-
ఉసురు తీసిన ఊర కుక్కలు
-
దారుణం: ఉసురు తీసిన ఊర కుక్కలు
సాక్షి, ములుగు: జిల్లాలోని ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో ఘోరం జరిగింది. ఊర కుక్కలు బీభత్సం సృష్టిoచాయి. ఓ చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. కర్ణాటకలోకి గుల్బార్గాకు చెందిన వలస కార్మిక కుటుంబ రామప్ప-పాకాల పైపులైన్ పనులు చేస్తోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కంపెనీలో పనికి వెళ్లడంతో వారికోసం ఆడుకుంటూ గుట్ట పైకి వెళ్లిన ఐదేళ్ల బాలుడి చిరంజీవిపై కుక్కలు దాడికి దిగాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కార్మిక కుటుంబం 2 నెలలుగా పైపులైన్ పనులో చేస్టున్నట్టు తెలిసింది. ఇక్కడే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
6 నుంచి ‘భగీరథ’ పైప్ లైన్లు..
అధికారులతో సమీక్షలో ప్రాజెక్టు వైస్చైర్మన్ ప్రశాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్కు సంబంధించి గ్రామాల్లో అంతర్గత పైప్లైన్ పనులను ఈనెల 6న అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని అధికారులను ప్రాజెక్టు వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశిం చారు. ఇంట్రా విలేజ్ పనుల కోసం అసిస్టెం ట్ ఇంజనీర్ స్థాయిలో రోజువారీ షెడ్యూల్ రూపొందించాలన్నారు. భగీరథ పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల ఎస్ఈల తో శుక్రవారం ఆయన సమీక్షించారు. భగీరథ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజక వర్గంలో ఒక మండలాన్ని ఎంచుకొని, అక్కడ పని పూర్తిచేసి మరో మండలంలో పనులు ప్రారంభించాలన్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో పైప్లైన్ పను లు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ, మైక్రో ప్లానింగ్తో సమస్యను అధిగమించవచ్చన్నా రు. పైప్లైన్ పనుల రోజువారీ స్థితిగతులు తెలుసుకోవడానికి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. పైప్లైన్ల మెటీరియల్ నాణ్యతను తప్పని సరిగా తనిఖీ చేయించాలన్నారు. ‘వైల్డ్ లైఫ్’ ప్రాంతం నుంచి లైన్లు వద్దు ట్రాన్స్ మిషన్ పైప్లైన్ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని ప్రశాంత్రెడ్డి అన్నా రు. నెలకు 16 శాతం చొప్పున పనులు పూర్తి చేస్తేనే నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకో గలమన్నారు. ఆసిఫాబాద్, కడెం సెగ్మెంట్ల లో వైల్డ్లైఫ్ ఏరియా నుంచి పైప్లైన్లు వేయ కుండా కొత్త డిజైన్లు రూపొందించాలని చెప్పారు. భూపాలపల్లి జిల్లా ముళ్లకట్ట వంతెనపై నుంచి పైప్లైన్ వేయడానికి అనుమతి లభించిందన్నారు. -
కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం
70 శాతం పూర్తయిన ప్రధాన పైప్లైన్ పనులు బాన్సువాడ : మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని సింగూరు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పైప్లైన్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పైప్లైన్ల విస్తరింపు పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పైప్లైన్ల ఏర్పాటుకు పొలాలను తవ్వి పైపులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నది మిషన్ భగీరథ ఉద్దేశం. సింగూరు ప్రాజెక్టు వద్దే నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నేరుగా పైప్లైన్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు. మిషన్ భగీరథ కోసం సింగూరు నుంచి 1.8 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ప్రజలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందించనున్నారు. సింగూరు పథకానికి రూ. 1,350 కోట్లు, ఎస్సారెస్పీ పథకానికి రూ. 1,400 కోట్లు కేటాయించారు. సింగూరు నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లోని మండలాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలకు నీరందిస్తారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఫిల్టర్బెడ్ పనులు పూర్తయ్యాయి. పైప్లైన్, ఇంటెక్వెల్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దే హసన్పల్లిలో ఫిల్టర్ బెడ్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిజాంసాగర్లో నీటి లభ్యత విషయంలో సందేహం ఉండడంతో రూ. 500 కోట్లు అదనంగా వెచ్చించి సింగూరు నుంచి పైప్లైన్ వేయిస్తున్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్కు నీటి మళ్లింపు జరుగనున్నందున.. నిజంసాగర్లోకి నీరు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు ఇంకా సమయం పడుతుందని భావించిన అధికారులు.. సింగూరు నుంచి పైప్లైన్ వేయాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు సమీపంలో డెడ్స్టోరేజీ వాటర్ అందేవిధంగా కాలువను తవ్వి, పుల్కల్ వద్ద నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పైప్లైన్ల ద్వారా అక్కడి నుంచి తడ్మనూరు వద్ద సముద్ర మట్టానికి సుమారు 590 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సుమారు వందమీటర్ల ఎత్తులో ట్యాంకులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విడుదల చేసే నీరు జిల్లాలోని నర్సింగ్రావుపల్లికి చేరుకుంటుం ది. నర్సింగ్రావుపల్లి నుంచి నీరు నాలు గు ప్రాంతాలకు వెళ్తుంది. జుక్కల్, బా న్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీరు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూన్లోపు 235 గ్రామాలకు, అదే ఏడాది డిసెంబర్ చివరి నాటికి 572 గ్రామాలకు నీరందించనున్నారు. సింగూరు వద్ద వాల్వ్ ఓపెన్ చేస్తే నిజామాబాద్ జిల్లాలోని ఇంటింటికీ నీరు చేరేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాగుతున్న పైప్లైన్ పనులు ప్రధాన పైప్లైన్ల పనులు పూర్తి కావస్తుండడంతో, ఇక గ్రామాల్లో పైప్లైన్ల పనులు జోరందుకున్నాయి. బాన్సువాడ సమీపంలోని దుర్కి ప్రాంతంలో పైప్లను డంప్ చేశారు. అక్కడి నుంచే అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేస్తున్నారు. అయితే రైతుల అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్లు పంట పొలాల్లో తవ్వుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
సబ్సిడీ గ్యాస్తో ‘మిషన్’ పనులు
రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న తహసీల్దార్ సిలిండర్ స్వాధీనం 6ఏ కేసు నమోదు రామగుండం : మండలంలోని పెద్దంపేట నుంచి రామగుండం వైపు మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులకు మంగళవారం ప్రధాన రహదారిపైనే సబ్సిడీ గ్యాస్ సిలిండర్తో ఎరక్షన్ పనులు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ శ్రీనివాస్రావు స్పందించి నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్కు చెందిన సలేండ్రపాండేపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement