-
విన్నపాలు వినవలె..
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మొదటిసారిగా శుక్రవారం ప్రారంభమైన ప్రజాదర్బార్కు జన సందోహం వెల్లువెత్తింది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఫిర్యాదులు పట్టుకొని ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ప్రజాభవన్కు తరలివచ్చారు. వేలాది మంది రావడంతో బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాస ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం ఎనుముల రేవంత్రెడ్డి ఉదయం దాదాపు 10.15 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఏం చేయాలో చూడాలని సీఎం అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. మరికొందరు రోడ్లు, భూములు, ఇతర సమస్యలను ప్రస్తావించారు. గంటసేపున్న సీఎం ప్రతి ఒక్కరి సమస్యలు ఓపిగ్గా విన్నారు. అనంతరం ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిమిత్తం సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి సీతక్క ప్రజాదర్బార్కు వచ్చిన ప్రతిఒక్కరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. మధ్యాహ్నం మూడున్నర వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమం వారంలో రెండురోజులు నిర్వహించేలా.. శాఖల వారీగా ఫిర్యాదులు స్వీకరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే దీనికి సీఎం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 320 సీట్లు .. 15 డెస్కులు ..మౌలిక వసతులు ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. సమస్యల నమోదుకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసి, ప్రతి విజ్ఞాపనకు ప్రత్యేక గ్రీవెన్స్ నంబర్ ఇచ్చి, ప్రింటెడ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం, పిటిషన్ దారులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఎక్ నాలెడ్జ్జ్మెంట్ పంపే విధంగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా నీడతో కూడిన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. హర్షాతిరేకాలు ప్రజాదర్బార్కు వచ్చిన ప్రజలు ప్రగతిభవన్ తలుపులు అందరికీ తెరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజాదర్బార్ నిర్వహించారంటూ గుర్తు చేసుకున్నారు. గడీల పాలనకు చరమగీతం పాడారంటూ కొందరు పాటలు పాడారు. కొందరు ప్రగతిభవన్ పైకి ఎక్కి అంతా కలియదిరిగారు. పచ్చిక బయలుపై, భవనాల వద్ద పెద్ద ఎత్తున ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ప్లాట్లు కబ్జా చేశారు మా అసోసియేషన్కు సంబంధించిన ప్లాట్లను కొందరు కబ్జా చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే విచారించారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టి కబ్జా చేశారని తేలింది. ఎమ్మార్వోపై చర్య తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇప్పటివరకు మోక్షం లభించలేదు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం. త్వరగా న్యాయం చేయాలని కోరేందుకు వచ్చా. –దామోదర్రెడ్డి, చాణిక్యపురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, నాదర్గుల్, రంగారెడ్డి జిల్లా మా పేరు మీద పట్టా చేయించాలి మా భూమి మా పేరు మీద పట్టా చేయించాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారే తప్ప పట్టా చేయించడం లేదు. ఐదు మందిమి ఉన్నా పట్టాలు ఇవ్వలేదు. లక్షలు ఇవ్వాలంటున్నారు. పేదోళ్లం అంత డబ్బులు ఎలా ఇవ్వగలం? – గిరన్న, బాలమ్మ,కాశింనగర్ గ్రామం, వనపర్తి జిల్లా -
జెడ్పీ చైర్మన్ను నేనే
ఒంగోలు: జెడ్పీ చైర్మన్ను తానేనని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబరులో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తాను తాత్కాలికంగా మూడు నెలలపాటు జెడ్పీ చైర్మన్ పదవికి దూరం కావాల్సి వచ్చిందన్నారు. విప్ ధిక్కరించానంటూ జిల్లా కలెక్టర్ తన జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై న్యాయం పోరాటం చేయగా రాష్ట్ర హైకోర్టు తనకు ఇచ్చిన విప్ చెల్లదని పేర్కొనడంతో జెడ్పీటీసీకి అర్హుడినయ్యానని, జెడ్పీటీసీగా అర్హుడినైనప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఆటోమేటిక్గా అర్హుడినేనని అన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరిగి జెడ్పీ చైర్మన్గా విధుల్లోకి వచ్చినట్టేనని, అయితే ఛాంబర్లోకి మాత్రం కార్తీక మాసం, సోమవారం కావడంతో ఈ రోజు అడుగు పెట్టానని అన్నారు. తనను అనర్హుడిగా చేసేందుకు అధికార పార్టీ వారికి ఉన్న అవకాశాన్ని వారు వినియోగించుకున్నారని మాత్రమే వ్యాఖ్యానించగలనని, కోర్టు పరిధిలోని అంశం కావడం, తాను జెడ్పీ చైర్మన్ పదవిలో ఉన్నందున రాజకీయ అంశాలపై మాట్లాడదలుచుకోలేదన్నారు. తన పదవికి సంబంధించి జరుగుతున్న సమస్యంతా టీడీపీ రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధంలేదని, కేవలం స్థానిక రాజకీయ పరిణామాల్లో ఇదో చిన్న అంశం మాత్రమేనని అన్నారు. త్వరలోనే అది సమసిపోతుందని భావిస్తున్నానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పని చేస్తూ రాష్ట్రాభివృద్దిలో భాగం పంచుకుంటానన్నారు. జడ్పీచైర్మన్ సీట్లో కూర్చునే ముందు ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్గా పని చేసిన నూకసాని బాలాజీతో మాట్లాడానని, ఆయన కూడా తనకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ప్రజా దర్బార్లతో... ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో కొంత అలసత్వం చోటుచేసుకుందని, కేవలం మూడు నెలల్లోనే జెడ్పీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానన్నారు. దీనికిగాను జెడ్పీకి సంబంధించిన ప్రతి వ్యవహారాన్నీ ఆన్లైన్లో పెట్టనున్నట్టు చెప్పారు. జెడ్పీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా దర్భార్ను నిర్వహిస్తానన్నారు. జిల్లాలోని 56 మంది జెడ్పీటీసీలతో కలిసి రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తానని, ఇప్పటివరకు నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇక ఆగిపోతుందని భావిస్తున్నానన్నారు. అయితే టీడీపీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోందని విలేకర్లు ప్రశ్నించగా అటువంటి పరిస్థితి వస్తే తాను కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు తాను వారసుడిని అన్నారు. నాగులుప్పలపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజావలీ తదితరులు పాల్గొని ఈదర హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు
భైంసా రోడ్షోలో ఉద్రిక్తత
ఎన్నికలకు సర్వం సిద్ధం
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సమయం లేదు మిత్రమా..
● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్.. ● రూ.2,500, తులం బంగారం ఇచ్చిండా.. ● రూ.2 లక్షల రుణమాఫీ చేసిండా.. ● తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది బీఆర్ఎస్సే ● నిర్మల్ కార్నర్ మీటింగ్లో కేటీఆర్
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫోన్ పోతే ఆందోళన వద్దు
ఆత్రం సుగుణను గెలిపించాలి
నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement