవేశపెడుతున్నాయి. గాంధీనగర్లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సస్ యూనివర్సిటీ ఆఫర్ చేసే సైబర్ సెక్యురిటీ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఎంఎస్సీ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అస్యూరెన్స్ కోర్సులు చేసిన గ్రాడ్యుయేట్లకు మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్టు తెలిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ, యాక్సిస్ బ్యాంకు, అడోబ్ వంటి కంపెనీలు ఈ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు ఆ యూనివర్సిటీ చెప్పింది. గతేడాది కంటే కూడా ఈ ఏడాది ఆఫర్లు పెరిగాయని తెలిపింది. ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ రూపంలో కంప్యూటర్లపై స్తంభింపజేస్తున్న సైబర్ మాయగాళ్లు, డబ్బులు చెల్లిస్తేనే కంప్యూటర్లను విడిచిపెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కార్యకలాపాలన్నీ అస్తవ్యస్థంగా మారుతున్నాయి. వాన్నాక్రై దాడి జరిగిన వారంలోనే పెట్యా రూపంలో మరో ఎటాక్ జరగడం ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం సైబర్ ఎటాక్స్ మామూలు అయిపోయాయని, సంప్రదాయ నెట్వర్క్ స్పెషలిస్టుల కంటే ఎక్కువ మొత్తంలో నిపుణులు భారత్కు కావాల్సి ఉందని అనాలిస్టులు చెబుతున్నారు. అడ్వాన్స్డ్ అనాలిస్టులు, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనాలిస్టులు, పోస్టు-బ్రీచ్ నిపుణులు అవసరం ఎక్కువగా ఉందంటున్నారు. సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్ వేతనాలు కూడా సాధారణ టెక్ ఉద్యోగస్తుల వేతనాల కంటే కూడా అత్యధికంగా ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంకు మానవ వనరుల అధినేత రాజ్కమల్ వేంపతి చెప్పారు. క్యాంపస్ రిక్రూట్స్లోనే తాము వారికి సుమారు 7 లక్షల వరకు చెల్లిస్తున్నామన్నారు. -
‘పెట్యా’ దాడిలో భారత్కు ఏడో స్థానం
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రాన్సమ్వేర్ ‘పెట్యా’ ప్రభావానికి అధికంగా లోనైంది భారతే అని భద్రతా సాఫ్ట్వేర్ సంస్థ సిమాంటెక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల అధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉందని పేర్కొంది. ఉక్రెయిన్, రష్యాల్లో పెట్యా ప్రభావం అత్యధికంగా ఉందని వెల్లడించింది. పెట్యా దాడికి గురైన జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు(జేఎన్పీటీ)లో ఐటీ మౌలిక వసతుల భద్రతను పెంచడానికి, రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement