-
నువ్వే మార్గదర్శకుడివి అన్నా..
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ ప్రత్యర్థులు ఎర్రబెల్లి దయాకర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డిల మధ్య ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో సరదా సంభాషణ జరిగింది. ఉదయం సభా ప్రారంభానికి ముందు సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర, మాజీమంత్రి హరీశ్రావు పలకరించుకున్న సమయంలో అక్కడకు ఎర్రబెల్లి వచ్చారు. రాగానే ఆయన ఏం బుద్ధిమంతుడిలా ఉన్నావ్.. అని గండ్రనుద్దేశించి అన్నారు. ఇందుకు స్పందించిన గం డ్ర ‘నేనెప్పుడూ బుద్ధిమంతుడినే అన్నా.. అయినా అన్నీ నీ నుంచి నేర్చుకున్నవే కదా.. నువ్వే మార్గదర్శకుడివి అన్నా’అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. గుత్తాకు ఉత్తమ్ కంగ్రాట్స్.. సభ ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో నల్లగొండ నేతలు ఉత్తమ్, గుత్తా సుఖేందర్రెడ్డిల మధ్య కూడా సరదా చర్చ జరిగింది. తనకు తారసపడిన ఉత్తమ్ను గుత్తా పలకరించగా కంగ్రాట్స్ గుత్తాగారూ అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కంగ్రాట్స్ ఎందుకు చెబుతున్నారో అర్థంకానట్లు గుత్తా సైలెంట్గా నవ్వి ఊరుకున్నారు. గుత్తా మంత్రి కాబోతున్నారని, అందుకే ఉత్తమ్ కంగ్రాట్స్ చెప్పినట్టున్నారని అక్కడున్న జర్నలిస్టులు చర్చించుకోవడం గమనార్హం. -
సరదాను హరించిన శారద
భవాని మాల ధరించిన చిన్నారులు రెండు కుటుంబాలకు ఒక్కక్కరే కొడుకులు చూచుకొండలో విషాదం స్నానం కోసం శారద నదిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృత్యువాత మునగపాక:ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులు శారదా నదిలో సరదాగా స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో చూచుకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చూచుకొండ ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రేగుల దార సన్యాసినాయుడు (మణికంఠ, 13) సమీపంలోని గణపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వతరగతి చదువుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన పేలూరి సాయి (14) కూడా అదే హైస్కూల్లో 9వతరగతి చదువుతున్నాడు. దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇద్దరూ అమ్మవారి మాల ధరించారు. బుధవారం ఉదయం మణికంఠ, సాయి, అదే కాలనీలో ఉంటున్న సతీష్ అల్పాహారం తీసుకున్న తరువాత గణపర్తి శారదానది పరివాహక ప్రాంతంలో స్నానం చేసేందుకు ఉదయం 9.45 గంటలకు చేరుకుని నదిలోకి దిగారు. మణికంఠ, సాయి ఇద్దరూ ఒక్కసారిగా నదిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన సతీష్ కేకలు వేయడంతో పక్కనే ఉన్న కొంతమంది గాలింపు చేపట్టారు. కొంతసేపటికి సాయి మృతదేహం లభ్యమైంది. మణికంఠ మృతదేహం కోసం గణపర్తి, మెలిపాక, పూడిమడక గ్రామాలకు చెందిన ఈతగాళ్లతోపాటు ఎస్ఐ హరి, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సుమారు 4 గంటల పాటు గాలించారు. తాళ్లు, ట్యూబ్ల సహాయంతో నదిలో విస్త్రృతంగా గాలింపు చేపట్టగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికంఠ మృతదేహం కూడా కనిపించడంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. న దీపరివాహక ప్రాంతం వద్ద ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో తాము వారించినా పిల్లలు వినిపించుకోలేదని అక్కడ ఉన్న రజకులు ఆవేదన వ్యక్తంచేశారు. రెండూ పేద కుటుంబాలే.. మణికంఠ తల్లి ఉమ అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తుండగా తండ్రి స్థానికంగా మేస్త్రీగా పనులు చేస్తుంటాడు. మణికంఠ అక్క మౌలిక అండమాన్లో ఉంటోంది. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా నదిలో పడి మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కూడా తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి విష్ణు స్థానికంగా క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు నదిలో పడి మృతి చెందాడన్న విషయం తెలియడంతో కుటుంబసభ్యుల. ఇద్దరి విగతజీవులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో నది ఒడ్డకు వందలాదిగా జనం తరలివచ్చారు. నది ఒడ్డునే పోస్టుమార్టం శారదానదిలో పడి మృత్యువాత పడిన మణికంఠ, సాయిలకు స్థానికంగానే పోస్టుమార్టం నిర్వహించారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి చెందిన వైద్యులు శారదానది ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హరి చెప్పారు. శోకసంద్రంలో చూచుకొండ ఆడుతూ పాడుతూ ఉండే ఇద్దరు చిన్నారులు స్నానానికి వెళ్లి మృతి చెందడంతో చూచుకొండ గ్రామం శోక సముద్రంలో మునిగింది. రెండు కుటుంబాలకు ఒక్కొక్కరే కొడుకులు కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. నేతలు, అధికారుల పరామర్శ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, అధికారులు బుధవారం గ్రామానికి చేరుకున్నారు. తహశీల్దార్ రాంబాబు, ఎంపీడీఒ శాంతలక్ష్మి, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, ఎంపీపీ మంజు, ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, చూచుకొండ సర్పంచ్ నరసింగరావు, కర్రి రామనాగేశ్వరరావు తదితరులు మృతదేహాలకు సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
సరదా హద్దు దాటింది!
వీక్షణం వయసులో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడటం మామూలే. బాయ్ ఫ్రెండ్తో సరదాగా షికార్లు చేయాలని సరదా పడటమూ మామూలే. అయితే ఈ సరదా చైనాలో పెద్ద అనర్థమే తెచ్చిపెడుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని బెంబేలెత్తిస్తోంది! గత కొద్ది కాలంగా చైనా అమ్మాయిల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. జీవితంలో బాగా స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని వారు అనుకుంటు న్నారట. ప్రేమ, పెళ్లి వంటి వాటికి సమయం కేటాయించలేక పోతున్నారట. అలాంటి వారికోసం కొత్త రకం సంస్థలు వెలిశాయి. అవేం చేస్తున్నాయో తెలుసా? పార్టీలకు, పిక్నిక్లకు వెళ్లడానికి బాయ్ఫ్రెండ్సని అద్దెకిస్తున్నాయి. గంటకింత, రోజుకింత అంటూ వసూలు చేస్తున్నాయి. దాంతో అమ్మాయిలు రుసుము చెల్లించి బాయ్ఫ్రెండ్ను అద్దెకు తీసుకుంటున్నారు. ఆ సమయం కాస్తా గడిచాక తమ చదువు, వృత్తులలో మునిగిపోతున్నారట! దాంతో ఆడపిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట! మరి ప్రభుత్వం ఇలాంటి సంస్థల మీద ఏ యాక్షన్ తీసుకుంటుందో చూడాలి!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement