-
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 2021–22 కేంద్ర బడ్జెట్లో నిధుల విడుదలతో పాటు సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన నిధులతో పాటు, కోవిడ్ సంక్షోభంలో ఈ రంగాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ పలు సూచనలు చేశారు. రూ.1,552 కోట్ల అంచనాతో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కీలకమైన మౌలిక వసతుల కోసం సుమారు రూ.1,094 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. రూ.300 కోట్లు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ మెగా టెక్స్టైల్ పార్క్ స్కీం కింద రూ.500 కోట్ల మేర విడుదలకు అవకాశమున్నందున బహిర్గత మౌలిక వసతుల కోసం తక్షణమే కనీసం రూ.300 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ లేఖలో కోరారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీఎస్డీఎస్) మార్గదర్శకాల ప్రకారం 25,495 మరమగ్గాలు (తెలంగాణలో 35,588) ఉన్న సిరిసిల్లలో ఇచల్కరంజి (మహారాష్ట్ర), సూరత్ (గుజరాత్) తరహాలో మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులను ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు రూ.50 కోట్లతో వీవింగ్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆలస్యమవుతున్నందున ‘మెగా పవర్లూమ్ క్లస్టర్’తో పాటు రూ.49.84 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో సిరిసిల్లలోని వీవింగ్ అపారెల్ పార్క్, టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు, మగ్గాల ఆధునీకరణ, మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి తదితరాలు చేపడతామన్నారు. తెలంగాణలో ఐఐటీహెచ్ ఏర్పాటు పవర్లూమ్ రంగానికి సంబంధించి మార్కెటింగ్ వ్యూహాల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ‘పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’కు ప్రభుత్వ వాటాగా రూ.756.97 కోట్లు సమకూరుస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేస్తోందన్నారు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు తమిళనాడు, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఐఐహెచ్టీ ఏర్పాటుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పార్కులో సదుపాయాలు ఉన్నాయన్నారు. జాతీయ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డీపీ) కింద బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు చేసి పవర్లూమ్ ఆధునీకరణకు సహకరించాలని లేఖలో కోరారు. చేనేత, వస్త్ర రంగంలో పెట్టుబడులు భారతీయ చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమపై కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని ప్రస్తావిస్తూ విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో లావాదేవీలు స్తంభించి లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాత్కాలిక విధానం(షార్ట్ టర్మ్ పాలసీ) రూపొందించి, వేతనాలు, బ్యాంకింగ్, ఎగుమతులకు ప్రోత్సాహకాలు, జీఎస్టీ చెల్లింపులు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ను విస్తృతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ ఈ కామర్స్ వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. చేనేత, వస్త్ర రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రానికి కేటీఆర్ సూచించారు. -
పవర్లూమ్ సమస్యను పరిష్కరించండి
భివండీ, న్యూస్లైన్: పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును భివండీకి చెందిన పద్మశాలీ సంఘాలు కోరాయి. రాజ్ భవన్లో సోమవారం మధ్యాహ్నం భివండీకి చెందిన పద్మశాలీ సంఘాల సభ్యులు గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్థిరపడిన పద్మశాలీల్లో అధిక శాతం మంది పవర్లూమ్ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారని గవర్నర్కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన పవర్లూమ్ ప్యాకేజీ కేవలం జైన్, మైనార్టీ, బడుగు కులాల వారికే లబ్ధిచేకూర్చేలా ఉందని, ఎస్బీసీలకు ఏమాత్రం ప్ర యోజనం కలిగించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్బీసీలకు చెందిన పద్మశాలీలకు కూడా ఈ ప్యాకేజీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భివండీలో తెలుగు ప్రజలు స్థిర పడిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తెలుగు పాఠశాలలు, ఆశ్రమశాల, కార్మికులకు ప్రత్యేక వైద్యశాలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా విన్నవించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అసంఘట్ పవర్లూమ్ విభాగ చైర్మన్, భివండీ పద్మనగర్ పవర్లూమ్ వివర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ పురుషోత్తం, అఖిల పద్మశాలి సమాజం కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, యెల్లె సాగర్ తదితరులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement