-
‘పీజీ ఈసెట్’లో మహిళలదే పైచేయి
* మహిళల ఉత్తీర్ణత 92.27%, పురుషుల ఉత్తీర్ణత 89.19% * పీజీ ఈసెట్ సీట్ల సంఖ్య పెంచుతాం: మంత్రి జగదీశ్వర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ ఈసెట్-2014 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు 92.27 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. పురుష అభ్యర్థులు 89.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. పీజీ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ విద్యా శాఖ మంత్రి జి. జగదీశ్వర్రెడ్డి, సీమాంధ్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు స్థానిక ఉస్మానియా దూరవిద్యా కేంద్రంలో సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం 1,08,112 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వీరిలో 97,640 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా ఖాళీగా ఉన్న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఠీఠీఠీ. ్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ, ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పీజీ ఈసెట్కు డిమాండ్ పెరిగిందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి చెప్పారు. పీజీ-ఈసెట్ సీట్లను పెంచి లోటు భర్తీ చేస్తామని అన్నారు. సీమాంధ్రలో విద్యాప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు, ఉన్నత విద్యలో తమ ప్రాంతాన్ని ఓ రోల్ మోడల్గా మారుస్తానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రతాప్రెడ్డి, పీజీ ఈసెట్ కన్వీనర్ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 14 నుంచి కౌన్సెలింగ్: రెండు రాష్ట్రాలకు కలిపి జూలై 14 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ను నిర్వహించనున్నారు. ఆన్లైన్ వెబ్కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. గేట్, జీప్యాట్ అర్హతగల అభ్యర్థులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రాష్ట్రాలు విడిపోయినా కౌన్సెలింగ్లో గత ఏడాది నిబంధనలనే పాటించనున్నట్టు పేర్కొన్నారు. -
నేటి నుంచి పీజీ-ఈసెట్ హాల్టికెట్లు
హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న పీజీ ఈసెట్-2014 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి సోమవారం తెలిపారు. హాల్టికెట్లను ఠీఠీఠీ.్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 1.17 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement