-
వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ: రాచమల్లు
-
కాటేసిన సవతి ‘ప్రేమ’
భర్త, కుమారుడి దారుణ హత్య ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం మరో కుమారుడి పరిస్థితి విషమం ఆమె పేరు ప్రేమ. కానీ ఆమె మనసు నిండా విషం దాగి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తను.. ముక్కుపచ్చలారని పిల్లలను కర్కశంగా కత్తితో పొడిచింది. భర్త, మరో బాలుడు ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో ఇంకో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. ప్రొద్దుటూరు క్రైం: భర్త, పిల్లలపై అసూయ పెంచుకున్న ఓ సవతి తల్లి వారిని హత మారిస్తే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని భావించింది. పక్కా ప్లాన్తో భర్తతో పాటు పిల్లలిద్దరిని కత్తితో దారుణంగా పొడిచింది. భార్య చేతిలో భర్త సురేష్(48), మొదటి భార్య కుమారుడైన సుచి(15) మృతి చెందగా మరో కుమారుడు సుమేష్(11)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని త్రిశూర్ జిల్లా, పున్నగుళం మండలం, చిట్టెనూరు గ్రామానికి చెందిన శ్రాంబిక్కల్హౌష్ సురేష్ 15 ఏళ్ల క్రితం మైదుకూరుకు వచ్చి స్థిరపడ్డాడు. గుడ్బాయ్ అప్పడాల వ్యాపారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు సరఫరా చేసేవాడు. అతనికి సుచి, సుమేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా సురేష్ మొదటి భార్య షీమోల్ను 12 ఏళ్ల క్రితం వదిలేశాడు. తర్వాత అతను అదే గ్రామానికి చెందిన ప్రేమ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సుప్రీమ్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో సురేష్ ఏడాది క్రితం ప్రొద్దుటూరులోని కోనేటికాలువ వీధికి వచ్చి గుడ్బాయ్ అప్పడాల వ్యాపారం ప్రారంభించాడు. పట్టణంలోని సార్వకట్టవీధిలోని శ్రీగురురాఘవేంద్ర స్కూల్లో సుచి 8వ తరగతి చదువుతుండగా, సుమేష్ 5వ తరగతి చదువుతున్నాడు. బంధువులకు రూ. 2లక్షలు డబ్బు ఇచ్చాడని.. మొదటి భార్య పిల్లల పట్ల ప్రేమ ఎప్పుడూ కపట ప్రేమ చూపేది. ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం చేసినా సుమేష్, సుచిలకు సరిగా పెట్టేది కాదు. అందువల్ల వారి ఆలనా పాలనా సురేష్ తల్లి సత్యభామ చూసుకునేది. పిల్లలపై అసూయతో ఎప్పుడూ వారిని తిట్టేది. ఇలా చేసినప్పుడల్లా భర్త ఆమెతో గొడవ పడేవాడు. ఇలా వారి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలో సురేష్ 10 రోజుల క్రితం తన సోదరి వివాహం కోసం రూ. 2లక్షలు ఇచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని భార్య వారం రోజుల నుంచి భర్తతో గొడవ పడేది. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న భర్త ‘నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా.. నువ్వు ఎవ్వరూ చెప్పడానికి.. ఎక్కువగా మాట్లాడితే ఉరి వేసి చంపేస్తానని’ భార్యను హెచ్చరించాడు. తనను నిజంగానే భర్త చంపేస్తాడేమోనని ఆమె భావించింది. దీంతో భర్తతో పాటు పిల్లలిద్దరిని చంపేస్తే వారి ఆస్తి తన కుమారుడికి వస్తుందని, అంతేకాకుండా వారిని వదిలించుకొని సుఖంగా ఉండవచ్చని ఆమె అనుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యా భర్తలిద్దరూ గొడవ పడ్డారు. భర్త, పిల్లలను హతమార్చాలని పక్కాగా ప్రణాళిక రూపొందించింది. గురువారం వేకువజామున అందరూ నిద్రిస్తుండగా ఆమె భర్త గదిలోకి వెళ్లి పిడి బాకుతో అతి కిరాతకంగా పొడిచేసింది. అతను గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న కుమారులిద్దరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. వారిని కూడా అదే కత్తితో ఆమె ఇష్టానుసారంగా పొడిచింది. భర్త సురేష్, పెద్ద కుమారుడు సుచి కొన్ని నిమిషాల తర్వాత మృతి చెందారు. మరో కుమారుడు సుమేష్ అపస్మారక స్థితిలో పడిపోవడంతో చనిపోయాడని భావించిన ప్రేమ కింది గదిలోకి వచ్చి పడుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకై తన కుమారుడు సుప్రీమ్ను కత్తితో స్వల్పంగా గాయ పరచి, తాను కూడా గాయ పరుచుకుంది. పని మనిషి రావడంతో ఘటన వెలుగులోకి.. ప్రొద్దుటూరుకు చెందిన శివ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి సురేష్ వద్ద పని చేస్తున్నాడు. గురువారం ఉదయాన్నే అతను వచ్చి సురేష్ ఇంటి తలుపు తట్టాడు. ఎంత సేపు పిలిచినా లోపలి నుంచి ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. దీంతో అతను కిటికీS వద్దకు వెళ్లి ఇంట్లోకి చూడగా సురేష్ రక్తపు మడుగులో పడివున్నాడు. అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు తెరిచారు. ముందుగా గాయాలతో ఉన్న సుమేష్, సుప్రీమ్, ప్రేమలను ఆటోలో వన్టౌన్ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుమేష్కు కత్తిపోట్లు ఎక్కువగా ఉండటంతో తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. విషయం తెలియడంతో డీఎస్పీ పూజితానీలం, సీఐ బాలస్వామిరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారి కుటుంబ సన్నిహితుడు ఆవుల దస్తగిరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. నానమ్మ ఉండి ఉంటే.. సుమేష్, సుచిల బాగోగులు రోజూ వారి నాన్నమ్మ సత్యభామనే చూసుకునేది. మొదటి పిల్లలిద్దరూ నాన్నమ్మతోనే ఉండేవారు. సవతి తల్లి ప్రేమతో వారికి అనుబంధం తక్కువే అని చెప్పవచ్చు. కేరళలోని తమ బంధువులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సత్యభామ 20 రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. ఆమె ముందు భార్యా భర్తలు గొడవ పడేవారు కాదు. ఆమె ఇంట్లో ఉండి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని బంధువులు చర్చించుకుంటున్నారు. అమ్మే పొడిచింది.. కుటుంబంలోని ఇద్దరు మృతి చెందారు, ముగ్గురు గాయపడ్డారు. అందరూ ప్రమాదకర స్థితిలో ఉండటంతో పోలీసులకు అర్థం కాలేదు. బయటి వ్యక్తులు వచ్చి డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారేమోనని భావించారు. అయితే గాయాలతో ఉన్న ప్రేమ కుమారుడు సుప్రీమ్ను ప్రశ్నించగా తమ అమ్మే తనను కత్తితో పొడిచిందని చెప్పాడు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై ఒక అవగాహనకు వచ్చారు. కొంత సేపటి తర్వాత ఆమెను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరి ప్రమేయమైనా ఉందా.. ఒక్క మహిళ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించిందంటే పోలీసులు విశ్వసించడం లేదు. మరో వ్యక్తి ప్రమేయంతో ఆమె దారుణానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయాల కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారించలేకపోతున్నారు. విషయం తెలియడంతో కేరళ నుంచి సురేష్ బంధువులు ప్రొద్దుటూరుకు బయలుదేరారు. -
లారీ, కారు ఢీ - ఐదుగురికి గాయాలు
కడప: వేగంగా వెళ్తున్న లారీ, కారును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల రోడ్డులో జరిగింది. వివరాలు..మొద్దునురి మండలం ఉమ్మారెడ్డి గ్రామానికి చెందిన మల్లికార్జున్రెడ్డి తన కుటుంబంతో కలిసి సోమవారం తమ్ముడి వివాహానికి హజరై కారులో తిరిగి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో కారు నుజ్జునుజ్జు కావడంతో మల్లికార్జున్ రెడ్డి కారులో చిక్కుకున్నాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని అతనిని గ్యాస్ కట్టర్ సహాయంతో కారు బాడీని తొలగించి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కొల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రొద్దుటూరు) -
ప్రొద్దుటూరులో భారీ చోరీ
కడప: ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దొంగలు రెచ్చిపోయారు. అనారొగ్యంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చేవరకు .. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మాయం చేశారు. ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిథిలోని శ్రీరామయంపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గణచారీ సురేష్ మెడికల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య అనారోగ్యం పాలవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఎవరు లేరని తెలుసుకున్నదుండగులు మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, కిలోన్నర వెండి దోచుకెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చే సరికి వస్తువులన్నీ చిందర వందరగా ఉండటంతో సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రొద్దుటూరు) -
ఆడిందే ఆట.. పాడిందే పందెం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్బుకీలు రెచ్చిపోతున్నారు. ఆడిందే ఆట(క్రికెట్) గా..పాడిందే పాట(పందెం)గా చెలరేగుతున్నారు. ఇంతకముందు క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అయ్యిందంటే చాలు ప్రధాన బుకీలు రెండు మూడు రోజులు ముందే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. అక్కడ బెట్టింగ్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేవారు. స్థానికంగా వారి అనుయాయులు, సబ్బుకీలు, కొరియర్ బాయ్లు బెట్టింగ్ డబ్బు సమకూర్చి పంపిస్తుంటారు. ఇదీ నిన్న మొన్నటి వరకు జరిగే తంతు. కానీ ఇటీవల ప్రొద్దుటూరు బుకీలు స్టైల్ మార్చారు. బుకీలు స్థానికంగానే లక్షల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ రెచ్చిపోతున్నారు. ఇక్కడే ఉంటూ ప్రధాన బుకీలందరూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బుకీలను పోలీసులు గాలికి వదిలేశారా.. రెండు మూడు నెలల నుంచి ఎన్నికల విధుల్లో మునిగి ఉన్న పోలీసులు ఇతర వ్యవహారాలైపై దృష్టి పెట్టడం లేదు. ఏప్రిల్ నెల నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో నుంచి బయట పడిన పోలీసులు క్రికెట్ బెట్టింగ్నూ పూర్తిగా విస్మరించారు. గతంలో అయితే క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు ప్రత్యేకంగా దాడులు నిర్వహించేవారు. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోక పోవడంతో ప్రధాన బుకీలందరూ పట్టణంలోనే ఉంటూ స్వేచ్ఛగా క్రికెట్ పందేలు కాస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు సందర్భంగా ప్రతి రోజూ ఒక్క ప్రొద్దుటూరులోనే రూ.80 లక్షల నుంచి రూ.కోటి దాకా బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పట్టణంలోని వైఎంఆర్ కాలనీ, జిన్నారోడ్డు, మెయిన్బజార్, గాంధీరోడ్డు, మోడంపల్లి తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుతున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ ఆదేశాలు హుళుక్కేనా.. ఎస్పీ అశోక్కుమార్ మొదటిసారిగా ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు బెట్టింగ్ నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. మ్యాచ్లు జరిగే సమయాల్లో బుకీలందరినీ ఆయా పోలీస్టేషన్లలో హాజరయ్యేలా చూడాలన్నారు. ఇటీవల ఎస్కేవీ ఫంక్షన్ హాల్లో జరిగిన పోలీసు గెట్ టు గెదర్ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఎస్పీ దీన్ని కచ్చితంగా పాటిస్తే కొంత ఫలితం ఉంటుందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభంలో మాత్రం రెండు మూడు మ్యాచ్లకు బుకీలను స్టేషన్లకు పిలిపించారు. పట్టణంలో వందల సంఖ్యలో బుకీలు ఉండగా 10-15 మందిని మాత్రమే బుకీలను స్టేషన్లకు పిలిపించారు. తర్వాత వారిని గాలికి వదిలేశారు. దీంతో బుకీలు దర్జాగా బెట్టింగ్ కార్యకలాపాలకు పా ల్పడుతున్నారు. ఆదివారం నాడు పంజాబ్, కలకత్తా టీంల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో బుకీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన బుకీల ఇళ్లల్లోనే బెట్టింగ్ నిర్వహణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం నాడు ప్రొద్దుటూరులోనే రూ.2 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగవచ్చని బుకీలు అంచనా వేస్తున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement