-
పీహెచ్డీ ఉంటేనే అసిస్టెంటు ప్రొఫెసర్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగంలో ప్రమాణాల పెంపులో భాగంగా యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హతగా పీహెచ్డీని తప్పనిసరి చేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని నిబంధనలపై కేంద్రం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దృష్టి సారిస్తున్నాయి. కనీస అర్హతగా పీహెచ్డీ ఉండేలా 2018లోనే యూజీసీ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడంలో ఆలస్యమవుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు పలువురు కోవిడ్ వల్ల తమ కోర్సులు పూర్తికానందున కొంత సమయం కావాలని విన్నవించారు. దీంతో పీహెచ్డీ కనీస అర్హత నిబంధనను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇకపై అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హత పీహెచ్డీని తప్పనిసరిగా అమలు చేయనున్నారని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వివరించాయి. సెంట్రల్ వర్సిటీల్లో 10 వేల వరకు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రాల్లోని పలు వర్సిటీల్లోనూ వేలాదిగా ఖాళీలున్నాయని తెలిపాయి. వీటన్నిటి భర్తీలో కనీస అర్హత పీహెచ్డీ ఉన్న వారినే అనుమతించనున్నారని పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ప్రకటించారు. -
ప్యూన్ ఉద్యోగానికి.. 3700 పీహెచ్డీ అభ్యర్థుల పోటీ
లక్నో : ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య కేవలం 62 కానీ.. వాటికి వచ్చిన అప్లికేషన్లు ఏకంగా 93,500. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తాండవిస్తోందో ఈ ఘటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. టెలికాం డిపార్ట్మెంట్లో ఖాళీ అయిన 62 ప్యూన్ పోస్టులకు అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉండడంతో ఏకంగా పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ప్యూన్ పోస్టుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. 93,500 అప్లికేషన్లు రాగా వాటిలో పీహెచ్డీ పూర్తి చేసిన వారు 3,700, పీజీ పూర్తి చేసిన వారు 50,000, డిగ్రీ ఇతర కోర్సులు పూర్తి చేసిన వారు 28,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు టెలికాం డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగంపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, నిరుద్యోగులపై సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎస్పీ నేత అబ్దుల్ హాఫీజ్ గాంధీ విమర్శించారు. -
పీహెచ్డీకి పైసా ఇవ్వం!
- ఓయూ పీహెచ్డీలో ప్రవేశానికి సరికొత్త ఆంక్షలు - ఫెలోషిప్, ఆర్థిక చేయూత, ఉపకారవేతనాలు ఆశించొద్దని స్పష్టీకరణ - ఈమేరకు విద్యార్థుల నుంచి లిఖితపూర్వక లేఖ తీసుకుంటున్న ఓయూ - సౌకర్యాలు లేకుండా కోర్సు చేసేదెలాగంటున్న అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో పరిశోధనకు కఠినని‘బంధనాలు’ విధించారు. ఆసక్తి ఉంటే అప్పులు చేసి పరిశోధన చేయాలంటోంది ఉస్మానియా యూనివర్సిటీ. ఆర్థిక చేయూతకు విముఖత చూపుతోంది. ప్రస్తుతం ఉస్మానియా యూని వర్సిటీలో 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ కోర్సుకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుం టున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవగాహన కార్యక్రమాలు, శిక్షణ అనంతరం ఆయా అభ్యర్థులు పరిశోధన మొదలుపె డతారు. పరిశోధన సమయంలో అభ్యర్థులు ఎంచుకున్న రంగంలో పూర్తిస్థాయిలో అధ్యయ నం చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆర్ట్స్ విభాగానికి చెందిన అభ్యర్థికి సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుండగా, సైన్స్ కేటగిరీకి చెందిన అభ్యర్థికి కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చులవుతాయి. పరిశోధనల ప్రక్రియతో వర్సిటీ పరపతి సైతం పెరుగుతుంది. కానీ, ఓయూ సెట్ ద్వారా పీహెచ్డీ కోర్సుకు ఎంపికైన విద్యార్థులపై సరికొత్త ఆంక్షలు విధిస్తూ వారిని తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. అభ్యర్థుల నుంచి లేఖలు.. పీహెచ్డీ కోర్సు ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న అభ్యర్థులపై పలు ఆంక్షలు విధించిన ఓయూ యంత్రాంగం తాజాగా ఆయా అభ్యర్థుల నుంచి అండర్టేకింగ్ లేఖలను తీసుకుంటోంది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫెలోషిప్లు, ఉపకారవేతనాలు, ఆర్థిక చేయూత అడగొద్దని నిబంధనలు పెట్టింది. పరిశోధన పూర్తిగా వ్యక్తిగత ఖర్చులతోనే చేపట్టాలని స్పష్టం చేసిన అధికారులు ప్రయాణ, ఇతరత్రా ఖర్చులు సైతం ఆశించొద్దని తేల్చి చెప్పింది. వర్సిటీలో కనీసం హాస్టల్ సౌకర్యం కూడా ఇవ్వబోమని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల నుంచి ఈమేరకు అండర్టేకింగ్ పత్రాలను తీసుకుంది. లేఖలో పేర్కొన్న నిబంధనలకు లోబడే కోర్సు చేయాలని అధికారులు సూచించారు. ప్రమాదంలో ‘పరిశోధన’ పీహెచ్డీ అభ్యర్థులకు ఉస్మానియా వర్సిటీ ఆర్థిక చేయూత లేకుంటే పరిశో« దన ప్రమాదంలో పడనుంది. పీహెచ్డీ కోర్సులో సరికొత్త ఆవిష్కరణలు చేస్తే అభ్యర్థితోపాటు వర్సిటీకి సైతం కీర్తి వస్తుంది. ఆర్ట్స్ విభాగానికి సంబంధించి ఎంపిక చేసుకున్న రంగంలో పరిశోధనకు తగు పుస్తకాలు కొనుగోలు చేయాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సంబంధిత వ్యక్తులతో చర్చించాలి. వాటి ఆధారంగా ప్రాజెక్టు రిపోర్టు రూపొందించాలి. సైన్స్ అభ్యర్థులైతే రసాయనాలు కొనుగోలు చేసి పరిశోధనలు సాగించాలి. దాదాపు ప్రతి విద్యార్థి ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు చేయాలి. వర్సిటీ సహకారం అందకుంటే ఈ పరిశోధనలు కుంటుపడే ప్రమాదముంది. నాణ్యత లోపించడంతోపాటు కొత్త ఆవిష్కర ణలకు అవకాశం లేకుండాపోతుంది.పేద విద్యార్థులను తాజా నిబంధనలు నిరాశకు గురి చేస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement