-
దివ్యాంగులకు బంగారు భవిత
కైకలూరు (ఏలూరు జిల్లా): దివ్యాంగుల జీవితాల్లో భవిత కేంద్రాలు చిరుదివ్వెలు వెలిగిస్తున్నాయి. విధి వంచించిన విభిన్న ప్రతిభావంతుల్లో మార్పు తీసుకువస్తున్నాయి. కేంద్రాల్లోని ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు(ఐఈఆర్టీ) తల్లిదండ్రులకంటే మిన్నగా చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అడుగుతీసి అడుగువేయలేని స్థితిలో చేరిన దివ్యాంగులకు నడక నేర్పి విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ప్రత్యేకావసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఆధునిక పరికరాలు అందిస్తోంది. దీంతో తమ బిడ్డల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 744 మంది చిన్నారులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 49 భవిత కేంద్రాల్లో 744 మంది దివ్యాంగులు సేవలు అందుకుంటున్నారు. 68 మంది ఐఈఆర్టీలు వీరి ఆలనాపాలనా చూస్తున్నారు. వీరితో పాటు మరో 40 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. బుద్ధిమాంధ్యం, మాట్లాడటంలో లోపం, పాక్షిక, పూర్తి అంధత్వం, వినికిడి, అభ్యాసనా లోపాలు, స్థిరత్వం లేమితో బాధపడుతున్న పదహారేళ్లలోపు విద్యార్థులకు భవిత కేంద్రాలు విశేష సేవలు అందిస్తున్నాయి. వైద్య నిర్ధారణ శిబిరాలు ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం వైద్య నిర్ధారణ శిబిరాలు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, కై కలూరులో పూర్తికాగా నూజివీడులో నిర్వహించాల్సి ఉంది. మొత్తం 240 మంది దివ్యాంగులను శిబిరాల ద్వారా గుర్తించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో జరగ్గా, 7న తణుకు, 10న పాలకొల్లులో ఉచిత శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో గుర్తించిన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అలింకో కంపెనీ నుంచి హియిరింగ్ ఎయిడ్స్, కాలిపర్స్, వీల్చైర్స్, రోలెటర్స్, హ్యాండ్ స్టిక్స్, సీపీ చైర్ వంటి పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సేవలకు వందనం భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల గల చిన్నారులకు ఐఈఆర్టీలు, ఆయాలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ప్రతి వారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. దృష్టిలోపం కలిగిన వారికి బ్రెయిలీ లిపిలో బోధిస్తున్నారు. చెవిటి, మూగ వంటి సమస్యలు ఉన్నవారికి స్పీచ్ థెరపీ అందిస్తున్నారు. నడక సరిగా రాని పిల్లల కోసం స్టెప్బర్, వాకింగ్బార్లు అందు బాటులో ఉన్నాయి. మనోవికాసం వృద్ధి చెందేలా గణిత భావనలు గుర్తుండేలా పూసల చట్రాలు, ఆట వస్తువులు ఉన్నాయి. బుద్ధిమాంధ్యం కలిగిన వారికి ఎంఆర్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. స్పీచ్ థెరపీతో మాటలు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు హకీమా. పుట్టుకతో మూగ, వినికిడి లోపం. 12 ఏళ్ల హకీమా ఆరేళ్ల క్రితం కైకలూరు భవిత కేంద్రంలో చేరింది. స్పీచ్ థెరపీలో చిన్నారికి ఐఈఆర్టీ జి.వెంకటలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా హకీమాను రోజూ కేంద్రానికి తీసుకొస్తున్నారు. దీంతో బాలిక అక్షరాలను అర్థం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉర్దూ పాఠశాలలో చదువుకుంటోంది. త్వరలో శస్త్రచికిత్సలు ప్రభుత్వం ప్రత్యేకావసరాల చిన్నారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. సహాయకులకు అలవెన్సు లు, రవాణా ఖర్చులు అంది స్తున్నాం. బుద్ధిమాంద్యం కలిగిన వారికి ఉచితంగా ఇచ్చే సీపీ చైర్ విలువ రూ.35 వేలు ఉంటుంది. నాడు–నేడు పథకంలో ప్రభుత్వం భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతోంది. గ్రహణంమొర్రి, గ్రహణశూల, కండరాలలోపంతో బాధపడే వారికి త్వరలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. – బి.భాస్కరరాజు, ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు భవిత కేంద్రాల వివరాలు ఏలూరు ‘పశ్చిమ’ కేంద్రాలు 29 20 చిన్నారులు 484 280 ఐఈఆర్టీలు 38 27 ఫిజియో- థెరపిస్టులు 9 7 ఆయాలు 20 20 -
తేలని ‘భవిత’వ్యం!
– నిలిచిపోయిన ఫిజియో థెరపీ క్యాంపులు – రెన్యూవల్కు నోచుకోని ఫిజియోథెరపిస్టులు – సేవల కోసం ‘ప్రత్యేక’ పిల్లల ఎదురుచూపు ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా నడుస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనం. విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెళ్లవుతున్నా...ఫిజియో థెరపిస్టులను తీసుకోలేదు. దీంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఫిజియో థెరపీ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు బుద్ధిమాంద్యత (ఎంఆర్), దష్టి లోపం (బ్లైండ్), వినికిడి (హెచ్ఐ), సీపీ (సెరబ్రల్పాల్సీ) గల పిల్లలు అధికారిక లెక్కల ప్రకారం 6080 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ఐఈఆర్సీ (ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్), 43 మండలాల్లో నాన్–ఐఈఆర్సీలు ఉన్నాయి. ఈ పిల్లల కోసం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) 115 మంది పని చేస్తున్నారు. తీవ్రతను బట్టి కొందిరి పిల్లలకు హోం బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. రెన్యూవల్కు నోచని ఫిజియో థెరపిస్టులు ప్రతి సోమవారం ఐఈఆర్సీ కేంద్రాలు, బుధ, శుక్రవారాల్లో నాన్–ఐఈఆర్సీ కేంద్రాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. ఫిజియో థెరపిస్టులు వచ్చి పక్షవాతం, కాళ్లు, చేతులు సరిగా పని చేయకపోవడం, కండరాలు, ఎముకలు పట్టేసి నడవడానికి, పనులు చేసుకోవడానికి వీలుకాక ఇబ్బందులు పడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తారు. గతేడాది 26 మంది ఫిజియో థెరపిస్టులు జిల్లాలో పని చేశారు. ఈ సంవత్సరంలో మూడు మండలాలకు ఒక్కరి చొప్పున 21 మందిని తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ రెన్యూవల్ ప్రక్రియ జరగలేదు. ఆయాలదీ అదే పరిస్థితి మరోవైపు కేర్ గివర్ వలంటీర్ల (ఆయా)ను తీసుకోలేదు. వీరు లేకపోవడంతో భవిత కేంద్రాలకు తమ పిల్లలను పంపేందుకు కూడా తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. కేంద్రంలో ఉన్న సమయంలో ముఖ్యంగా బుద్ధిమాంద్య పిల్లలకు వ్యక్తిగత అవసరాలు వస్తే వాటిని తీర్చుకునేందుకు తోడు కచ్చితంగా అవసరం. ఫిజియెథెరపీ క్యాంపులు పెట్టడం లేదు కూడేరులోని భవిత కేంద్రంలో మూన్నెళ్లుగా ఫిజియో థెరపీ క్యాంపు నిర్వహించడం లేదు. నా మనవుడు సందీప్కు నరాల బలహీనతతో కాళ్లు సచ్చు(సెరబ్రల్) బడ్డాయి. ఫిజియోథెరఫి చేస్తే నరాలు బలపడతాయని వైద్యులు చెప్పారు. గతేడాదిలో భవిత కేంద్రంలో రెగ్యులర్గా చేయించాం. ప్రైవేటుగా వెళ్లి ఫిజియోథెర పీ చేయించుకోవాలంటే ఆర్థిక భారమవుతుంది. – గోపాల్ ముద్దలాపురం, కూడేరు మండలం అనుమతులు రావాలి ఫిజియో థెరపీ క్యాంపులు లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమే. ఫిజియోథెరపిస్టులను తీసుకోవాలంటే పై నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గతేడాది 26 మంది పని చేశారు. ఈసారి మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టును తీసుకోవాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారం త్వరలోనే తీసుకుంటాం. – పాండురంగ, ఐడీ కోఆర్డినేటర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement