-
సైబరాబాద్ పోలీసుల పిటిషన్ పై హైకోర్టు లో విచారణ
-
కోర్టుల్లో భద్రతపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
-
ఈదర పిటిషన్ కొట్టివేత
ఒంగోలు సెంట్రల్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఈదర హరిబాబు అనర్హుడని ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లా కోర్టులో ఈదర దాఖలు చేసిన పిటిషన్ను మొదటి అదనపు జిల్లా జడ్జి, ఎస్కె మహ్మద్ ఇస్మాయిల్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు జెడ్పీ అధ్యక్షుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ విప్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తమ పార్టీ తరఫున గెలిచి, తాము జారీ చేసిన విప్ను ధిక్కరించి పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోగా, మరో పార్టీ మద్దతుతో జెడ్పీ అధ్యక్షుడిగా ఎన్నికవడం చెల్లదని రిటర్నింగ్ అధికారైన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్వో హరిబాబుకు నోటీసు జారీ చేశారు. అనంతరం విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా విప్ను తాను తీసుకోలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని ఈదర తెలిపారు. విప్ జారీ చేసినట్లు సంబంధిత పత్రాలను ఆర్వోకు టీడీపీ నేతలు అందజేశారు. విచారణ అనంతరం విప్ ఉల్లంఘించినట్లు నిర్ధారించి అనర్హుడిగా కలెక్టర్ ప్రకటించారు. ఈ తీర్పుపై ఉమ్మడి రాష్ట్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దిగువ కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా హైకోర్టు పిటిషనర్కు సూచించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం కోర్టు ఈదర పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement