-
'ముద్రగడ' వార్తలపై ముఖ్యమంత్రి అక్కసు
విజయవాడ: కాపులకు రిజర్వేషన్ డిమాండ్ తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్షకు మీడియా ప్రాధాన్యం ఇవ్వటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కసు వెళ్లగక్కారు. ఓ వైపు ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ప్లీట్ రివ్యూ నిర్వహిస్తే.. ఆ వార్తలను వదిలి దీక్ష వార్తలను రాసి ప్రభుత్వాన్నికి చెడ్డపేరు ఆపాదించే ప్రయత్నం చేశారని విలేకరులపై చిందులేశారు. 'నేను ఎన్నో దేశాలు తిరిగా. ఎన్నెన్నో కార్యక్రమాలకు హాజరయ్యా. కానీ విశాఖపట్నంలో నిర్వహించిన ప్లీట్ రివ్యూ లాంటిది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దాన్ని ఘనంగా నిర్వహించినందుకు నేను గర్వపడుతున్నా. అయితే అంత ఇంపార్టెంట్ వార్తలు వదిలి ఎవరో నన్ను తిట్టారనే వార్తలు ప్రధానంగా రాయడంలో అర్థమేమిటి? ' అంటూ ముద్రగడ దీక్ష వార్తలను ఉద్దేశించి బాబు మండిపడ్డారు. తనను తిట్టిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తిట్టినవాళ్లకు ప్రాచుర్యం కల్పిస్తున్నారని సీఎం అన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ముద్రగడ దంపతులు దీక్ష విరమించారన్న ముఖ్యమంత్రి.. కాపుల్లో కూడా చాలామంది పేదవాళ్లు ఉన్నారని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది నెలల్లోగా మంజునాథన్ కమిటీ రిపోర్టు వస్తుందని, కాపు కార్పొరేషన్ కు ఏటా రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. తుని ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, రైలు దహనం కేసులో బాధ్యులపై కఠినచర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. -
ఇండియాలోనే ఉన్నామా అనిపించింది: చంద్రబాబు
- విశాఖలో ప్లీట్ రివ్యూ అదరహో అన్న ముఖ్యమంత్రి - అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణతో నగర ఖ్యాతి పెరిగిందని వ్యాఖ్య విజయవాడ: ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించడం ద్వారా విశాఖపట్నం కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్లీట్ రివ్యూ నిర్వహణా విశేషాలను పంచుకున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు సహా 50 దేశాలకు చెందిన ప్రతినిధులను ఏపీ ప్రభుత్వం తరఫున సగౌరవంగా సత్కరించామని సీఎం చెప్పారు. కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించినందుకు ఇండియన్ నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. 'సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అరుదు. అలాంటి విశేషానికి మన రాష్ట్రం వేదికైనందుకు ఆనందంగా ఉంది. భారత నౌకాదళానికి కేంద్ర బిందువుగా విశాఖను ఎన్నుకోవడం మనకు గర్వకారణం. ప్లీట్ రివ్యూ సందర్భంగా నేవీ ఉన్నతాధికారులు ఆ విషయాన్ని ప్రకటించడం సంతోషకరం. విశాఖ ఇప్పుడొక అంతర్జాతీయ నగరం. ప్లీట్ రివ్యూ వేడుకలు చూస్తుంటే అసలు ఇండియాలోనే ఉన్నామా? అనే సందేహం వచ్చింది. నౌకాదళ పాటవ ప్రదర్శనకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. మంచి సంఘటనకు స్పందించిన ప్రజలందరినీ అభినందిస్తున్నా' అని సీఎం చంద్రబాబు అన్నారు. రెండేళ్ల కిందట విశాఖను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపానును ప్రస్తావిస్తూ.. ఆ సందర్భంలో మాట ఇచ్చినట్లు ఏడాది తిరిగేలోగా వైజాగ్ రూపురేఖల్ని మార్చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు విశాఖ అనువైన ప్రాంతమని, గత నెలలో 44 దేశాల ప్రతినిధులతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్ కూడా విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు. సీఐఐ సదస్సులో రాష్ట్రానికి 4.70లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామన్నారు. తాజాగా నిర్వహించిన ప్లీట్ రివ్యూ కూడా విశాఖ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిందన్నారు. కార్యక్రమాలను నిర్వహించిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు లభించాయని సీఎం చెప్పారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
Advertisement