-
నిరుద్యోగ యువతతో పిన్నమనేని చెలగాటం
వైఎస్సార్ జిల్లా: ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ వివాదాస్పద నిర్ణయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సలాం బాబు మండిపడ్డారు. పిన్నమనేని నిర్ణయాలతో నిరుద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కారణంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరుద్యోగులు కోల్పోతున్నారని చెప్పారు. గ్రూప్ పరీక్షల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదు.. కనీస అనుభవం లేని పిన్నమనేనిని చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించడం దారుణమన్నారు. నిరుద్యోగ యువతతో పిన్నమనేని చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి పిన్నమనేనిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సలాంబాబు హెచ్చరించారు. -
వలస నేతలకుషాక్
కాంగ్రెస్ను వీడి వచ్చిన నేతలకు టీడీపీ మొండిచేయి యలమంచిలి, ముత్తంశెట్టి, పిన్నమనేనిలకు నో చాన్స్ నిన్నమొన్నటివరకు చక్రం తిప్పి.. నేడు పరువు పోగొట్టుకున్న నేతలు చేతిచమురు కూడా వదిలిన వైనం! సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరిన కొంతమంది నేతల పని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు మారింది. నిన్నమొన్నటి దాకా మంత్రిగా, ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నేతలు నేడు పార్టీలో కనీసం సీటు కూడా దక్కించుకోలేక పరువు పోగొట్టుకున్నారు. చంద్రబాబు పంచన చేరేందుకు వీరు చేతి చమురు కూడా వదిలించుకున్నట్లు సమాచారం. ఈ నేతల దుస్థితి చూసి జిల్లా వాసులే జాలిపడుతున్నారు. కాంగ్రెస్ను వీడుతున్న నేతలు మరో పార్టీ వైపు వెళ్లిపోతారేమోనన్న భయంతో గాలంవేసి తమ పార్టీలోకి లాక్కున్న చంద్రబాబు ఆ తరువాత సీట్లు కేటాయించడంలో మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో నిన్నటి దాకా కాంగ్రెస్లో ముందు వరుసలో కూర్చున్న ఈ నేతలు ఎన్నికలు పూర్తయిన తరువాత టీడీపీలో ఎంతమేరకు ఇముడుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ నుంచి ఐదుగురు వలస వస్తే ఇద్దరికే సీట్లు కేటాయించారు. కాంగ్రెస్తో అనుబంధాన్ని పక్కన పెట్టిన పిన్నమనేని... కాంగ్రెస్ పార్టీకి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబానికి అర్ధ శతాబ్దం అనుబంధం ఉంది. ఆయన తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు సుమారు ఇరవయ్యేళ్లు జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా మంత్రిగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చి ఆదరించింది. అయినా ఆయన కాంగ్రెస్ను వీడి టీడీపీ గూటిలో చేరారు. గుడివాడ, కైకలూరు సీటు ఆశించారు. ఆయనకు చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఎమ్మెల్యే రవికి అవమానమే... విజయవాడ (తూర్పు) ఎమ్మెల్యే యలమంచిలి రవి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరినా ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో దేవినేని నెహ్రూ, గద్దె రామ్మోహన్లను ఓడించిన ఘనత రవికి ఉంది. నియోజకవర్గంలో ఆయనకు మంచిపేరే ఉంది. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడంతో గద్దె కంటే రవికే విజయావకాశాలు ఉంటాయని భావించి చంద్రబాబు ఆయనకే సీటు ఇస్తారని అందరూ ఊహించారు. రవిని చివరి నిమిషం వరకు వరకు ఊరించిన చంద్రబాబు చివర్లో మొండిచెయ్యి చూపించారు. డబ్బు, సీటు రెండూ పోగొట్టుకున్న ముత్తంశెట్టి... గత ఎన్నికల్లో నూజీవీడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్తంశెట్టి విజయనిర్మల ఓడిపోయిన తరువాత చిరంజీవితో పాటు కాంగ్రెస్లో కలిసిపోయి సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవి పొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో ఆమె భర్త, విద్యావేత్త ముత్తంశెట్టి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీని వీడి పచ్చ కండువా కప్పుకొన్నారు. అవనిగడ్డ సీటు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేశానని ఆయన స్వయంగా చెబుతున్నారు. ఆయనకు అవనిగడ్డ సీటు ఇవ్వకపోవడంతో కనీసం నూజివీడు సీటైనా ఇవ్వాలని కోరుతూ చివరివరకు ప్రయత్నాలు సాగించారు. అయినా చంద్రబాబు కృష్ణారావుకు మొండి చెయ్యే చూపించారు. సీటు దక్కినా ఎదురీతే.. టీడీపీ టిక్కెట్లు పొందిన కాంగ్రెస్ మాజీ నేతలు మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (నూజివీడు) పరిస్థితి వారి నియోజకవర్గాల్లో ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతల్ని స్థానిక టీడీపీ నేతలు కలుపుకోలేకపోతున్నారు. వీరికి టీడీపీ నుంచి రెబల్స్ బెడద తప్పేలా లేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సహకరించక వీరు ఓడిపోతే రాబోయే రోజుల్లో టీడీపీలో వీరికి ఏమాత్రం గుర్తింపు ఉండదని అంటున్నారు. -
సైకిలెక్కిన మండలి, పిన్నమనేని
‘కన్నెర్ర చేస్తే..’ అంటూ టీవీ చానళ్లపై బాబు చిందులు హైదరాబాద్: కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణ వీరయ్య బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పసుపు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ వారు, పాతవారు కలుపుకుని పనిచేయాలని ఈ సందర్భంగా బాబు సూచించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అసెంబ్లీ, లోక్సభ సీట్లు గెలుచుకుంటుందని వస్తున్న సర్వే వివరాలను ప్రసారం చేసిన టీవీ చానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకటి రెండు, టీవీ చానళ్లు నాకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నాయి. నాపై బురద చల్లుతున్నాయి. వారు అలా చేస్తే నేను కన్నెర్ర చేయాల్సి వస్తుంది. అపుడు వారు ఏమవుతారో ఆలోచించుకోవాలి’’ అన్నారు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement