-
బతుకులు తెల్లారుతున్నాయ్
మలికిపురం: అది 2012 సంవత్సరం జూలై 21వ తేదీ..సమయం: ఉదయం 5 గంటలు. ప్రాంతం: మలికిపురం మండలంశంకరగుప్తం గ్రామం అడవిపాలెం. ఉదయమే అందరూ నిద్రలేచి బయటకు వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే, సమీపంలోనే గ్యాస్ బావుల సముదాయం వద్ద పైప్లైన్ భారీ పేలుడు. ఆ ప్రాంతం అంతా పొగలాగా గ్యాస్ ఆవరించి తీవ్రంగా వాసనవస్తుంటే పరిస్థితిని గమనించి, కంగారు పడ్డ ఓ తల్లి తన ఇద్దరి పిల్లను చంకన వేసుకుని కంగారుగా ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగించ వద్దంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు ఆ ప్రాంతంలో కూలీ నాలీ చేసుకునే వందలాది మంది ప్రజలు పరుగులు తీశారు. అనంతరం.. అదే రోజు ఉదయం: 8 గంటలు స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి గ్యాస్ అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వంట చేసుకునేందుకు పొయ్య వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి మళ్లీ.. 2014 జూన్ 27వ తేదీ గురువారం సమయం : ఉదయం 5 గంటలు. ప్రాంతం: మామిడికుదురు మండలం తాటిపాక సమీపంలో నగరం మినీ రిఫైనరీ ఎదుట. ఏం జరిగిందో తెలుసుకోక ముందే మరో తల్లి తన బిడ్డలను పట్టుకుని రక్షించుకునే లోపే మంటల వలయాల్లో చిక్కుకుని ఒకరినొకరు పట్టుకుని బూడిదగా మారారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది బూడిదయ్యారు. అలా రోడ్డుపై ప్రమాణిస్తున్న కొందరితో పాటు మరికొందరు మంటల్లో కాలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 24 మంది మృత్యువాత పడ్డారు. ఓఎన్జీసీ, గెయిల్ చరిత్రలో ఇదొక మరచిపోలేని భయంకర దుర్ఘటన. ఇలా ఒకటి కాదు.. తరచూ కేజీ బేసిన్ పరిధిలో జరుగుతున్న సంఘటనలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. భూగర్భంలోని చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా సంస్థలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన అనేక సంఘటనలు జిల్లాలో జరిగాయి. 1990 ప్రాంతంలో మామిడికుదురు మండలం కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లో అవుట్. 1995లో కొత్తపేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్ లు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. ఐదేళ్ల్ల క్రితం రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మూడేళ్లక్రితం రాజోలు మండలంలో కాట్రేనిపాడులో కరవాక ఓఎన్జీసీలో బావి బ్లో అవుట్ కొద్దిలో తప్పింది. 2017 సంవత్సరంలో తూర్పుపాలెంలో ఒక డ్రిల్లింగ్ పూర్తయిన బావికి ప్రొడక్షన్ టెస్టింగ్లో బ్లో అవుట్ తప్పింది. ఇక రాజోలు దీవిలో వారానికోసారి పైప్లైన్ల ద్వారా గ్యాస్ లీకవుతూనే ఉంది. తాజాగా తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో ఏకంగా సోమ, మంగళవారాల్లో వరుసగా మూడుసార్లు లీకయ్యాయి. దీంతో ప్రజల్లో అలజడి రేగింది. చమురు, గ్యాస్ పైప్ వల్ల ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్వహణ లోపం గెయిల్ పైప్లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సాగాలి. కానీ కేజీ బేసిన్లో వీటి నిర్వహణ సక్రమంగాలేదు. వీటి ద్వారా ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ వాటర్, క్రూడాయిల్తో కూడిన గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలో పేలిన లీకైన గ్యాస్ పైప్లను చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీని వల్ల పైప్లైన్ తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. అలాగే గ్యాస్ సరఫరా జరిగే సమయంలో కూడా అధిక ఒత్తిడి వల్ల కూడా పైపులు రాపిడికి గురై పాడవుతున్నాయి. ఎటువంటి లోపాలూ లేని పైపులు సుమారు çపదేళ్ల పైబడి పని చేస్తాయి. అయితే ఇన్ని లోపాలు ఉన్న ఈ పైప్లైన్లు రెండేళ్లకోసారి పాడైపోతాయి. పూర్తి నిర్లక్ష్యం గ్యాస్ పైప్లు తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడైపోతున్నా వాటిని మార్చాల్సిన సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గ్యాస్ విక్రయాల ద్వారా రూ.కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు చర్యలు తీసుకోవడం లేదు. నాణ్యత లోపం కూడా... పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం పైప్లైన్లు వేసి దోచుకుంటున్నారు తప్ప పనుల్లో నాణ్యత ఉండడం లేదు. ప్రజా ప్రతినిధులు ఎక్కడ? ఓఎన్జీసీ, గెయిల్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకూ పలువురు రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు పోరాడినా నాయకులు ప్రవేశించి ఉద్యమాలను నీరుగార్చారు. ఆ నాయకులంతా ఆ సంస్థలు ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి ప్రజా ఉద్యమాలను అణగదొక్కిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి. కోనసీమలో ఇన్ని ప్రమాద సంఘటనలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని ప్రజలు పేర్కొంటున్నారు. శిథిల పైప్లైన్లే కారణం.. కేజీ బేసిన్ (కృష్ణా, గోదావరి బేసిన్)లో మొత్తం 900 కిలోమీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో పది నుంచి 12 అంగుళాల పైప్లైన్ సుమారు 200 కిలోమీటర్లు, 18 అంగుళాల పైప్లైన్లు సుమారు 700 కిలోమీటర్లు. కోనసీమతో పాటు కోనసీమ నుంచి హైదరాబాద్ వరకూ వీటిని ఏర్పాటు చేశారు. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 100కు పైగా గ్యాస్ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు అంగుళాల పైప్లైన్ల ద్వారా గ్యాస్ను తరలిస్తారు. తాటిపాక నుంచి విజయవాడ, హైదరాబాద్లలోని వివిధ ఫ్యాక్టరీలకు 18 అంగుళాల పైప్లైన్ల ద్వారా గెయిల్ గ్యాస్ను తరలిస్తుంది. దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యం చమురు నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. కానీ ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల రాకపోకల వల్ల పాడైపోతున్న రోడ్లను కూడా ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది. -
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్
-
దేవాదుల పైప్లైన్ లీక్
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్-2 పైప్లైన్ శుక్రవారం రెండుచోట్ల లీకైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండిరామారానికి ఫేజ్-2 పైప్లైన్ ద్వారా నీటిని తలిస్తున్నారు. ఈ క్రమంలో జానకిపురం గ్రామ సమీపంలో పైప్లైన్ ఎయిర్వాల్వ్లు రెండుచోట్ల లీక్ కావటంతో నీరు పెద్దఎత్తున పైకి చిమ్ముతూ పక్కనే ఉన్నపంటపొలాలకు వెళ్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement