-
నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కేబుల్ పనుల నిర్వహణ నేపథ్యంలో శ్రీనగర్కాలనీ రోడ్–నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ హోటల్ మధ్య మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ ఇన్చార్జ్ కొత్వాల్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం నుంచి 43 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరిం చాలని ఆయన కోరారు. భారీ వాహనాల తో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు మాత్ర మే ఈ మళ్లింపులు వర్తించనున్నాయి. ⇔ సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు వైపు నుంచి పంజగుట్ట వైపు వచ్చే వాహనాలను కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా, బాలానగర్, ఫిరోజ్గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్ జంక్షన్, లాలమ్రాయ్, సీటీఓ, ప్యారడైజ్ చౌరస్తా, ఎంజీ రోడ్, రాణిగంజ్ జంక్షన్, కర్బాలా మైదాన్, అప్పర్ ట్యాంక్బండ్, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, సెక్రటేరియేట్ పాత రోడ్డు, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. ⇔ పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి వైపు నుంచి అమీర్పేట, పంజగుట్ట మీదుగా ఏపీ, రాయలసీమల్లోని గమ్య స్థానాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులను ఎస్సార్నగర్లోని గౌతమ్ డిగ్రీ కాలేజీ పాయింట్ నుంచి కూకట్పల్లి వైపు పంపిస్తారు. ⇔ పటాన్చెరు, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వచ్చే సిటీ బస్సులు, భారీ వాహనాలను ఎస్సార్నగర్ చౌరస్తా నుంచి కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బి సిగ్నల్, సోనాబాయ్ టెంపుల్, అమీర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు. ⇔ ఇదే మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులను అమీర్పేట జంక్షన్ నుంచి మాతా టెంపుల్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు. ⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్కాలనీ రోడ్ మీదుగా ఖైరతాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను షాలిమార్ జంక్షన్ నుంచి శ్రీనగర్కాలనీ జీహెచ్ఎంసీ పార్క్, ఎంజే ఇంజినీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్, జీవీకే వన్ మాల్, తాజ్ కృష్ణ జంక్షన్, కేసీపీ జంక్షన్, చీఫ్ ఇంజనీర్స్ ఆఫీస్ మీదుగా మళ్లిస్తారు. ⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్కాలనీ రోడ్ మీదుగా బేగంపేట/ఎస్సార్నగర్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ జంక్షన్ నుంచి కృష్ణనగర్ చౌరస్తా, యూసుఫ్గూడ చెక్పోస్ట్, యూసుఫ్గూడ బస్తీ, కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్నగర్, వెంగళ్రావు నగర్, ఎస్సార్నగర్ మీదుగా పంపిస్తారు. -
మంత్రి వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
అనంతపురం : అనంతపురం టీడీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ తలెత్తగా ధర్మవరంలో ఉద్రికత్త వాతావారణం నెలకొంది. ఈ విషయంపై ఎమ్మెల్యే సూరి తన వర్గీయులతో సహా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి మంత్రి పరిటాల వర్గీయులపై ఫిర్యాదుచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ... డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. టీడీపీలో చిన్న చిన్న గొడవలు సహజమేనని, అయితే ఆ గొడవలను ఒక కుటుంబంలా సర్దుబాటు చేసుకుంటామని ఎమ్మెల్యే వరదాపురం సూరి అన్నారు. మంత్రి సునీత వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఆ పార్టీ ఎమ్మెల్యే సూరి వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గీయులు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. -
ధర్మవరంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య మరో వివాదం చెలరేగింది. పరిటాల వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే సూరి వర్గంవారు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా సూరి వర్గీయులు పోలీసుల ద్వారా కేబుల్ పనులను ఆపేందుకు యత్నించారు. దీంతో పోలీసులతో మంత్రి పరిటాల వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. కేబుల్ పనులు కొనసాగించి తీరుతామని పరిటాల వర్గీయులు స్పష్టం చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement