-
పీజీ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈ సెట్–2023 షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్ ఈ పరీక్షను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో పరీక్ష కోసం ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.600)తో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం https:// pgecet.tsche.ac.in వెబ్సైట్కు లాగిన్ అవ్వాలని ఆయన సూచించారు. -
పీజీఈసెట్ కౌన్సెలింగ్ 19 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ కౌన్సెలింగ్ ఈనెల19 నుంచి ప్రారంభం కానున్నది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన పీజీఈసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా అడ్మిషన్ల షెడ్యూల్పై చర్చించారు. ఈ నెల 30లోగా ఆన్లైన్ వెరిఫికేషన్కోసం సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్బాబు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. -
పీజీఈసెట్లో 91.48% ఉత్తీర్ణత
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్ 2022)లో 91.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 2 నుంచి 5 వరకు జరిగిన ఈ పరీక్షలకు 12,592 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,520 మంది అర్హత సాధించారు. అందులో 6,440 మంది అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డి.రవీందర్, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 115 కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పీజీఈసెట్లో అమ్మాయిల ఉత్తీర్ణత 93 శాతంగా నమోదు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 89.62 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఫార్మసీలో అధికం పీజీఈసెట్కు హాజరైన వారిలో ఫార్మసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 12,592 మంది హాజరుకాగా, అందులో 5,452మంది కేవలం ఫార్మసీ విద్యార్థులే ఉన్నారు. వారిలో 5,186 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్కు సంబంధించి 2,027మంది పరీక్షకు హాజరుకాగా, 1,782 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1,279 మంది హాజరుకాగా,1,211 మంది ఉత్తీర్ణత సాధించారు. -
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
నవంబర్ 1 నుంచి ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మహత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద నవంబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణకు తుది గడువుగా నిర్దేశించగా.. దరఖాస్తులను ఈపాస్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. (చదవండి: వచ్చే నెలలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్) పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు టీఎస్ పీజీఈసెట్ కౌన్సెలింగ్లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 25 వరకు పెంచినట్లు సెట్ కన్వీనర్ పి.రమేశ్బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్లో 17,628 అర్హత సాధించారు. వీరిలో ఇప్పటివరకు 7,500 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెబ్ఆప్షన్స్ ఈ నెల 29 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపారు. నవంబర్ 3వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని, 4 నుంచి 12వ తేదీ వరకూ అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 15 నుంచి క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నారు. ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు నోటిఫికేషన్ డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2009 జూలై2 నుంచి 2011 జనవరి 1 మధ్య జన్మించిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. దరఖాస్తులను నవంబర్15లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 18న హైదరాబాద్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్ తెలిపారు. (చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. పెళ్లి పేరుతో!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement