-
లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తా.. మహిళా రక్షణకు ప్రాధాన్యతనిస్తా.. కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తా.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతా.. ఇల్లీగల్ లిక్కర్..గుట్కా..గాంబ్లింగ్ తదితరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తా.. ఇక డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాడే తన బాటను స్పష్టం చేశారు మలికా గర్గ్. తొమ్మిది నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ప్రారంభించారు. నిర్లక్ష్యం, అక్రమార్కులపై వేటు వేశారు. డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్ఐలు, పలువురు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని దూకుడు పెంచారు. తమ మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కింది స్థాయి సిబ్బంది మొదలు డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితులు పోలీస్ సిబ్బందికి, అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్ధవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఎస్పీ మలికా గర్గ్. 2021 జూలై 15న ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. రెండు, మూడు నెలల పాటు జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. హోంగార్డు మొదలుకొని డీఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరేగా ఉండేవి. సలాములతో కాలం గడుపుతూ ఇష్టారీతిన విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీసు సిబ్బందికి, అధికారులకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంథాను మార్చుకున్నారు. తమ వైఖరిలో మార్పురాని వారిపై ఆమె చర్యలకు ఉపక్రమించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. తప్పుచేస్తే అంతే.. విధుల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మలిక గర్గ్ కొన్ని సంఘటనల్లో నిరూపించారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల్లో కఠినమైన చర్యలు చేపట్టారు. ఇటీవల యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన రియల్టర్ హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేశారు. అదేవిధంగా యర్రగొండపాలెం సీఐని వీఆర్కు పిలిపించారు. మార్కాపురం డీఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు. లింగసముద్రం ఎస్సై ఇసుక రవాణా విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో అతనిని సస్పెండ్ చేశారు. కొత్తపట్నం ఎస్సై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు. గ్రానైట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని బల్లికురవ ఏఎస్సైతో పాటు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి హోంగార్డును విధుల నుంచి తప్పించారు. బేస్తవారిపేటలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు మద్యం తాగి న్యూసెన్స్ సృష్టించడంతో వారిరువురినీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై వేటు విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరిపై చర్యలు చేపట్టారు. జరుగుమల్లి ఎస్సై ఇసుక అక్రమార్కుల విషయలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావటంతో ఆమెను వీఆర్కు పిలిపించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్ సిబ్బంది, అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా వీఆర్కు పిలిపించారు. జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మలిక గర్గ్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, పోలీస్ అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు. -
నేడు బంద్
ఒంగోలు, న్యూస్లైన్: రాష్ట్ర విభ జన ప్రక్రియను అడ్డుకునేందుకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి నుంచి శాసనసభ ఆమోదం కోసం వచ్చిన విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్నారు. విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెడితే ఆమోదించినా..ఆమోదించకపోయినా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మారుతుందన్నారు. సమైక్యాంధ్రకు సంఘీభావంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, రాష్ట్రానికి పట్టిన విభజన పీడ ఎదుర్కొనేందుకు వారం రోజులపాటు వైఎస్ఆర్ సీపీ కార్యాచరణ రూపొందించిందన్నారు. శుక్రవారం అన్ని విద్యా, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసేసి తమకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి సమైక్యవాది బంద్కు సంఘీభావం తెలపాలని కోరారు. 4వ తేదీ మోటారు బైకు ర్యాలీ, 6న మానవహారం, 7వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సమన్వయకర్తలు, జిల్లా అనుబంధ కమిటీ నాయకులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల/నగర కన్వీనర్లు, వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి గర్హనీయం: అద్దంకిలో వైఎస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడిని నూకసాని బాలాజీ తీవ్రంగా ఖండించారు. 30 ఏళ్లపాటు రాజకీయ జీవితంలో ఉన్న కరణం బలరాం ఇటువంటి చర్యలను ప్రోత్సహించడం హేయమన్నారు. హింసాత్మక రాజకీయాలే తమ ఎదుగుదలకు కారణమనుకుంటే దానిని ఎదుర్కోవడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. హింసావాద రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వంట గ్యాస్ ధరల పెంపు దారుణంగా ఉందన్నారు. ఒకేరోజు రూ.250 ధర పెంచితే సామాన్యుడు ఆ భారాన్ని ఎలా భరించగలడన్నారు. ఇది సరైన చర్య కాదని, వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆధార్తో సంబంధం లేకుండా సిలిండర్లు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో గ్రామీణ, ఉపాధి పరిశ్రమల విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement